ఆ ఇద్దరూ ఒక్కటే ఆ ఇద్దరూ ఒక్కటే
బాబుకు, జగన్కు తేడా ఏమీ లేదు
-మంత్రి పదవిచ్చిన ఎన్టీఆర్కే బాబు వెన్నుపోటు పొడిచారు
-తల్లిలాంటి కాంగ్రెస్ను జగన్ మోసం చేశారు
-సీఎం పదవి కోసం ఆయన కుట్ర చేస్తున్నారు
-టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కయ్యారు
-రాయదుర్గం ప్రచారంలో సీఎం కిరణ్
అనంతపురం, మే 18:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్డ్డికి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తేడా ఏమీ లేదని ముఖ్యమంత్రి కిరణ్కుమార్డ్డి వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇచ్చి అక్కున చేర్చుకున్న ఎన్టీ రామారావుకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. జగన్ కూడా కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని, రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఏఐసీసీ అధ్యక్షరాలు సోనియాగాంధీని మోసం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి చేటు తేవొద్దన్న మాజీ సీఎం వైఎస్ మాటను ఆయన కొడుకు మర్చిపోయారని ఆరోపించారు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, తల్లిలాంటి పార్టీని మోసం చేసిన జగన్కు తేడా ఏముందని ప్రశ్నించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ అధినేత్రి సోనియాగాంధే వైఎస్ను రెండుసార్లు ముఖ్యమంవూతిని చేశారని వ్యాఖ్యానించారు. ఆయన తమ పార్టీ నేతని, ఆయనను తామెప్పుడూ కించపర్చలేదని చెప్పారు. చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొ ఆయన టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వ పథకాలపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
రాయదుర్గం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కాపు రామచంవూదాడ్డి గురువు జైలులో ఉన్నారని, ఆయన కూడా ఏ క్షణమైనా జైలుకు వెళ్లవచ్చునని సీఎం అన్నారు. జైలుకు వెళ్లే వ్యక్తులు ప్రజలకు ఏం సేవ చేస్తారని ప్రశ్నించారు. అటువంటి వ్యక్తులకు ప్రజలు ఓట్లేయరన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్డ్డిని గెలిపిస్తే రాయదుర్గం రెండేళ్లలో అభివృద్ధి చెందుతుందని, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఆయన గెలిచినట్లే అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వేణుగోపాల్డ్డి స్థానికుడని, స్థానికునికి ఓటేస్తారో, స్థానికేతరునికి ఓటేస్తారో మీరే నిర్ణయించుకోవాలని ఓటర్లను కోరారు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్లకు ఓటేస్తే వృథా అవుతుందని చెప్పారు.
జగన్ వెన్నుపోటుదారుడు
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పటిష్ఠంగా అమలుపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి జగన్ మోహన్రెడ్డి వెన్ను పోటు పొడుస్తూ అభివృద్ధికి అడ్డుతగులుతున్నా రని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. జగన్ పదవీ వ్యామోహంతో ముఖ్య మంత్రి కావా లని అరాచకాలకు పాల్పడుతున్నారని, అవినీతి, అక్రమార్జన, రౌడీలకు, గుండా లకు, నేరస్తులకు ‘‘బాస్’’గా మారి అక్రమ సామ్రా జ్యానికి ‘‘సామ్రా ట్టు’’గా వ్యవహరిస్తున్నా రని ఆరో పించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయ న రాయదుర్గం నియోజకవర్గం లోని కణేకల్లు, బొమ్మనహాళ్లో నిర్వహించిన రోడ్షోలో ప్రసం గించారు. జగన్ ముఖ్యమంత్రి పదవిని కాంక్షించి అనాలోచనతో తీసుకొన్న నిర్ణయ ప్రతిఫలమే బై ఎలెక్షన్లన్నారు. అంతిమ విజయం న్యాయం, ధ ర్మాలకు దక్కుతుందనే నిజాన్ని జగన్ తెలుసు కోవాలన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఖనిజ సంపదను విచ్ఛలవిడిగా దోచుకొన్న గాలి జనార్దన్రెడ్డి జైల్లో ఉన్నాడన్నారు.
కాపు రామ చంద్రారెడ్డి జైలుకెళ్ళడం ఖాయ మని, జైలుకెళ్ళే నాయకునికి ఓటు వేస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. టీడీపీ అభ్యర్థి అయిన గుణపాటి దీపక్రెడ్డి కి నెల్లూరు జిల్లా నుండి వలస వచ్చారని, రాయ దుర్గం నియోజకవర్గం నైసర్గిక స్వరూపం, ఎల్లలు, తెలియని స్థానికేతరుడికి ఈ ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పా లన్నారు. 35 ఏళ్ళుగా రాయదుర్గం నియోజకవర్గానికి ఎన లేని సేవలు చేసిన అనుభవజ్ఞుడు, రాజనీతు జ్ఞుడైన పాటిల్ వేణు గోపాల్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని కోరారు. పాటిల్ ఏది చెబితే అదే జీఓగా విడుదల చేస్తామని హామీనిచ్చా రు. తాను కూడా కరవు ప్రాంతానికి చెందిన వ్యక్తి నేనని ఈ ప్రాం తం అభివృద్దికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు. ఈ ప్రచారంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి, ప్రాథ మిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్, ఎంపీ అనంత వెం ట్రామిరెడ్డి, ప్రభుత్వ విప్ శివరామిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ వేణు గోపాల్రెడ్డ్డి పాల్గొన్నారు.
ముఖ్య వార్తలు
- ఆ ఇద్దరూ ఒక్కటే ఆ ఇద్దరూ ఒక్కటే
- వైఎస్ ఒత్తిడి వల్లే…
- ఇంటి పోరుపై సీరియస్
- సీఎం తెలంగాణ ద్రోహే – కృష్ణా నీళ్ల కోసం నిరసన దీక్ష
- దుర్గంలో దేశం, కాంగ్రెస్ బాహాబాహీ
- రాజ్యసభలో తెలంగాణ లొల్లి!
- జగన్తో ఈ‘ఢీ’…
- గోవాలో భాను, సూరి గొడవ
- జప్తు జీవోలు జారీ
- ఉప ఎన్నికల సంగ్రామం
- సీఎం రోడ్షోలో ప్రమాదం
- నిమ్మగడ్డ,బ్రహ్మనందరెడ్డిలకు10రోజులకస్టడీ
- ప్రత్యక్ష రాజకీయాల్లోకి లోకేశ్!
- కిరణ్కుమార్ భేష్
- షారుఖ్పై వేటు?
- అటాచ్మెంట్ మెమో
- అఖిలపక్ష నేతలతో ఈసీ భేటీ
- మోపిదేవి అరెస్టుకు రంగం సిద్ధం
- ‘గేల్’ విధ్వంసం
- తెలుగు వాడి శక్తిని చాటుదాం
ఆ ఇద్దరూ ఒక్కటే ఆ ఇద్దరూ ఒక్కటే
బాబుకు, జగన్కు తేడా ఏమీ లేదు
-మంత్రి పదవిచ్చిన ఎన్టీఆర్కే బాబు వెన్నుపోటు పొడిచారు
-తల్లిలాంటి కాంగ్రెస్ను జగన్ మోసం చేశారు
-సీఎం పదవి కోసం ఆయన కుట్ర చేస్తున్నారు
-టీడీపీ, టీఆర్ఎస్, [...]
జగన్ ఆస్తుల కేసుతో పాటు, ఓఎంసి అక్రమాల కేసులో రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని సీబీఐ రెండోమారు విచారించింది. శుక్రవారం నాడు సీబీఐ అధికారులు మంత్రి ఇంటికి [...]
Click for more »
ఉపపోరు వ్యూహాలకు కాంగ్రెస్ మరింత పదును పెట్టింది. ప్రచారం ఒకవైపు… జగన్ వ్యవహారం మరోవైపు…. ఉపపోరు దాగ ఇదే పోకడ అనుసరించాలన్న టార్గెట్ పెట్టుకుంది. ఆర్థిక మూలాలు, [...]
Click for more »సీఎం తెలంగాణ ద్రోహే – కృష్ణా నీళ్ల కోసం నిరసన దీక్ష
కృష్ణా జలాల్లో తెలంగాణవాటా సాధనకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు సమరశంఖం పూరించారు. ‘‘మా నీళ్లు మాగ్గావాలె’’ అంటూ నినదించారు. కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వినిపించిన వాదనలేంటో [...]
Click for more »దుర్గంలో దేశం, కాంగ్రెస్ బాహాబాహీ
సాధారణంగా.. ప్రశాంతంగా ఉంటూనే.. ఎన్నికల సమయంలో పెద్దఎత్తున గొడవలు చోటుచేసుకునే అనంతపురం జిల్లాలో అత్యంత ప్రశాంతంగా ఉండే రాయదుర్గం నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్, టీడీపీ బాహాబాహీకి దిగాయి. [...]
Click for more »
తెలంగాణ నినాదాలతో శుక్రవారం రాజ్యసభ దద్ధరిల్లింది. స్వపక్ష, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు ఘాలుగా సాగాయి. తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన ప్రయివేటు తీర్మానంపై చర్చను [...]
Click for more »
జగన్ ఆస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ చాపకిందనీరులా తనపని చక్కబెట్టుకుపోతోంది. ఒక పక్క సీబీఐ దూకుడుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్ వర్గానికి తాజాగా ఈడీ భయం పట్టుకుంది. [...]
Click for more »
మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న భాను కిరణ్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. భాను గన్మన్గా పని చేసిన మధుమోహన్ను [...]
Click for more »
మూడు రహస్య ఉత్తర్వులు
జగన్ మీడియా సహా కోనేరు, సునీల్రెడ్డి ఆస్తులూ
నేడు కోర్టులో సిబిఐ పిటిషన్లు
మంత్రులకూ తప్పని తిప్పలు
జగన్ చుట్టూ సిబిఐ ఉచ్చు బిగుస్తోంది. ఆస్తుల జప్తు(అటాచ్మెంట్)నకు రాష్ట్ర [...]
ఉప ఎన్నికల సంగ్రామంలో తమ అభ్యర్ధులను గట్టెక్కిం చేందుకు ఆయా పార్టీల అగ్రనేతలు రోడ్డెక్కారు. ఒకరిపై మరొ కరి విమర్శనాస్త్రాలు, ఆరోపణలతో ప్రచారం వేడెక్కుతోంది. ఇప్పటివరకూ విడివిడిగా [...]
Click for more »మహిళా.. పిడికిలి బిగించు – దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి
దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి మహిళా పిడికిలి బిగించి పోరాటానికి సిద్ధం కావాలని ఐద్వా ప్రధాన కార్యదర్శి సుధా సుందరరామన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా [...]
Click for more »
మూడు కుటుంబాల్లో మిగిలింది ఒకే ఒక్కడు
అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఫ్యాక్షన్ అంటే ముందు గుర్తుకు వచ్చేది పెనుకొండ, అక్కడ జరిగిన సంఘటనలు తలుచుకుంటేనే వళ్లు జలదరిస్తుంది. [...]
Click for more »ఇంటర్ బోర్డూ తప్పుల మీద తప్పులు
ఫిజిక్స్ పితలాటకం
-సమస్య పునరావృతం
-ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ ఆందోళన
-స్పందించిన ఉన్నత న్యాయస్థానం
-ఇంటర్ బోర్డుకు మొట్టికాయలు
-హాల్టికెట్స్ ఇస్తారా? పరీక్షలు వాయిదా వేస్తారా?
-బోర్డును ప్రశ్నించిన హైకోర్టు
-అందరికీ హాల్టికెట్స్ ఇస్తాం
-ఇంటర్ బోర్డు ప్రకటన
-అయినా విద్యార్థులకు [...]
అంచనాలను మించిన పద్మనాభస్వామి ఆలయ గుప్తనిధి
తిరువనంతపురంలోని సుప్రసిద్ధ పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగ గదుల్లో బైటపడిన బంగారు, వెండి ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు, బంగారు, వెండి నాణేలు, విగ్రహాలు, ఇతర వస్తువుల విలువ [...]
Click for more »ప్రశాంతి నిలయంలో ఘనంగా బాబా జయంతి
భగవాన్ సత్యసాయి బాబా అవతార పురుషులని, పుట్టపర్తి ప్రాంతంలో నడయాడిన ఆ భగవంతుని ధ్యానం చేసుకుంటూ.. జీవనయానం సాగించాలని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. పుట్టపర్తి [...]
Click for more »






















