సంక్షోభాల మధ్య నిలకడగా రాణిస్తున్న రోశయ్య
- వ్యక్తిగత ప్రతిష్టకు దూరంగా… పార్టీకే విధేయుడైన రోశయ్య
విపత్కర పరిస్ధితుల్లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రోశయ్య ఎలాంటి ఉత్సవాలు జరుపుకోకుండానే సిఎమ్ హోదాలో రెండో ఏడాదిలోకి అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఏడాది పాలన పూర్తికాగానే ప్రత్యేకంగా విజయోత్సవాలు, పునరంకితాలు జరుపుకోవడం సంప్రదాయం. కానీ అనారోగ్యం పేరిట రోశయ్య దీన్ని కూడా పక్కన పెట్టారు. గత ఏడాదిలో తాను సాధించిన విజయాలు, భవిష్యత్లో తన ప్రణాళికల గురించి మీడియా,ప్రజలముందు ఊదరగొట్టే ఆసక్తిని ఆయన కనబర్చలేదు. తనకప్పగించిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే చాలన్న ధోరణికే ఆయన పరిమితమయ్యారు.

ఈ ఏడాదిలో రోశయ్యపాలనాతీరు, వ్యవహారశైలిని అవలోకిస్తే…గొప్పప్రజాకర్షణగల నాయకుడిగా రూపుదిద్దుకోలేదు.వాక్చాతుర్యాన్నిపెంచుకోలేదు.వాదనతో నలుగుర్ని ఒప్పించి, మెప్పించగల సామర్థ్యాన్ని సొంతం చేసుకోలేదు.అద్భుత దీపాన్ని చూపెట్టి ప్రజల్లో ఆశలు కల్పించలేదు.కనీసం తనకంటూ సొంతవర్గాన్ని కూడా ఏర్పరుచుకోలేదు.కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తిరిగి కాంగ్రెస్ అధిష్ఠానం ఆధిపత్యం సాధించడానికి ఏడాది రోశయ్యపాలన దారితీసింది. ఈ ఏడాదిలో ఆయన తన వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ఏనాడూ ప్రాకులాడలేదు. పాలనలో తనముద్ర వేయాలన్న తపనా చూపలేదు. పార్టీ తరఫున రాష్ట్రపాలనకు తానొక ధర్మకర్తగానే భావించారు. సోనియా ఆదేశాలకు, ఆకాంక్షల మేరకు ఈ రాష్ట్రాన్ని పాలించడమొక్కటే తన విద్యుక్తధర్మంగా అనుకున్నారు. ఆరేళ్ళపాలనలో వైఎస్తో సమానంగా ఆ మాటకొస్తే అంతకంటే ఎక్కువే మానసిక
శ్రమకోర్చిన రోశయ్య తనపాలనలో కూడా ప్రభుత్వ పథకాలన్నింటిపై వైఎస్ ముద్రే కొనసాగాలని తపనపడ్డారు. 2004నుంచి వైఎస్ పలుపథకాలు ప్రకటించారు. వాటిని క్రమం తప్పకుండా అమలు చేసేందుకు ఆర్ధికమంత్రిగా రోశయ్య పలు కసరత్తులు చేశారు. రోశయ్య కృషి కారణంగానే ఈ పథకాలన్నీ నిరాటంకంగా కొనసాగాయి. కానీ ప్రతిష్ఠ మాత్రం ఒక్క వైఎస్కే దక్కింది. దీనిపై కూడా ఆయనేనాడూ దృష్టి పెట్టలేదు.
రోశయ్యకున్న ఈ మానసిక,నాయకత్వ పరిపక్వతే ఈ రోజున దేశంలోని కాంగ్రెస్ సిఎమ్లందరిలోకి ఆయనకొక ప్రత్యేకతను కొనితెచ్చింది. ఈ ఏడాది కాలంలోరాష్ట్రం అనేక దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంది. ప్రకృతి వైపరీత్యాల్ని చవిచూసింది. వైఎస్ మరణంతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. ఆ ఉపద్రవం నుంచి కోలుకోకముందే రాయలసీమను ముంచెత్తిన వరదలు… ఆపై తెలంగాణా విభజనోద్యమం… దానివెంటే సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం… ఆ తర్వాత వరుసగా లైలా తుపాన్లు, కోస్తా అతలాకుతలాలు, ముందెన్నడూ లేనిరీతిలో కడపలో కూడా ముంపు దృశ్యాలు. మరో వైపు జగన్ చేపట్టిన ఓదార్పుయాత్ర వివాదాలు.
ఇన్ని విపత్కర పరిస్థితులు కూడా రోశయ్యపై వ్యతిరేకముద్ర వేయలేదు. సీమాంధ్ర, తెలంగాణానేతలు పార్టీలకతీతంగా, ప్రాంతాలవారీగా జట్లుకట్టి పరస్పర ఘర్షణలకు పాల్పడినా ఏ ప్రాంతనాయకులు కూడా రోశయ్యను లక్ష్యంగా చేసుకోలేదు. సీమాంధ్రా నేతల పొడగిట్టని తెలంగాణా వాదులు కూడా రోశయ్య ముఖ్యమంత్రిత్వాన్ని మన్నించారు. సీమాంధ్రా మంత్రుల్ని తెలంగాణాలో తిరగనివ్వకపోయినా రోశయ్యకు మాత్రం మినహాయింపునిచ్చారు.
ఇదంతా అజాతశతృవుగా రోశయ్య సాధించుకున్న ఇమేజ్తోనే సాధ్యపడింది. రాష్ట్రాన్నిపాలించిన సంజీవరెడ్డి నుంచి బ్రహ్మానందరెడ్డి, వెంగళరావు, ఎన్టిఆర్, చంద్రబాబు, రాజశేఖరరెడ్డి వరకు తమపాలనా కాలంలో అనేక వివాదాల్ని ఎదుర్కొన్నారు. తమకునచ్చిన వాళ్ళకే పదవులు కట్టబెడుతూ మరికొందర్ని దూరం చేసుకున్నారు. ఈ కారణంగా అనేక రాజకీయ సంక్షోభాలకు గురయ్యారు. కానీ రోశయ్య ఈఏడాదికాలంలో ఎలాంటి ఆరోపణలకు తావివ్వలేదు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రజా విశ్వాసాన్ని కోల్పోలేదు. ఓ విధంగా చెప్పాలంటే గత ఏడాదికాలం రాష్ట్ర చరిత్రలోనే అతికీలక సమయం. 1953నుంచి ఇంతటి విపత్కర పరిస్థితిని రాష్ట్రం ఏనాడూ ఎదుర్కోలేదు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రిగా తొలిఏడాది విజయవంతంగా పూర్తిచేసుకున్న రోశయ్య పథకాలు,ప్రచారాల్తో సొంతముద్ర వేయలేకపోయినప్పటికీ అన్నివర్గాలు,ప్రాంతాలు, ఆఖరకు ఇతర పార్టీల విశ్వాసాన్ని కూడా చూరగొన్న వ్యక్తిగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.
ముఖ్య వార్తలు
- సంక్షోభాల మధ్య నిలకడగా రాణిస్తున్న రోశయ్య
- అధికారం ఉన్నా, లేకపోయినా దేశాభివృద్ధికే అంకితం – సోనియాగాంధీ ప్రతిన
- భారీ జన ప్రదర్శనతో మొదలైన ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర
- ప్రభుత్వానికి అటు విద్యార్థులకు “పరీక్ష” – పోలీస్ వలయంలో పరీక్ష కేంద్రాలు
- సమస్యలు తలెత్తిన కేంద్రాల్లోనే పునఃపరీక్ష – డిజీపి అరవింద రావు
- వైమానిక దళ గౌరవ కెప్టెన్ సచిన్
- వైఎస్ సమాధికి కృష్ణా జలాలతో అభిషేకం – లగడపాటి
- వైఎస్ పధకాలు కొనసాగిస్తాం – రోశయ్య
- పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రభుత్వ విధానాలే ఆటంకం
- వైభవంగా రజనీకాంత్ కుమార్తె వివాహం
- వాడవాడలా జననేతకు ఘనవినివాళి -పలుచోట్ల వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
- అసలైన నివాళి వైఎస్ ఆశయ సాధనే – గాంధీభవన్లో ముఖ్యమంత్రి రోశయ్య
- నిలకడగా రోశయ్య ఆరోగ్యం – పునరంకిత సభ వాయిదా
- వైఎస్ఆర్ పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ
- ప్రధానికి వర్గీకరణపై కెసిఆర్ వినతికి నిరసన తెలంగాణ భవన్ను ముట్టడించిన ఉద్యమ జెఎసి
- ఫలించని మొయిలీ రాయబారం – యాత్రతో పార్టీకి ప్రయోజనమే మొయిలీకి జగన్ స్పష్టీకరణ
- వారసత్వ పోటీ అవినీతికా?నేర చరిత్రకా? – బాబు
- రోశయ్యది దురదృష్టకర పాలనే – రాఘవులు
- బ్లాక్ మెయిల్కు లొంగొద్దు – లగడపాటి
- గ్రూప్ -1 ప్రిలిమ్స్పై గందరగోళం
సంక్షోభాల మధ్య నిలకడగా రాణిస్తున్న రోశయ్య
వ్యక్తిగత ప్రతిష్టకు దూరంగా… పార్టీకే విధేయుడైన రోశయ్య
విపత్కర పరిస్ధితుల్లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రోశయ్య ఎలాంటి ఉత్సవాలు జరుపుకోకుండానే సిఎమ్ హోదాలో రెండో ఏడాదిలోకి అడుగుపెట్టారు. ముఖ్యమంత్రి [...]
Click for more »అధికారం ఉన్నా, లేకపోయినా దేశాభివృద్ధికే అంకితం – సోనియాగాంధీ ప్రతిన
అధికారంలో ఉన్నా లేకపోయినా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల, ముఖ్యంగా బడుగు వర్గాల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని వరుసగా నాల్గవ పర్యాయం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన [...]
Click for more »భారీ జన ప్రదర్శనతో మొదలైన ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర
పార్టీ అధిష్ఠానం మాటను బేఖాతరు చేస్తూ షరామామూలుగానే ధిక్కార ధోరణిలో కడప లోక్సభ సభ్యుడు వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో ఓదార్పు యాత్రను ప్రారంభిం చారు. [...]
Click for more »ప్రభుత్వానికి అటు విద్యార్థులకు “పరీక్ష” – పోలీస్ వలయంలో పరీక్ష కేంద్రాలు
ఇంకొన్ని గంటల్లో ఎపిపిఎస్సీ గ్రూప్-1 పరీక్ష. కమిషన్ పరీక్షను అడ్డుకునేందుకు తెలంగాణా వాదులు సిద్ధమయ్యారు. బంద్కు పిలుపునిచ్చారు. రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తామంటున్నారు. ఎపిపిఎస్సీలో తమకు 42 శాతం [...]
Click for more »సమస్యలు తలెత్తిన కేంద్రాల్లోనే పునఃపరీక్ష – డిజీపి అరవింద రావు
గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాలకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నూతన డిజీపి అరవింద్ రావ్ పేర్కొన్నారు. సమస్యలు తలెత్తిన కేంద్రాల్లోనే పునఃపరీక్షలు జరిపే అవకాశం వుంటుంది [...]
Click for more »వైమానిక దళ గౌరవ కెప్టెన్ సచిన్
భారత వాయుసేన గౌరవ ర్యాంకు అయిన గ్రూప్ కెప్టెన్గా క్రికెటర్ సచిన్ టెండూల్కర్కు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్ క్రీడాకారునిగా దేశానికి సచిన్ అందించిన సేవలకు గుర్తింపుగా [...]
Click for more »వైఎస్ సమాధికి కృష్ణా జలాలతో అభిషేకం – లగడపాటి
ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సమాధికి కృష్ణా జలాలతో అభిషేకం చేయనున్నట్లు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన [...]
Click for more »వైఎస్ పధకాలు కొనసాగిస్తాం – రోశయ్య
దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని సీఎం రోశయ్య పునరుద్ఘాటించారు. అర్హులందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పా రు. [...]
Click for more »పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రభుత్వ విధానాలే ఆటంకం
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందకపోవడానికి ప్రభుత్వమే కారణమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ‘పారిశ్రామికాభివృద్ధికి కాలుష్య వాతావరణం వల్ల వచ్చే అడ్డంకులు’ అనే అంశంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ [...]
Click for more »వైభవంగా రజనీకాంత్ కుమార్తె వివాహం
దక్షిణాది సూపర్స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య వివాహం శుక్రవారం నగరానికి చెందిన వ్యాపారవేత్త అశ్విన్తో అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైలోని రాణి మెయమ్మ హాల్లో పెళ్లి [...]
Click for more »మహిళా క్రికెట్కు జీవం పోసిన మంత్రి గీతా రెడ్డి
విజేతగా తిరిగి రండి – కృష్ణాష్టమి సందర్భంగా రాష్ర్ట సీనియర్ జట్టుకు కిట్లు పంపిణి
కృష్ణాష్టమి సందర్భంగా మంత్రి గీతా రెడ్డి జాతీయ స్థాయి మహిళా క్రికెట్ [...]
Click for more »
మూడు కుటుంబాల్లో మిగిలింది ఒకే ఒక్కడు
అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఫ్యాక్షన్ అంటే ముందు గుర్తుకు వచ్చేది పెనుకొండ, అక్కడ జరిగిన సంఘటనలు తలుచుకుంటేనే వళ్లు జలదరిస్తుంది. [...]
Click for more »ఐఐటి ఫలితాల్లో తెలుగు వెలుగులు – రాష్ట్రానికి ర్యాంకుల పంట
ఐఐటి(జెఇఇ) ఎంట్రెన్స్ ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు విజయదుందుభి మోగించారు. 1959లో ఐఐటిని ఏర్పాటుచేసిన తరువాత జాతీయస్థాయిలో ఓపెన్ కేటగిరీలో మొదటిర్యాంకు రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా [...]
Click for more »మరో శతాబ్దంలోకి మహాకవి శ్రీశ్రీ
దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ సాగిపోయే వీరులకు తన చరణాలను తోడు చేశాడు. శ్రీశ్రీ శత జయంతి సభలుమరెవ్వరికీ జరగనంత గొప్పగా జరిగాయంటే అందుకు [...]
Click for more »మరో శతాబ్దంలోకి మహాకవి శ్రీశ్రీ
దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ సాగిపోయే వీరులకు తన చరణాలను తోడు చేశాడు. శ్రీశ్రీ శత జయంతి సభలుమరెవ్వరికీ జరగనంత గొప్పగా జరిగాయంటే అందుకు [...]
Click for more »





















