అసెంబ్లి బుధవారానికి వాయిదా

శాసన సభ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం సభ ప్రారంభంకాగానే విపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టాయి. అయితే చర్చకు స్పీకర్ తిరస్కరించటంతో కొద్దిసేపు సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం సజావుగా జరిగింది.




