అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నాయి. ఇంటర్ విద్యార్థులకు హాల్టికెట్ల నిరాకరణపై టీడీపీ, పీఆర్పీ, సీపీఐ, భవన నిర్మాణ రంగ కార్మికుల కష్టాలపై సీపీఎం, చేతివృత్తిదారుల ఆత్మహత్యలు, వలసలపై బీజేపీ పార్టీలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.




