ఎవరికి వారే – చీలిపోయిన అఖిలపక్షం

babu-walk
బాబ్లీ వివాదం మీద ఢిల్లీకి వెళ్లిన అఖిల పక్షం ప్రధాని సమక్షంలో రెండుగా చీలింది. సోమ వారం ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో టీడీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలు ఒకేసా రి వెళ్లగా, టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు మాత్రం విడిగా వెళ్లారు. అంతా కలసి సా యంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమా వేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో అఖిల పక్ష ప్రతినిధి బృందం సభ్యులతో ప్రధాన మంత్రి ముప్పా వు గంట సేపు భేటీ అయ్యారు. ఈ వివాదం అతి సున్నితమయినందున, తాను సాంకేతిక నిపుణులతో చర్చించి విషయ అవగాహనకు రావాల్సి ఉందని, ఆ తర్వాత అతిత్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కూర్చుని, చర్చించి, పరిష్కారం కనుగొంటామని మన్మోహన్‌సింగ్‌ వారికి హామీ ఇచ్చారు. సీడబ్ల్యుసీని కూడా సంప్రదిస్తామన్నారు.  అయితే, వారితో ఎప్పుడు భేటీ అవుతామన్న విషయాన్ని మాత్రం నిర్దిష్టంగా హామీ ఇవ్వక పోవడం వల్ల, అఖిలపక్ష సమావేశం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ భేటీలో ఏం జరగబోతోందో ‘సూర్య’లో గత రెండు రోజుల క్రితం ‘బాబ్లీ ఓ డ్రామా’ అన్న శీర్షికతో వార్తా కథనం వెలువడిన విష యం తెలిసిందే. సోమవారం నాడు సరిగ్గా అదే జరగడం విశేషం. ఈ జల వివాదం చర్చల ద్వారానే దీన్ని పరిష్కరించుకోవాలని ప్రధాని పేర్కొనడం బట్టి, మహారాష్ట్ర కాంగ్రెస్‌ సర్కారుపై ఒత్తిడి చేసే ఉద్దేశం ప్రధానికి లేన ట్లు స్పష్టమయింది.  సమావేశానికి హాజరయి న ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడిగా విస్తృతమైన ని వేదికను ప్రధానికి సమర్పించారు. మిగిలిన వారికంటే చంద్రబాబే ప్రధానితో బాబ్లీపై సుదీ ర్ఘంగా మాట్లాడి, ఉత్తర తెలంగాణకు జరుగు తున్న అన్యాయాన్ని వివరించారు. లోపల ప్ర ధాని వద్ద కూడా బాబు ఘాటుగా మాట్లాడా రు. మీరు చర్యలు తీసుకునేలోగా వాళ్లు మొ త్తం గేట్లు కట్టేస్తారని, వాటిని ధ్వంసం చేయా లని డిమాండ్‌ చేశారు. దానితో స్పందించిన ప్రధాని తాను ఇద్దరు ముఖ్యమంత్రులతో స మావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అఖిల పక్షం ముక్త కంఠంతో బాబ్లీ నుంచి తెలంగాణా జిల్లాలను రక్షించాలని కోరారు.
ప్రధాని వారి సూచనలు, డిమాండ్లను సావ ధానంగా విన్నారు. ప్రధాని హామీ పట్ల టీడీపీ, సీపీఐ, సీపీఎం మినహా అన్ని పార్టీలూ సంతృ ప్తి వ్యక్తం చేశారు.అయితే, బాబ్లీపై ఢిల్లీకి వెళ్లిన అఖిలపక్షం నేతలు రెండుగా చీలిపోయినట్లు స్పష్టంగా కనిపించింది. ప్రధానితో సమావేశం ముగిశా క, ముఖ్యమంత్రితో పాటు అన్ని పార్టీల నాయకులు మీడియా ముందుకొచ్చి సమావే శం వివరాలను వెల్లడించగా, తెలుగు దేశం అధినేత చంద్రబాబు మాత్రం వీరితో కలవలే దు. తొలుత ముఖ్యమంత్రి రోశయ్య మీడి యాతో మాట్లాడుతూ, ప్రధాని త్వరలోనే రెం డు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు వివరించారు.
ఆయన అందరి సూచనలనూ సావధానంగా విన్నారని చెప్పారు. సమావేశం పూర్తి సంతృ ప్తికరంగా సాగిందన్నారు. మధ్యలో మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు రోశయ్య అస హనం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ కుమార్‌ మాట్లాడారు. ఆయన కూడా ప్రధా నితో సమావేశం తమకు సంతృప్తి నిచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ అధి నేత చిరంజీవి మాట్లాడారు. ఆయనయితే రోశయ్యకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుం డా మాట్లాడారు. ప్రధానితో తమ చర్చలు పూ ర్తి సంతృప్తిని ఇచ్చాయని ప్రభుత్వానికి అండ గా నిలిచే విధంగా మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ప్రధానితో చర్చలు అసంతృప్తి కలిగించిందని, నిర్దిష్ట హామీ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. అయితే, గతంలో కంటే కొంత మెరుగుగా ప్రధాని స్పందించారని చెప్పారు.
సీపీఐ నేత జూలకం టి రంగారెడ్డి కూడా ప్రధాని వైఖరి సంతృప్తి కలిగింలేదని, సమస్య పరిష్కారం కోసం ఉద్యమిస్తామని ప్రధాని సమక్షంలోనే చెప్పా రు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విడి గా విలేకరులతో మాట్లాడారు. ఆయన మాత్రం ఆవేశంగానే కనిపించారు. ప్రధాని సమాధానానికి ఆయన తీవ్ర అసంతృప్తి వ్య క్తం చేశారు. ప్రధాని వైఖరి సందేహాస్పదంగా ఉందని, సమస్య పరిష్కారానికి ఆయన చిత్త శుద్ధితో వ్యవహరించగలరన్న నమ్మకం తమ కు కలగలేదని అన్నారు. 2007లోనూ ప్రధాని ఇలాగే చెప్పారని, ఆయన నిర్దిష్ట సమాధానం ఇవ్వలేదని పెదవి విరిచారు.
ప్ర ధాని స్పందించాల్సిన రీతిలో స్పందించలేదని, ఆయనలో ఫెడరల్‌ స్ఫూర్తి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఢిల్లీలో కనిపించిన దృశ్యాలు, రాజకీయ పక్షాలు వాదించిన తీరు పరిశీలిస్తే ఒక్క తెలుగుదేశం, సీపీఐ, సీపీఎం మినహా మిగతా పక్షాలన్నీ ప్రభుత్వానికి మిత్ర పక్షాలుగా కనిపించాయన్న వ్యాఖ్యలు వినిపిం చాయి. ప్రధాని సమావేశంతో సంతృప్తి చెం దారా అని విలేకరులు ముఖ్యమంత్రిని ఉద్దే శించి అడిగినప్పుడు రోశయ్య కాస్త తటపటా యింపుగా చూస్తుండగా, వెంటనే పక్కనే ఉన్న చిరంజీవి కల్పించుకుని.. అవును.. సంతృప్తి చెందాం.. అని సీఎంకు అండగా నిలిచారు. వెంటనే రోశయ్య అందుకుని దానినే పునరు ద్ఘాటించారు.
ముఖ్యంగా చిరంజీవి పాలక కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత మిత్రపక్షంగా వ్యవ హరిస్తున్నట్లు కనిపించేందుకు తహతహలా డారనిపిం చింది. ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుని నుంచి అఖిల పక్షం మీద ప్రతికూల స్పందన రాలే దు. కాంగ్రెస్‌ నేతృత్వంలో అఖిల పక్షం ఒక వైపు, ప్రతిపక్షం మరోవైపు మోహరించి ప్రధాని సమావేశానికి వెళ్లాయి. లోపల కూ డా అదేరీతిలో వ్యవహరించాయి. లోపల చంద్రబాబు, నారాయణ ఇద్దరే నిష్కర్షగా, ఘాటు గా మాట్లాడినట్లు సమాచా రం. ప్రధాని వైఖరి రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం సానుకూ లంగా లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమ యింది. మహారాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రధాని ఖండించడం గానీ, అది అన్యా యమ ని గానీ ఎక్కడా వ్యాఖ్యానించక పోవడం, పైగా తాను సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌తో మాట్లాడ తానని చెప్పడం చూస్తే బాబ్లీపై మొత్తం గేట్లు పూర్తి చేసేవరకూ ప్రధాని ఎలాంటి చర్యలు తీసుకోబోరని స్పష్టమవు తూనే ఉంది.

Leave a Reply

free website analytics