కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం – 5గురు మృతి

కర్నూలు జిల్లాలో గత అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని పెదపాడు వద్ద లారీ-జీప్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులంతా కర్నాటకు చెందినవారుగా గుర్తించారు. శ్రీశైలానికి వెళ్ళి వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.




