కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదు – చంద్రబాబు

కాంగ్రెస్ పార్టీ పాల నలో రాష్ట్ర ప్రజలకు ఒరింగిందేమీ లేకపోగా సమస్యలు మరిన్ని పెరిగాయని మాజీ ముఖ్య మంత్రి , టిడిపి అధినేత నా రా చంద్రబాబునాయుడు విమర్శించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం జిల్లాకు విచ్చేసిన చ ంద్రబాబుకు జిల్లా ముఖద్వారం పైడి భీమవరం వద్ద నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడి ట్రేడ్ యూనియన్ నాయకుల నుంచి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరువాత అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయ నున్న కొవ్వాడ మత్స్యలేశం ప్రాంతాన్ని సంద ర్శించారు. తరువాత ఎచ్చెర్లలోని అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థులను కలిశారు.
నేరుగా సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. తొలిరోజు పర్యటనలో భాగంగా పలు చోట్ల చంద్రబాబు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ సర్కారు ఏలికలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఆరేళ్ల పాలనలో వైఎస్ రాజశేఖర్రెడ్డి కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని తీవ్ర విమర్శలు చేశారు. అల్లుడు, కొడుకు, స్నేహితులు, బంధువులకు ప్రజా సంపదను అప్పనంగా వైఎస్ అప్పగించారని విరుచుకుపడ్డారు. మంత్రులంతా అవినీతి ‘ఘను’లేనని, వారి కళ్లు పడితే కొండలు క్షణాల్లో కనుమరుగవుతున్నాయని అన్నారు. ఇంతటి అవినీతి పరులను ఎక్కుడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం విక్రయాల ద్వారా ఖజాను నింపుకొంటున్న ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ విషయంలో మాత్రం తీవ్ర అలక్ష్యం వహిస్తోందన్నారు. నిధుల లేమి సాకుతో రోశయ్య ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్లో ఆడుకుంటోందని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం లోనూ కప్పదాటు వైఖరిని కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్నారన్నారు.




