టివి చానళ్ళకు నోటీసులు జారీచేసిన హైకోర్టు
నేర కథనాల ప్రసారాలు నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ లెక్కజేయక ప్రసారం చేస్తున్న టివి చానళ్ళపై బుధవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు నేరకథనాలు ప్రసారం చేస్తున్న కొన్ని చానళ్ళకు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నేరకథనాల వలన యువత పెడదోవ పట్టే అవకాశం ఉన్నదని కోర్టు అభిప్రాయపడింది.




