టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు నేడే
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు పరీక్షల సంచాలకుల కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. జూన్ 24 నుంచి ఈ నెల 7 వరకు జరిగిన ఈ పరీక్షలకు 3.73 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. రూ.10 చెల్లించి ఈ-సేవా కేంద్రాల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు తెలుసుకోవచ్చు. www.ankusam.com, వెబ్సైట్ ద్వారా మార్కులు పొందవచ్చు.




