తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన విప్
గార్లదిన్నె మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ శైలజానాథ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఫిర్యాదుల దినోత్సవం సందర్భంగా తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోన్నారు. ఈసందర్బంగా మండల స్థాయి అధికారులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోసౌకధాన్యపు దుఖానాలపై పలు ఫర్యాదులు వస్తున్నాయి. సరుకులు సక్రమంగా ప్రజలకు అందేవిదంగాచర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉత్తీర్ణతా శాతం పెంపెందించి, మెరుగైన విద్యను అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు మరుగుదోడ్ల నిర్మాణం చేపడుతామని హామి ఇచ్చారు. విఫ్ వెంట మండల కాంగ్రెస్ నాయకులు వై.నారాయణరెడ్డి, స్థానిక నాయకులు గేటు కృష్ణారెడ్డి, తహాశీల్ధార్ కేయస్. రామారావు, ఎంపిడిఓ రాజుగోపాల్, డిప్యూటీ తహాశీల్ధార్




