నేడు మహబూబ్నగర్ జిల్లాలో చంద్రబాబు పర్యటన

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. గతేడాది వరద భారిన పడ్డ గ్రామల్లో బాధితులను చంద్రబాబు పరామర్శించనున్నారు. జిల్లాలో ముంపుకు గురైన రాజోళీ గ్రామంలో అన్ని పోగొట్టుకున్న చేనేత కార్మికులను బాబు కలవనున్నారు. ఈ రాత్రికి కర్నూలులో బాబు బస చేయనున్నారు. రేపు కర్నూలు జిల్లాలోని వరద బాధితులను కలవనున్నారు.




