బుట్టాయగూడెం పీవో ఇంటిపై ఎబిబి దాడులు
బుట్టాయిగూడెం ఐటీడీఏ పీవో సదర్శన్ నివాసంపై అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించింది. బుట్టాయగూడెం ఆచంట నివాసాల్లో సోదాలు జరుపుతోంది. కృష్ణా జిల్లా గన్నవరంలోని నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో కోటి రూపాయలకు పైగా ఆస్తులున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా సుదర్శన్ నుంచి రూ. లక్ష నగదుతో పాటు ఆస్ర్టేలియా డాలర్లను స్వాధీనం చేసుకున్నారు.




