బ్రాహ్మణి స్టీల్స్పై వాగ్వాదం – 15 నిమిషాలు సభ వాయిదా
బ్రాహ్మణి స్టీల్స్పై విధానసభలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. మైనింగ్ మాఫియాను ప్రభుత్వం సమర్థిస్తోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో సభలో గందరగోళానికి దారితీసంది. ఈ సందర్భంగా చేసిన పలు వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. అనంతరం సభను 15 నిమిషాల సేపు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.




