బ్లాక్ మెయిల్కు లొంగొద్దు – లగడపాటి

ఏపీపీఎస్సీ పరీక్షలను యథాతథంగా కొనసాగించాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలో వైఎస్, రంగా విగ్రహాలను ఆవిష్కరించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాంతాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలవారీగా పరీక్షలు నిర్వహించడం కుదరదన్నారు. ప్రభుత్వం కూడా బ్లాక్మెయిల్ రాజకీయాలకు లొంగకూడదని సూచిం చారు. ప్రభుత్వం పరీక్షలు జరపకపోతే నాయకులపై విద్యార్థులు తిరగబడే పరిస్థితి ఉందన్నారు.




