రాజగోపాల చిదంబరానికి ఎస్వీయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం నేడు

36108499
కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు, ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త, ప్రొఫెసర్ రాజగోపాల చిదంబరం శుక్రవారం శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలంనుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు.  ఈరోజు సాయంత్రం తిరుపతిలోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగే ఎస్వీయూ 50వ స్నాతకోత్సవానికి చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరవుతున్నారు.  ఈ సందర్భంగా 65 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 33,317 మందికి డిగ్రీ పట్టాలు అందచేస్తున్నట్టు వర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రభాకరరావు తెలిపారు.

Leave a Reply