వరద బాధితులు ఇప్పుడు గుర్తొచ్చారా? – డి.కె అరుణ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరద బాధితులు ఇప్పుడు గుర్తుకొచ్చారా? అని మంత్రి డి.కె అరుణ ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్దికోసమే ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చించకుండా ఎంతసేపు సభాసమయాన్ని వృథా చేయడంపైనే దృష్టి పెట్టారని అరుణ ఎద్దేవ చేశారు.




