విద్యార్థులు ఆదర్శవంతంగా ఎదగాలి – కలెక్టర్ జనార్ధన్ రెడ్డి
విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఆదర్శవంతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.జనార్థనరెడ్డి విద్యార్థులకు హితవు పలికారు. నార్పల మండలం బి.పప్పూరు ఎస్సీ గురుకుల పాఠశాలను బుధవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ ఓబులేసు పాఠశాల స్థితిగతుల గురించి ఆరా తీశారు. ఆంగ్లభాషను అభివృద్ధి చేయాలని కలెక్టర్ కోరారు.




