వైఎస్ సమాధికి కృష్ణా జలాలతో అభిషేకం – లగడపాటి

ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సమాధికి కృష్ణా జలాలతో అభిషేకం చేయనున్నట్లు విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది సెప్టెంబరు 2న వైఎస్ మరణించినా ఆయన భౌతికకాయాన్ని సెప్టెంబరు 4న సమాధి చేశారని, అందుకే ఆరోజున పవిత్ర జలాలను ఇడుపులపాయకు తీసుకుని వెళతామని తెలిపారు. అక్కడ వైఎస్ సమాధిని శనివారం ఆ జలాలతో అభిషేకించి తిరిగి అదే హెలికాఫ్టర్లో విజయవాడకు తిరిగి వస్తామన్నారు.




