సమైక్యాంధ్రకు వెయ్యి కారాణలు చూపుతాం- సోమిరెడ్డి
రాష్ట్ర విభజనకు వంద కారణాలు చూపితే.. సమైక్యంధ్రకు వెయ్యి కారణాలు చూపుతామని సోమిరెడ్డి చెప్పారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జిల్లాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్, టీఆర్ఎస్ అధినేత కేసీఆరే బాధ్యత వహించాలని సోమిరెడ్డి అన్నారు. కేసీఆర్, హరీష్రావుల ఉద్వేగపూరిత మాటలే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమని ఆయన చెప్పారు.




