సమైక్యాంధ్రే మన నినాదం – జెసి దివాకర్రెడ్డి
సమైక్యాంధ్రే మన నినాదమని శ్రీకృష్ణ కమిటీకి స్పష్టంగా చెప్పాలని రాయలసీమ ప్రజలకు మాజీ మంత్రి జెసి దివాకర్రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ, ఆంధ్రా కలసి ఉంటే లాభం లేదన్నారు. రాష్ట్రం విడిపోతే ఆంధ్రావారికి వచ్చిన నష్టం ఏమీలేదన్నారు. తెలంగాణ వారి అనుమతిలేకుండా చుక్కనీరు కూడా రాయలసీమకు రాదని సూచించారు. రాయలసీమకు వనరులంటూ ఏమీలేవని ఆయన తెలిపారు. ఒకవేళ రాష్ట్రం విడిపోతే రాయలసీమను తెలంగాణలో కలపాలని దివాకర్రెడ్డి కోరారు.




