సేవా టిక్కెట్ల అక్రమాలపై విచారణ – విజిలెన్స్‌ డిజి దినేష్‌ రెడ్డి

Dinesh
ఏడుకొండల స్వామి వారి ఆర్జిత సేవా టిక్కెట్ల ను అక్రమాలకు పాల్ప డిన ఎంతటి వారైనను ఉపేక్షించేది లేదని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌బ మెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ డిజిపి దినేష్‌రెడ్డి తెలిపారు. ఆర్జిత సేవాటిక్కెట్ల అక్రమాలను రెండు రోజులపాటు తిరుమలలో విచారణ చేపట్టడానికి ఐజి అనూరాధ, డిఐజి హరీష్‌గు ప్తాతో కలిసి సోమవారం సాయం త్రం విచ్చేశారు. ఈ సందర్భంగా పోలీసు గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేసు పురోగతిని వెల్లడించారు. స్వామి వారి దర్శనం ఆర్జిత సేవా టిక్కెట్లు ముందస్తు బుకింగ్‌లో భారీ స్థాయిలో అవకతవకలు, అక్రమాలతోపాటు ఉద్దేశపూర్వ కంగా ఉద్యోగులు, బయట వ్యక్తులు, పెద్దలు నేరాలకు పాల్పడ్డారని చెప్పారు.
ఎంతటి పెద్దలైనా వదిలే ప్రసక్తి లేద ని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, టిటిడికి తాము సిఫార్సు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన టిటిడిలో అక్ర మాలకు పాల్పడిన ఉద్యోగులపై శాఖా పరమైన చర్యలతోపాటు కఠిన చర్య లు తీసుకోవాలని, అక్రమాలకు కార కులైన ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు పెట్టవల్సినవసరం ఉందని ఆయన అన్నారు. ఒకే వ్యక్తి 160 నుంచి 170 టిక్కెట్లు అడ్వాన్సు రిజర్వే షన్‌ చేసుకో వడం వలన అక్రమ మార్గంలో ధన పంపిణి కాక, నిజమైన భక్తులు ఆర్జిత సేవా టిక్కెట్లను పొందడం దుర్లభంగా మారిందన్నారు. 60, 70 ఏళ్ల వర కు ఒకే పర్యాయం టిక్కెట్లను అడ్వాన్సు బుకింగ్‌ చేయిం చుకోవడం వెనుక తెలివైన నేర ప్రవృత్తి దాగుందన్నారు. ప్రభుత్వానికి ఆర్జిత సేవాటిక్కెట్ల కుంభకోణంపై నివేదికను మరో 15 రోజుల్లో సమర్పించనున్నట్లు ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Leave a Reply

free website analytics