స్పీకర్ ఛాంబర్ ఎదుట టిడిపి ఎమ్మెల్యేల ఆందోళన
అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ ముందు బుధవారం తెలుగుదేశం పార్టీ సభ్యులు బైఠాయించి ఆందోళన జరిపారు. డిప్యూటీ స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వకండా సభను పదేపదే వాయిదా వేస్తున్నారని ఆరోపిస్తూ టిడిపి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చుంటే మాత్రం తాము వెల్లో కూర్చుని కార్యకలాపాలకు దూరంగా ఉంటామని ఎమ్మెల్యేలు హెచ్చరించారు.




