18న ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ కాంగ్రెస్ బృందం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను శ్రీకృష్ణ కమిటీకి తెలియజేయడానికి ఈనెల 18న 20 మంది సారథ్య బృంద నేతలు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నట్టు పీసీసీ ప్రతినిధి నిరంజన్ చెప్పారు. అంశాల వారీ విశ్లేషణాత్మక నివేదికల రూపకల్పనలో నిపుణుల సహకారం తీసుకున్నామన్నారు.




