అనంతపూర్
పదోతరగతి ఫలితాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి పాస్ కావాలని టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే 100 శాతం ఫలితాలు రావడం ఖాయమని జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ పేర్కొన్నారు. త్వరలో టెన్త్ పరీక్షలు జరగనుండటంతో ఫలితాల శాతాన్ని పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై విద్యాశాఖ బుధవారం ఆర్ట్స్ కళాశాల డ్రామాహాలులో హెచ్ఎంలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కలెక్టర్ హాజరై గత ఐదేళ్ళుగా వచ్చిన ఫలితాలను ఆరా తీశారు. హెచ్ఎంల నుంచి తీసుకుంటున్న చర్యలు ఉన్న సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు నీటి ఎద్దడి వల్ల జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇందులో ప్రధానోపాధ్యాయులదే ప్రధాన పాత్ర అన్నారు.
50 రోజులే కీలకం. ప్రతి ఒక్కరూ కమిట్మెంట్తో పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యార్థీ తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. వెనుకబడి ఉన్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రధ్ధ తీసుకొని ఆయా సబ్జెక్టులలో ప్రావీణ్యం సాధించేలా చూడాలన్నారు. ఇంటర్మీడియట్కు స్కూల్ అసిస్టెంట్లను ఎగ్జామినర్లుగా నియమించకూడదని డీఈఓకు కలెక్టర్ ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్లను కూడా పాఠశాలలను పర్యవేక్షించేలా చేస్తానని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి వారు చర్యలు తీసుకుంటామన్నారు. అదనపు జేసీ చెన్నకేశవరావు మాట్లాడుతూ.. తెలుగులో కూడా ఫెయిలవుతున్నారని, ఇది ఎంతో బాధాకరమన్నారు. మొక్కుబడిగా వ్యవహరిస్తే ఫలితం ఉండదని, వ్యక్తిగత శ్రద్దతో ఈ 50 రోజులు ప్రతి ఒక్కరూ పనిచేస్తేనే అనుకున్నది సాధిస్తామన్నారు. అందరూ కలిసి ఓ టీంలా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ ప్రేమానందం, డిప్యూ టీ డీఈఓ మునయ్య, ఏడీ రామకృష్ణ, ఏసీ సుబ్బారావు, డీసీఈబీ కార్యదర్శి నాగభూషణ, హెచ్ఎంల సంఘం అ ధ్యక్ష కార్యదర్శులు వెంకటరాముడు, చలపతిలతో పాటు జిల్లాలోని అన్ని ఉ న్నత పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ తునీకలు, కొలతల పై అవగాహన కల్గి ఉండాలి. వ్యాపారులు ఎక్కడైన మోసాలకు పాల్పడుతుంటే తమ హెల్ప్ లైన్లు 18604253333, 9490165647/53 నంబర్లకు కాల్ చేయాలని సటే కంట్రోలర్ఒ వీకే సింగ్ కోరారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమకు కాల్ చేసిన 24 గంటల్లోపు స్పందిస్తామన్నారు. అక్రమాలు జరుగుతున్నట్టు నిర్ధారణౖతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ శాఖను బలోపేతం చేయాలని రీ ఆర్గనైజేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం బలోపేతం చేసేందుకు సన్నద్ధంగా ఉందన్నారు. తునీకలు, కొలతలలో తేడాలుంటే అక్కడి యజమానులతో వాగ్వివాదానికి దిగడం లేదా, ఇక వీరింతే అన్నట్టుగా నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారే కానీ.. తమకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. అలా సమాచారమిస్తే అక్రమాలకు పాల్పడుతున్న వారి భరతం పడుతామని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా తమకు రాతపూర్వకంగా కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ, ఆర్డబ్ల్యూడి బిల్డింగ్, 209, గాంధీ నగర్ హైదరాబాద్ చిరునామాకు లేఖ రాయవచ్చునన్నారు. జిల్లాలో 2008.09. రూ. 4 లక్షల అపరాద రుసుము విధించామని.. 2009.10లో రూ. 1.3 కోట్లు, 2010.11కు రూ. 1.52 కోట్లు అపరాదరుసుము విధించామన్నారు. ప్రజలు మరింత అవగాహన పెంచుకుని, తమకు సహకరిస్తే, అక్రమాలను అరికడుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న మూడు ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేసి, మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాయలసీమ ఇన్ఛార్జీ భీమన్ రాజు, డిఐ దయాకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో గత రెండుమూడేళ్లుగా వాహనాలకు నిప్పు పెడుతూ.. కలకలం సృష్టించిన ఆగంతకుడిని ఎట్టకేలకు అనంతపురం పొలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సయ్యద్ మహ్మద్ అలీయాస్ జాన్సన్ చాలా కేసులలో నిందితుడు. ఈయన వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు వెళ్లినప్పుడే అతనికి సరిపడే సొమ్ము దొరకకపోతే ఆ కోపంతో అక్కడే ఉన్న వాహనాలకు నిప్పు పెడుతున్నట్టు విచారణలో వెల్లడైంది. ఈయనది కేరళ రాష్ట్రం వనంపేట గ్రామం, తిరుచ్చి జిల్లా. రెండుమూడేళ్లుగా వాహనాలకు నిప్పుపెడుతున్న సంఘటనలో నిందితున్ని అరెస్ట్ చేయాలని ఎస్పీ షహనవాజ్ ఖాసీమ్ సీరియస్గా తీసుకున్నారు. దీంతో డిఎస్పీ దయానందరెడ్డి నేతృత్వంలో పొలీసులు స్థానిక రైల్వే స్టేషన్ వద్దనున్న జాన్సన్ అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న వాహనాల దగ్ధం కేసులలో ఇతనొక్కడే నిందితుడు కాదని, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని డిఎస్పీ దయానందరెడ్డి పేర్కొన్నారు.
అర్హులైన విద్యార్థులందరికీ స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ సక్రమంగా పంపిణీ చేయడానికి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అదనపు జాయింట్ కలెక్టర్ (ఎజెసి) చన్నకేశవరావు పేర్కొన్నారు. ఆన్లైన్ స్కాలర్షిప్లపై బుధవారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ప్రిన్సిపాళ్లు, వెరిఫికేషన్ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎజెసి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో స్కాలర్షిప్, రియంబర్స్మెంట్కు అర్హులైన విద్యార్థులను గుర్తించడంతో వెరిఫికేషన్ ఆఫీసర్ల పాత్ర కీలకమని, వారి సర్టిఫికెట్లు సక్రమంగా పరిశీలించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ కోసం రెన్యువల్, ప్రెష్ కింద 89085 దరఖాస్తులు రాగా వాటిలో కళాశాల స్థాయిలో 40960 దరఖాస్తులు పెండింగ్లో వున్నాయని, వీటిని త్వరితగతిన వెరిఫికేషన్ పూర్తీ చేయాలని సంబంధిత ప్రిన్సిపాళ్లు, వెరిఫికేషన్ అధికారులను ఎజెసి ఆదేశించారు. 17753 దరఖాస్తులు మాత్రమే వెరిఫికేషన్ పూర్తీ చేశారని, మిగిలిన వాటిని కూడా నిర్ణీత కాలంలో పూర్తీ చేయాలని సూచించారు. ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ, వికలాంగుల శాఖల పై డివిజన్ల వారీగా దరఖాస్తుల వివరాలను ఆయన సమీక్షించారు. వెరిఫికేషన్ తక్కువగా వున్న వాటిపై సంబంధిత అధికారులు మానిటరింగ్ చేయాల్సివుందన్నారు. ఆన్లైన్ విధానంపై అనుభవం వున్న సిబ్బందిని వినియోగించుకోవాలని, ఎక్కడా వివాదాలు, సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. స్కాలర్షిప్, రియంబర్స్మెంట్పై రాష్ట్ర రెవెన్యూశాఖా మంత్రి ఎన్.రఘువీరారెడ్డి నేతృత్వంలో త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నామని, ఈ లోపల 80 శాతం వెరిఫికేషన్ పూర్తీ చేయాలని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ డి ప్యూటి డైరెక్టర్ వీర ఓబులు, బిసి సంే మశాఖ అధికారి ఐ.ఆర్.భార్గవి, గిరిజన సంక్షేమశాఖ అధికారి మురళీబాబు, అసిస్టెంట్ సంక్షేమశాఖ అధికారులు రవీంద్రనాథ్రెడ్డి, మేరీవసంత, ఎస్ఎల్వి ప్రసాద్, ఆవులయ్య, వీరారెడ్డి, మదన్మోహన్రెడ్డి, కృత్రిక, మల్లికార్జున, వెంకటరాజు, లక్ష్మానాయక్, నారాయణ, చిన్నంబ తదితరులు, జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
అ క్రమంగా తరలిస్తున్న 135 బస్తాల చౌకబియ్యాన్ని మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. బియ్యం అక్రమ రవాణాపై సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి ఎస్ఐ సుధాకర్ యాదవ్ దాడిచేసి పట్టుకున్నారు. 67 క్వింటాళ్ల బియ్యం తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం నుంచి కర్నాటకకు తరలిస్తుండగా కురాకులపల్లి, కర్నాట క సరిహద్దు వద్ద పట్టుకున్నారు. డ్రైవ ర్ లక్ష్మీనారాయణ, క్లీనర్ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం స్టాక్ పాయింట్ నుం చి కర్ణాటక రాష్ట్రంలోని పావగడకు తరలిస్తున్నట్లు డ్రైవర్ ఎస్ఐకి తెలిపాడు. విజిలెన్స్ అధికారులకు ఎస్ఐ సమాచారం అందించారు. కంబదూ రు స్టేషన్కు చేరుకున్న విజిలెన్స్ అధికారులు డ్రైవర్ నుంచి వివరాలు సేకరించారు. ఎక్కడి నుంచి తరలిస్తున్నా రు, ఎన్నిరోజుల నుంచి సాగుతోంది తదితర సమాచారం రాబట్టారు. బా ధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వారు తెలిపారు. విజిలెన్స్ సీఐ ప్రతాప్రెడ్డి, తహసీల్దార్ షెక్షావ లి, కానిస్టేబుల్ ఖాదర్వలీ వివరాలు నమోదు చేసుకున్నారు. స్టాక్ వివరాలు తెలసుకునేందుకు సీకేపల్లికి వెళ్లినట్లు సమాచారం.
ప్రతి సోమవారం రెవిన్యూ భవన్లో జరిగే ప్రజావాణి (గ్రీవెన్స్సెల్)కి తప్పనిసరిగా ఆయా శాఖల అధికారులు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ వీ.దుర్గాదాస్ ఆదేశాలు ఇచ్చారు. అధికారులు గైర్హాజరైతే మెమో జారీ చేస్తామని హెచ్చరించారు. స్థానిక రెవిన్యూ భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి అనంతరం అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రావెన్స్కు అనేక మంది అధికారులు హాజరు కావడం లేదని, వారి తరుపున క్రింద స్థాయి అధికారులు హాజరవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్, జేసి, ఏజేసి, డిఆర్ఓలు ప్రజావాణికి హాజరవుతుంటే, మీ అధికారులకు ఏం పని వుందని సిబ్బందిని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్, వ్యవసాయ శాఖ జెడిఏ, మార్కెటింగ్ ఏడి, ఎక్సైజ్ ఈసి, మైనార్టీ కార్పోరేషన్ ఇడి తదితర శాఖల అధికారులు హాజరుకావడం లేదని కలెక్టర్ మండిపడ్డారు. వచ్చే సోమవారం నుండి గ్రీవెన్స్సెల్కు శాఖల అధికారులు తప్పని సరిగా హాజరుకావాలన్నారు. జిల్లా అధికారులు ఎవ్వరైనా స్పెషలాఫీసర్లుగా వుంటే అలాంటి వారు మినహా మిగిలిన వారందరూ తప్పని సరిగా హాజరుకావల్సిందేనన్నారు. స్పెషలాఫీర్లుగా వున్న శాఖలలో వారి క్రింద స్థాయి సీనియర్ఒ అధికారులు హాజరు కావాలన్నారు. ప్రజా వాణిలో ఏ,జె,సి కేటగిరిలుగా వర్గీకరించిన ప్రజల దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో జేసి అనితారామచంద్రన్, ఏజేసి చెన్నకేశవరావు, డిఆర్ఓ సుదర్శన్రెడ్డి, హౌసింగ్ పిడి ప్రసాదరావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వం మద్యం మాఫియాలను పెంచి పోషిస్తోంది. పేద ప్రజల రక్తాన్ని జలగల మాదిరి పీల్చి పిప్పిచేస్తున్న మద్యం సిండికెట్లపై కఠినంగా వ్యవహరించాల్సి వుందని తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఏలు వినూత్న నిరసనకు దిగారు. సోమవారం నగరంలోని తాడిపత్రి బస్టాండ్ వద్ద నున్న మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పొలిట్బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు, ఎంఎల్ఏలు పరిటాల సునీత, పల్లెరఘునాథరెడ్డిలు మాట్లాడారు. కూలీ నాలీ చేసుకుని పొట్టపోసుకుంటున్న సామాన్య ప్రజల జీవన విధానాన్ని మద్యం మాఫియా శాసిస్తోందన్నారు. మద్యం ఎంఆర్పి ధరలకే విక్రయించాలని డిమాండ్ చేశారు. మద్యం వ్యాపారులు సిండికెట్గా మారి ప్రజల జేబులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఒక క్యాటర్ బాటిల్ పైన 30 నుంచి 40 రూపాయలు అధికంగా విక్రయిస్తూ..వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహిస్తున్నారని మండిపడ్డారు. మద్యం సిండికెట్లో మంత్రులు ఉన్నారని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ప్రభుత్వం అన్నిరంగాలలో పూర్తీగా విఫలమయిందన్నారు. మద్యం వ్యాపారులు ఇస్తున్న మామూళ్లతో మత్తులో జోగుతున్నారని ఆరోపించారు. మత్తునుంచి బయటపడి సామాన్య ప్రజల బాగోగులను పట్టించుకోవాలని సూచించారు. కోట్ల రూపాయల ఆదాయం కోసం ప్రజలను పీడిస్తున్న మాఫియాలపై చర్యలు చేపట్టాలన్నారు.
విగ్రహాల ధ్వంసం ఆప్రజాస్వామ్యం : జాతినేత అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలన్నారు. భారతదేశ కీర్తిని దిశదశలా వ్యాపింపజేసిన రాజ్యాంగ నిర్మాత విగ్రహాలను కూల్చి వేయడం అమానుషమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి వరదాపురం సూర్యనారాయణ, బుగ్గయ్యచౌదరి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
దేశ సంక్షేమం కోసం, సౌబ్రాతృత్వం కోసం పరి తపించిన జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ఉద్యమించాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ 64వ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎంపి మాట్లాడుతూ..కోట్ల మంది భారతీయులు స్వాతంత్య్రం సాధించడం కోసం అహింస ఆయుధాన్ని ఉపయోగించే విధంగా ఉద్యమించిన మహానేతను స్మరించుకోవాలన్నారు. అహింస ఆయుధంగా చేసుకుని బ్రీటిష్ పాలకులు దేశాన్ని తరిమికొట్టి, భారత దేశ ప్ర జలకు స్వేచ్చాయుత వాతావరణాన్ని కల్పించిన మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హింసను వీడితేనే శాంతి నెలకొంటుందని చాటిచెప్పిన మహానుభావుల మార్గాలను స్పూర్తిగా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ రషీద్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాగాంధీ, మాజీ మేయర్ రాగే పరుశురాం, మైనార్టీ నాయకులు మహబూబ్ పీరా తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, దవళేశ్వరంలలో భారత రత్న డా. బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను కూల్చివేసిన అసలైన దోషులను వెంటనే గుర్తించి, అరెస్ట్ చేసి, శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం రాప్తాడు జాతీయ రహదారిని దళిత, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దిగ్భందించారు. ఈ సందర్భంగా జేక్ వైస్ చైర్మెన్ దాసరి రామ్మూర్తి, ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రాజు, వీరన్న, బండారు శంకర్ మాట్లాడుతూ.. జాతీయ నేత అంబేద్కర్ విగ్రహాలను కూల్చిన దుండగులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అమయాకులను కాకుండా అసలు దోషులను గుర్తించాలన్నారు. జాతీయ నేతల విగ్రహాలకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యల్లుట్ల రామక్రిష్ణ, బండారునాగరాజు, ఓబులేసు, నగేష్, అమర్ నాథ్, రాజారమేష్, బాలరాజు, కేవి సుందరం, హరి, కోనయ్య, ప్రభాకర్, శంకర్, ప్రకాశ్, కదిరప్ప, దిలీప్, శివ, కదిరయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం పొలీసులు వారిని పొలీసులు అరెస్ట్ చేశారు.
ముందస్తు చర్యలతో నేరాలను నియంత్రించవచ్చని ఎస్పీ షెహనావాజ్ఖాసీం కిందిస్థాయి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షాసమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన నేరాలతోపాటు పాత కేసులను సమీక్షించారు.
నిత్యం అప్రమత్తతతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే దాదాపు నేరాల సంఖ్య తగ్గించవచ్చన్నారు. ఆధారాలు లేవని, నిందితులు అందుబాటులో లేరనే సాకులతో కొన్ని హత్య కేసులను మరుగునపడేస్తే సహించేది లేదన్నారు. సోఫియా థామస్ హత్య, తదితర సంచలనాత్మక కేసులను సమీక్షించారు. జిల్లాలో ఉన్న ఎక్స్ఫ్లోజివ్స్ లెసైన్సులను తనిఖీలు చేయాలని డీఎస్పీలను ఆదేశించారు. చోరీల సొత్తు రికవరీ 60 శాతానికి తగ్గరాదన్నారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించి నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హెడ్ కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్ఐల పదోన్నతి విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ శివయ్యను ఆదేశించారు. దీనివల్ల మరికొందరు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభిస్తుందని తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు దయానందరెడ్డి, కోలార్కృష్ణ, శ్రీధర్, నవాబ్జాన్, వెంకటయ్య, సుప్రజ, అరవిందబాబు, కరీముల్లాషరీఫ్, ఏఆర్ డీఎస్పీ మురళీధర్, పలువురు సీఐలు, ఎస్ఐలు, జిల్లా పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్లు సురేష్బాబు, ఇబ్రహీం, షాజాద్ తదితరులు పాల్గొన్నారు.