చిత్తూరు

12నుంచి శ్రీకల్యాణవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు


తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించిన రీతిలోనే ఈ ఏడాది శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వ హించాలని టి.టి.డి ఇ.ఓ ఎల్‌వి. సుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీనివాసమంగాపురంలోని టి.టి.డి కళ్యాణ మండపంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 12వ తేదిన ధ్వజారోహణంతో ప్రారంభమై, 20న ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేసి తిరుమల బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించాలని ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల వివరాలు
టి.టి.డికి అనుబంధంగా వున్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణవెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 12నుంచి 20వతేది వరకు జరగనున్నాయి. 11వతేది సాయంత్రం 5 గంటలకు అంకురార్పణం జరగనుంది. 12వ తేది ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేషవాహనం, 13న ఉదయం చిన్నశేషవాహనం, సాయంత్రం హంసవాహనం, 14న ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యపుపందిరి వాహనం, 15న ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాలవాహనం, 16న ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడవాహనం, 17న ఉదయం హనుమంతవాహనం, సాయంత్రం గజవాహనం, 18న ఉదయం సూర్యప్రభవాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహనం, 19న ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనం, 20న ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం. గరుడసేవ రోజున ఆండాళ్‌ అమ్మవారి ప్రత్యేక ఆభరణాలను తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుంచి నగర సంకీర్తనగా కాలినడకన శ్రీనివాసమంగాపురానికి తీసుకురానున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రోజువారీ సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను రద్దు చేశారు. ఈ నెల 14వ తేదిన మంగళవారం నిత్య కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, స్వర్ణ పుష్పార్చన, 15వ తేదిన అష్టోత్తర శతకలశాభిషేకం, 16న తిరుప్పావడ సేవ, 17న మూలవర్‌ఒ అభిషేక సేవలు రద్దయ్యాయి. 9వ తేదిన కోయిల్‌ ఆళ్వార్‌ఒ తిరుమంజనం సందర్భంగా తిరుప్పావడ సేవను రద్దు చేశారు. ఈ సందర్భంగా టి.టి.డి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజె క్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

దేవుడి శక్తిని శంకించరాదు


తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బలాన్ని ఎవరు శంకించినా అది మానవుడు చేసే అతిపెద్ద తప్పిదం అవుతుందని టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పాలకులు, ఆలయ కైంకర్యాలు, చారిత్రక కట్టడాలపైనా త్రిదండి చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై టిటిడి తొలిసారిగా తీవ్రస్థాయిలో స్పందించింది. టిటిడి ఇఓ సుబ్రహ్మణ్యం శనివారం విలేఖరులతో మాట్లాడుతూ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి విశ్రాంతి లేదని జీయర్ వ్యాఖ్యానించడం, 10 గంటలకే ఆలయం మూసివేయాలని చెప్పడం సరికాదన్నారు. స్వామివారికి కానీ, తిరుమల క్షేత్రానికి కానీ కళంకం ఏర్పడితే తాను ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. ఆలయంలో ఏవైనా లోపాలు జరుగుతోంటే పెద్దలు తమ దృష్టికి తీసుకువస్తే తాము ఎలాంటి భేషజాలకు పోకుండా సరిదిద్దుకుంటామన్నారు. భక్తులను అనుగ్రహించడం కోసమే స్వామివారు కలియుగంలో వెలిశారన్నారు. ఆయన శక్తిసామర్థ్యాల గురించి మాట్లాడటానికి మన స్థాయి ఏ పాటిదన్నారు. నిజంగా స్వామివారి ఆలయంలో తప్పిదాలే జరుగుతూ ఉంటే, స్వామివారికే ఆగ్రహం వస్తే ఈ క్షేత్రం నడవగలదా అని ప్రశ్నించారు. ఎంత సమయం కేటాయిస్తున్నా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోతోందన్నారు. ఇక రాత్రి 10 గంటలకే ఆలయం మూస్తే భక్తులు ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారో ఊహించలేమన్నారు. ఎక్కువ మందికి దర్శనం కల్పించేందుకు శ్రీవారి ఆలయం లోపల ఏవైనా మార్పులు, చేర్పులు చేద్దామనుకుంటే అందుకు ఆగమాలు ఏమాత్రం అంగీకరించవన్నారు. ఆగమాలను పాటించే సాంప్రదాయం వల్లనే మార్పులు చేయడానికి కూడా టిటిడి ఎప్పుడూ సాహసించలేదన్నారు. వెయ్యికాళ్ల మండపం నిర్మాణానికి ఆగమాలకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. దానిని ఆగమాలకు ముడిపెట్టి ఎవరైనా మాట్లాడితే వారిని ఆ భగవంతుడే కాపాడాలని జీయర్‌పై చురకలు వేశారు. కాలానుగుణంగా పెరుగుతున్న రద్దీని బట్టి భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత, అధికారం టిటిడికి ఉందన్నారు. ప్రస్తుతం ఆలయం సమీపంలో రాంభగీచ అతిథి భవనాలు ఉన్నాయని, భక్తుల అవసరాలు పెరిగితే వాటిని కూల్చివేసి మరో విష్ణ్భుగీచగా నిర్మాణం చేపడతామన్నారు. అలాగే స్వామివారి వాహన ఊరేగింపు సమయంలో ప్రస్తుతం ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపం అడ్డువస్తే, అవసరమైతే వాటిని హథీరాంజీ మఠం వరకూ తొలగించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నారు. అలా అని హథీరాంజీ మఠంలో స్వామివారు పాచికలు ఆడారని చెబుతూ, ప్రస్తుతం భగవంతునికి సంబంధించి సౌకర్యాలను విస్మరించగలమా అని ప్రశ్నించారు. జీయర్ ప్రదర్శించిన 110 తప్పుల సిడిపై విలేఖరులు ప్రశ్నించగా… చిన్నజీయర్‌తో తాను నాలుగున్నర గంట పాటు సమావేశం అయిన విషయం నిజమేనన్నారు. అయితే 2003లో అప్పటి ఇఓ అజయ్‌కల్లాం, జెఇఓ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడిన వీడియో టేపులను చూపించారన్నారు. అందులో సంభాషణలు సరిగ్గా వినపడలేదని, ఆడియో కూడా సక్రమంగా లేదన్నారు. అంతమాత్రాన వారేదో తప్పులను ఒప్పుకున్నట్టు కాదుకదా.. అని ప్రశ్నించారు. ఓర్పుతో ఉన్నాను, ఇక కడిగేస్తాను అని చిన్నజీయర్ లాంటి పెద్దలు వ్యాఖ్యానించటం సరికాదన్నారు. హిందుమత పెద్దలుగా ఉన్న వారు విరుద్ధంగా మాట్లాడి అలజడులు సృష్టించడం సరికాదన్నారు. అలా చేయడం ద్వారా ఇతర మతస్థులకు మనం చేయూతనిచ్చిన వారమవుతామన్నారు. జీయర్ స్వామిపట్ల తనకు అపారమైన గౌరవం, భక్తి ఉన్నాయన్నారు. ఆయన తపస్సంపన్నులన్నారు. తాను పామరుడ్ని అన్నారు. తనపై ఆగ్రహించకుండా అనుగ్రహించాలని తాను పెద్దలను కోరుతున్నానన్నారు.

శ్రీవారి సాక్షిగా ఏ తప్పూ చేయలేదు: ఎల్వీ


ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా తాను ఏ తప్పూ చేయలేదని టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యం చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో తన పేరును పొందుపరచడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీఐఐసీ ఎండీగా తన హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో సెలవు దినాల్లోనూ పని చేశానన్నారు. పని ఒత్తిడిలో చిన్నపాటి పొరబాట్లు జరిగి ఉంటే ఉండొచ్చు కానీ, ఉద్దేశపూర్వకంగా ఏదో ఆశించి మాత్రం తాను పొరపాటు చేయలేదని స్పష్టం చేశారు. తెలిసి తప్పులు చేసి ఉంటే తాను అలిపిరి కూడా దాటి ఉండేవాడిని(టీటీడీ ఈవోగా) కాదన్నారు. సీబీఐ అధికారులను రెండుసార్లు కలసి తన దగ్గరున్న సమాచారమంతా వివరించానని, అయినా తనను కేసులో ఎందుకు నిందితుడిగా చేర్చారో తెలియడం లేదని వాపోయారు. తానెవరికీ అన్యాయం చేయలేదని, అందువల్ల తనను కేసుల్లో ఇరికిస్తారని అనుకోవడం లేదన్నారు. ఒకవేళ ఇరికించినా శ్రీవేంకటేశ్వరస్వామే చూసుకుంటాడని ఆయన వేదాంత ధోరణిలో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వ సూచన మేరకు న్యాయ సలహాలు తీసుకుని తదుపరి స్పందిస్తానన్నారు.

21,343 టీచర్ పోస్టులు


డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్‌లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్‌కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్‌స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

చిత్తూరు జిల్లాలో రెండురోజులు ముఖ్యమంత్రి


ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో రెండురోజులు బిజీబిజీగా గడిపారు. మంగళవారం మదనపల్లెలో జాతీయగీతం లక్షస్వరాలాపనతొ పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి బుధవారం రెండో రోజు పర్యటన తన సొంత నియోజకవర్గం పీలేరులో సాగింది. నియోజకవర్గ సమస్యలు, వాటి పరిష్కారానికి, పలు అభివృద్ధి పనులకు సంబంధించి నివేదికను ముందే తెప్పించుకుని పరిశీలించిన ముఖ్యమంత్రి
ఆ దిశగా ముందుకు సాగారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి సమస్యలను సావధానంగా ఆలకించారు. ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. వేకువజామునే ముఖ్యమంత్రి తన స్వగ్రామం నగిరిపల్లె చేరుకోగా అక్కడ కలికిరి, కలకడ, గుర్రంకొండ, కేవీపల్లె, పీలేరు , వాల్మీకిపురం మండలాల నుంచి వచ్చిన అశేష జనవాహిని పలు సమస్యలపై ముఖ్యమంత్రిని కలుసుకుని తమ సమస్యలు విన్నవించుకున్నారు. ముఖ్యమంత్రి ఆ సమస్యలపై సానుకూలంగా స్పందించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని అప్పటికప్పుడెె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేరుపేరునా ప్రతి ఒక్కరినీ పలకరించి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన సొంతనియోజకవర్గమైన కుప్పంలోను, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పులివెందులలోను అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించిన తరహాలోనే ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో మరిన్ని వెలుగు కిరణాలు ప్రసరింపచేస్తున్నారు. ప్రజలతో ముఖాముఖి అనంతరం ముఖ్యమంత్రి తన స్వగృహంలో కమలాపురం శాసనసభ్యుడు వీర శివారెడ్డి, ఎమ్మెల్సీలు రెడ్డప్పరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు డీసీసీబీ అధ్యక్షుడు ఎ. రాజశేఖర్‌ రెడ్డి కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ సాల్మన్‌ ఆరోగ్యరాజ్‌, పడా ప్రత్యేకాధికారి పెంచల్‌రెడ్డి, సీఎం ఒఎస్‌డీ సురేంద్రరెడ్డితోపాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

స్థాయి మరచిన బాబు- కిరణ్


బొత్స, చిరంజీవి, దామోదర్‌కు, నాకు విభేదాల్లేవు: కిరణ్
రైతు పేరెత్తే అర్హత బాబుకు లేదు: చిరంజీవి
తాను జీవితంలో మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి అర్హత కోల్పోయానని గ్రహించిన ఆక్రోశంతో టీడీపీ అధినేత చంద్రబాబు తన స్థాయి మరిచి కాంగ్రెస్‌పైనా, ప్రభుత్వంపైనా విమర్శలకు దిగుతున్నారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో మంగళవారం జరిగిన మహిళా సంఘాలకు రుణాల పంపిణీ సభలో ముఖ్యమంత్రి మొదలుకొని చిరంజీవి, రఘువీరా రెడ్డి తదితరులు చంద్రబాబు, సినీ నటుడు బాలకృష్ణలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు మాట్లాడుతున్న భాష సమాజంలో మనుషులు మాట్లాడే భాష కాదని సీఎం కిరణ్ ధ్వజమెత్తారు.
ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకొనే పెద్ద మనిషి.. స్థాయి మరచి మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వాన్ని దద్దమ్మ ప్రభుత్వంగా విమర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన తన హయాంలో కిలో బియ్యం రూ.5.30లకు ఇస్తే.. దానిని రూపాయికి తగ్గించినందుకు తాము దద్దమ్మలమయ్యామా అని ప్రశ్నించారు. “98 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వడం పొరబాటా? చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు పాల ఫ్యాక్టరీ ఉంది. కాబట్టే రైతులకు పాల రేటు పెంచకుండా తొమ్మిదేళ్లపాటు లీటరుకు రూ.6-7 చెల్లించి వారి పొట్టకొట్టారు.
అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీఎంసీల ద్వారా లీటరుకు రూ.21-22 చెల్లిస్తూ 3 లక్షల లీటర్లు సేకరిస్తున్నాం. అది కూడా మేం చేసిన తప్పేనా!? 2009 ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబు గెలిచి ఉంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా అమ్మేసేవాడు. లేదా తాకట్టు పెట్టేవాడు” అని దుమ్మెత్తి పోశారు.
చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి టీడీపీకి వెళ్లినట్టే.. జగన్ కూడా కాంగ్రెస్‌ను మోసం చేసి సొంత పార్టీ పెట్టుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే భూస్థాపితం చేస్తాననడం ఆయన స్థాయికి తగదని హితవు పలికారు. బొత్స సత్యనారాయణ, చిరంజీవి, దామోదర రాజనర్సింహలకు, తనకు మధ్య విభేదాలున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. రాజీవ్ యువ కిరణాలు పథకం కింద ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామ ని, వచ్చేనెల 4న ప్రధాని చేతుల మీదుగా లక్షమందికి ప్రై వేటు కంపెనీల్లో నియామక పత్రాలు పంపిణీ చేస్తామని చెప్పారు.
హోదాకు తగ్గట్టు ప్రవర్తించండి బాబూ..
రాష్ట్రంలో రైతు పేరెత్తే అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమేనని ఎమ్మెల్యే చిరంజీవి విమర్శించారు. ఆయన తరచూ కువిమర్శలకు పాల్పడుతున్నారని, అనుభవం, పరిణతి ఉన్న మనిషి మాట్లాడాల్సిన మాటలు కాదని ధ్వజమెత్తారు. ఇటీవల ఆయన తనపై చేసిన విమర్శలు చాలా బాధ కలిగించాయన్నారు. ఆయన తనను కాంగ్రెస్ కంపులో కలిసిపోయారంటూ విమర్శించారని, అయితే తాను ఏ పార్టీలో చేరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారో, మంత్రి అయ్యారో.. తనకు రాజకీయ భిక్ష పెట్టిందెవరో ఆయన మరిచిపోయారా? అంటూ బాబును నిలదీశారు.
ఆయన తన హోదాకు తగ్గట్టు ప్రవర్తించాలే తప్ప దిగజారుడుతనం వద్దని హితవు పలికారు. కాగా, కాం గ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీసాలు తిప్పడం, తొడ చరచడం వంటివి చేస్తున్న సినీ నటుడు బాలకృష్ణపై మంత్రి రఘువీరా విరుచుకుపడ్డారు. ఆయన తండ్రి ఎన్టీఆర్‌కు చంద్రబాబు ద్రోహం చేసినప్పుడు ఈ పౌరుషమంతా ఏమైందని ప్రశ్నించారు.
చిరంజీవిపై సీఎం సెటైర్
* చిరంజీవి ప్రసంగానికి విద్యార్థుల నుంచి వచ్చిన స్పందనను చూసి ఆయనపై ముఖ్యమంత్రి ఇలా చలోక్తి విసిరారు. * పది సంవత్సరాల నుంచీ ఓటు ఉంటే చిరంజీవి గారు అధికారంలోకి వచ్చేవారు.. కాలేజి స్టూడెంట్స్‌కి 18సంవత్సరాల వరకు ఓటు లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అదృష్టం కలిసి వచ్చింది.

రాష్ట్రంలో మాఫియా పాలన


రాష్ట్రాన్ని మద్యం మాఫియా పాలిస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. గురువారం జిల్లాలో 15 కి.మీ పాద యాత్ర చేపట్టిన అనంతరం పూతలపట్టు బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలనే తమ అజెండాలో చేర్చనున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లాలో రైతులు పంట ఖర్చు పెరిగి కన్నీటి పర్యం తమవుతున్నారని ఆవేదన చెందారు. 61 మండలాలు కరువు ఉందని ప్రక టించిన కాంగ్రెస్‌ ఒక పైసా కూడా అందించలేదని విమర్శించారు. టిడిపి హయాంలో 5500 మెగా వాట్‌ల విద్యుత్‌ను తయారు చేసి రైతులకు కరెంట్‌ అందించామని పేర్కొన్నారు. ఆ రోజు ఉచిత కరెంట్‌ ఇచ్చి ఉంటే ఈనీతి మాలిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కాదని ఎద్దెవా చేశారు.
అవినీతిలో కూరుకు పోయిన కాంగ్రెస్‌ నేడు ప్రజలపై మరో 3500 కోట్లు ప్యూయల్‌ చార్జీల పేరుతో భారం మోపనుందని తెలిపారు. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలు పంట ఎండి పోయిందని మరో 32వేల కోట్లు పరిశ్రమలు నష్టపోయాయన్నారు. చిన్న తరహా పరిశ్రమలు పూర్తిగా మూసి వేసే పరిస్థ్దితికి చేరుకున్నాయన్నారు. సంస్క రణలు అమలు చేసినందువలనే నేడు ఐటి రంగం విస్తరించిందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో చెరకు రైతులకు టన్నుకు రూ.2100 ఇస్తామని గతంలో ప్రకటించిన కాంగ్రెస్‌ ఆ బకాయిలు చెల్లించ లేక చేతులెత్తేసిందని విమర్శించారు. ఈ ఏడాది రూ.1600 కూడా చెల్లించ లేదని తెలిపారు. మామిడి, వేరుశెనగ రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయారని వివరించారు.
40 వేల ఎకరాల్లో పండించిన టమోటాకు గిట్టు బాటు ధరలేక కిలో పావలా వంతున అమ్ముడుపోయాయన్నారు. వ్యవసాయం ఇంత కష్టంగా మారినప్పుడు ఎందుకు వ్యవసాయం చేయాలో రైతులకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టా లని కోరారు. టిటిడికి నాస్తికుడిని చైర్మన్‌గా చేసిన ఘనత కాంగ్రెస్‌కు దక్కిం దన్నారు. జగన్‌ ఓట్లు కూడగట్టు కోవడమే లక్ష్యంగా రైతులపై ప్రేమ కురిపిసు ్తన్నాడని విమర్శించారు. చిరంజీవి పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తుం దని ప్రకటించి నేడు ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం దారుణ మన్నారు. కాలినడ కలో బాబుకు మద్దిపట్లపల్లె, పాలకూరు, పూతల పట్టు వరకు ఉన్న గ్రామాల ప్రజలు, రైతులు హారతులు పట్టి ఆహ్వానించారు. పలు ప్రాంతాల్లో చెరకు, వివిధ కూర గాయల పొలాలను బాబు పరి శీలించి రైతు లతో మాటా ్లడారు. అనంతరం కోడెల శివప్రసాద్‌, ఎంపి శివప్రసాద్‌ ,గాలి ముద్దు కృష్ణమ నాయుడు మాట్లాడుతూ అవినీతి ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్‌ చేశారు.
తరలివచ్చిన జనం
చిత్తూరు జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుపోరుబాటకు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున జనం తరలివచ్చారు. టిడిపి రాష్ట్రఅధ్యక్షుడు నారా చంద్రబాబు కాణిపాకం చేరుకోవడానికి రెండున్నర గంటలు ఆలస్యమైంది. అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకొని బాబుకు బ్రహ్మరథం పట్టారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కాణిపాకం చేరుకున్న బాబుకు చిత్తూరు పట్టణ అధ్యక్షురాలు పుష్పలత, తదితరుల ఆధ్వర్యంలో హార తులు పట్టి ఆహ్వానించారు. ఐరాల క్రాస్‌ వద్ద చంద్రబాబుకు ఘన స్వాగతం పలి కారు. కాణిపాకం వరకు భారీ ర్యాలీతో తరలివెళ్లారు.పోలీసులు భద్రత కల్పిం చడంలో వైఫల్యం చెందారు.

చేతనైనంత సేవ చేస్తా: చిత్రా రామచంద్రన్


-ఎక్స్ -అఫీషియో మెంబర్‌గా బాధ్యతల స్వీకరణ
దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రా రామచంవూదన్ బుధవారం తిరుమల శ్రీ వేంక సన్నిధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్- అఫీసియో సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యకార్యదర్శి హోదాలో ఒక మహిళా అధికారి బాధ్యతలను స్వీకరించడం టీటీడీలో ఇదే ప్రథమం.
కార్యదర్శుల సర్వీసు క్రమబద్ధీకరణకు ఓకే
కారుణ్య పంచాయతీ కార్యదర్శుల నియామకానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. 2003లో కారుణ్య నియామకాల ద్వారా పంచాయతీ తాత్కాలిక కార్యదర్శులుగా రాష్ట్రంలో 1148మంది ఎంపికయ్యారు. 2006లో వీరి నియామకం చెల్లదని ప్రభుత్వం తొలగించింది. దీంతో పంచాయతీ కార్యదర్శులుగా నియామకం అయిన వారు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ కేసును విచారించి 2008లో కారుణ్య నియామకం సమంజసమేనని తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుననుసరించి ప్రభుత్వం వీరిని తిరిగి తాత్కాలిక కార్యదర్శులుగా నియమించింది. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్8 ప్రభుత్వం తర్వాత వివిధ శాఖలకు చెందిన తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడంతో తాత్కాలిక కార్యదర్శులుగా పనిచేస్తున్న కారుణ్య కార్యదర్శులు సర్వీస్8ను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు.

అట్టహాసంగా జల్లికట్టు – ఉత్సాహంగా పాల్గొన్న జనం


తమిళనాడులో 100 మందికి గాయాలు
చిత్తూరు జిల్లా, తమిళనాడులోని మదురై ప్రాంత ప్రజలు సంక్రాంతి పండుగలో మూడో రోజు సోమవారం పశువుల పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల ఎద్దుల పరుగు పందేలు (జల్లికట్టు, మైలేరు పండుగ అని కూడా అంటారు) నిర్వహించారు. ప్రధానంగా చంద్రగిరి మండలం ఆరేపల్లె రంగంపేటలో నిర్వహించిన జల్లికట్టును తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం అధికంగా తరలివచ్చారు. ఎడ్ల పందెంలో సుమారు 500కు పైగా పశువులను అలంకరించి పరుగెత్తించారు. పోట్ల గిత్తలకు కట్టిన కానుకలను చేజిక్కించుకునేందుకు యువకులు పోటీ పడ్డారు. ఓ సందర్భంలో కొన్ని ఎడ్లు భయంతో జనంపైకి దూసుకురావడంతో 30 మందికిపైగా గాయపడ్డారు. నాలుగు ఆవులు పరుగెడుతూ వెళ్లి పోలీసు జీపుపై పడడంతో అది ధ్వంసమైంది. చంద్రగిరి, బెరైడ్డిపల్లె, పలమనేరు, పాకాల, కుప్పం, గుడుపల్లె, కురబలకోట, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో కూడా మైలేరు పండుగను నిర్వహించుకున్నారు. ఈ పండుగను తిలకించడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచీ ప్రజలు తరలివచ్చారు.
తమిళనాట జల్లికట్టుకు కోర్టు ని‘బంధనాలు’
సుప్రీంకోర్టు షరతులకు లోబడే తమిళనాడులో జల్లికట్టు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వందమంది గాయపడగా వారిలో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ ఈ పోటీలను సంక్రాంతి మరుసటి రోజు నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. జల్లికట్టులో ఎద్దును బాగా రెచ్చగొట్టి మైదానంలో వదులుతారు. దీంతో ఎద్దు చిందులు వేస్తూ పరుగెడుతుంది. దాన్ని పట్టుకుని, కింద పడకుండా, గాయాలకు లోనుకాకుండా అదుపులోకి తీసుకున్న వారిని విజేతలుగా ప్రకటించి బహుమతులు ఇస్తారు. అనంతరం మరో ఎద్దును అదేవిధంగా వదులుతారు. జల్లికట్టు నిర్వహించడానికి 1972లో మహాలింగస్వామి గ్రామ సంఘం అనే సంస్థ ఏర్పడింది. జల్లికట్టులో పాల్గొనే మొదటి ఎద్దు వీరిదే అయి ఉంటుంది. తర్వాత కొన్ని కుల సంఘాలు తమ ఎద్దులను వదులుతాయి. గతంలో ఎద్దును రెచ్చగొట్టి వదిలితే, ఇటీవలి కాలంలో ఎద్దుకు మద్యం, కల్లు, ఇత్తర మత్తు పదార్థాలు ఇస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. జంతు ప్రేమికులు ఈ హింసను అడ్డుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జల్లికట్టు తమిళనాడు సంప్రదాయ క్రీడ అని, దీన్ని నిషేధించడం సరికాదని నిర్వాహకులు వాదించడంతో కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పోటీలను పోలీసుల పర్యవేక్షణలో జరపాలని, ఎద్దులను హింసించకూడదని, పోటీలను వీడియో చిత్రీకరించాలని నిబంధనలు విధించింది. అదేవిధంగా అధికారులు, వైద్యులు ముందుగా పరీక్షించి నమోదు చేసిన ఎద్దులనే జల్లికట్టుకు అనుమతించారు. ఈ నిబంధనల వల్ల ఈసారి జల్ల్లికట్టు ఉత్సవాలు గతంలోలాగా అట్టహాసంగా జరగలేదు. మదురై సమీపంలోని అలంగానల్లూరు, పాలమేడు, అవనియాపురం తదితర ప్రాంతాల్లో సోమవారం జల్లికట్టు పోటీలు జరిగాయి. వందలాది మంది యువకులు పోటీల్లో పాల్గొన్

సంక్రాంతికి సొంతూరికి – నేడు స్వగ్రామానికి చంద్రబాబు


పసుపు జెండాలు, తోరణాలు, హోర్డింగ్‌లతో చంద్రగిరి మండలం కళకళ
కార్యకర్తల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
వాహనాల పార్కింగ్‌కే 4 ఎకరాలు!
టీడీపీ అధినేత చంద్రబాబు  సకుటుంబంగా స్వగ్రామం నారావారిపల్లెలో సందడి చేయనుంది. మూడేళ్ల తర్వాత మళ్లీ స్వగ్రామం వెళ్తున్న ఆయన, శుక్రవారం అక్కడికి చేరుకోనున్నారు.  బాలకృష్ణ కుటుంబీకులు కొందరు, బాబు సోదరుడు రామ్మూర్తి ఫ్యామిలీ కూడా రానుండ టంతో ఊళ్లో బంధుమిత్రుల సందడి మొదలైంది. వారికి స్వాగతం పలుకుతూ రేణిగుంట విమానాశ్రయం నుంచి నారావారిపల్లె వరకూ పెద్దపెద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పసుపు జెండాలు, తోరణాలతో దారులన్నీ పసుపు రంగు పులుముకున్నాయి.  చంద్రబాబుకు రేణిగుంట విమానాశ్రయం వద్ద ఘనంగా స్వాగతం పలికి స్కూటర్లతో ర్యాలీగా గ్రామానికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వాహనాల పార్కింగ్ కోసం కందులవారి పల్లి సమీపంలో నాలుగెకరాలు కేటాయించారు. ఎన్టీఆర్ ట్రస్టు నిధులతో నారావారి పల్లెలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంటును చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత.. తల్లిదండ్రులు.. ఖర్జూరనాయు డు, అమ్మణ్నమ్మ సమాధుల వద్ద కుటుంబసభ్యులతో కలిసి పూజచేస్తారు.   అక్కడ బహిరంగ సమావేశంలో మాట్లాడాక.. చంద్రగిరి నియోజకవర్గం, చిత్తూరుజిల్లా టీడీపీ ముఖ్యనాయకులతో భేటీ అవుతారు. చాలాకాలం తర్వాత స్వగ్రామానికి వస్తున్న చంద్రబాబును కలిసి మాట్లాడాలని ఆయన పాత స్నేహితులు ఎదురుచూస్తున్నారు. రామ్మూర్తి కుమారుడు గిరీష్.. నాలుగురోజులు గా గ్రామంలో మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఉదయం అందరికీ గ్రామంలోనే అల్పాహార విందు ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నాయి. శుక్రవారం రాత్రికి బాబు తిరుమల చేరుకుని అక్కడే బసచేసి, ఉదయాన్నే శ్రీవారి దర్శనం చేసుకుని హైదరాబాద్ బయల్దేరతారు.
14నుంచి గల్ఫ్‌కు బాలయ్య
ఆన్‌లైన్ గల్ఫ్ ప్రతినిధి: సినీ హీరో నందమూరి బాలకృష్ణ గల్ఫ్‌లోని ఒమన్‌లో 3 రోజులు పర్యటిస్తారు. 14 నుంచి మస్కట్‌లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. ఆయనను కువైట్‌కు ఆహ్వానించడానికీ ప్రయత్నిస్తున్నారు. నందమూరి బసవతారకం మె మోరియల్ ట్రస్టుకు నిధుల సేకరణలో భాగంగా బాలయ్య గల్ఫ్ పర్యటనకు వస్తున్నట్లు సమాచారం.

free website analytics