
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ తెనాలి ఆనం ద్ ఓ నిరుద్యోగి వద్ద రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. నిరుద్యోగ యువతకు చేయుత నివ్వాల్సిన బాధ్యత గల అధికారి అవినీతికి పాల్పడుతూ నిరుద్యోగ యువతను పీల్చి పిప్పిచేస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని పరిశ్రమల కేంద్రంలో జనరల్ మేనేజర్గా పని చేస్తున్న తెనాలి ఆనంద్ కుమార్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన పవన్ జాదవ్ కుమార్కు ఒక టిప్పర్, జేసీబీ కోసం స్థానిక పరిశ్రమల కేంద్రంలో ధరఖాస్తు చేసు కున్నాడు. ఆయనకు యూనిట్ మంజూరు అయింది. ఈ యూనిట్కు సబ్సీడి రూ.15 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. అయితే ఈ ధరఖాస్తులో తప్పులు దొర్లాయని కుంటి సాకులు చూపిస్తూ సబ్సీడిపై 15 శాతం లంచం ఇవ్వాలని జీఎం ఆ నిరుద్యోగి వద్ద డిమాండ్ చేశాడు.
ఈ లెక్కన రూ.2 లక్షల 30 వేలు లంచం కింద ఇవ్వాల్సి ఉంది. అతనికి అంత డబ్బు ఇచ్చుకునే స్తోమత లేని కారణంగా కాళ్ల వేళ్ల పడి ఎలాగైన తమకు సబ్సీడి రిలీజ్ చేయించాలని వేడుకున్నాడు. అయినా జిఎం కరిగిపోకపోగ చివరకు రూ.50 వేల లంచం ఇచ్చేందుకు బేరం కుదుర్చుకు న్నాడు. గత్యంతరం లేక పవన్ జాదవ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్కు రూ. 50 వేలను ఇస్తానని చెప్పి జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గెస్ట్ హౌస్కు పిలిచాడు.
ఆనంద్ వచ్చి యువకుని వద్ద రూ. 50 వేల లంచం తీసుకొని జెబులో పెట్టుకున్నాడు. వల పన్నిన ఏసీబీ అధికా రులు జనరల్ మేనేజర్పై దాడి చేసి నగదు స్వాధీనం చేసు కుని ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ అధికారి గత 2001లో కూడా ఎలూరులో ఆదాయం కంటే ఆస్తులు ఎక్కు వగా ఉండడంతో ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేయ డంతో అవి కూడా నేటికి కొనసాగుతున్నాయి.

పంచాయతీరాజ్ శాఖలో నల్గొండ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్గా పని చేస్తున్న ఠాకూర్ కెందర్సింగ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న సమాచారం మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఆయన నివాసాన్ని, కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భారీ ఎత్తున ఆస్తులు కూడగట్టినట్లు ఎసిబి అధికారులు నిర్ధారించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆస్తుల విలువ రూ.2 కోట్లు ఉన్నప్పటికీ మార్కెట్ విలువ పది కోట్లకు పైగానే ఉంటుందని భావిస్తున్నారు. బేగంపేట మెథడిస్ట్ కాలనీలో ఒక ఇల్లు, రాజేంద్రనగర్లో ఒకటి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో 3 ప్లాట్లు, పంజాగుట్టలో రెండు, సరూర్నగర్లో ఒకటి అపార్టుమెంట్లు కలిగి ఉన్నట్లు ఎసిబి అధికారుల తనిఖీల్లో వెల్లడయ్యాయి.
ఇవి కాకుండా పంజాగుట్ట, కూకట్పల్లి, అమీర్పేట, వరంగల్లో నాలుగు వాణిజ్య దుకాణాలు, రెండు కార్లు, మహబూబ్నగర్ జిల్లా నాగర్కర్నూలు వద్ద 23 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు 1.7 కేజీల బంగారం, కేజీ వెండి ఆభరణాలు, మెథడిస్ట్ కాలనీలోని ఇంట్లో రూ.3.19 లక్షల నగదు, ఇంకా విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లు ఇంకా తెరవాల్సి ఉందని ఎసిబి డైరక్టర్ జనరల్ కార్యాలయం తెలిపింది. నిందితుడు కెందర్ సింగ్ను అరెస్టు చేసి హైదరాబాద్లోని ఎసిబి కేసుల ప్రత్యేక న్యాయస్ధానంలో హాజరుపర్చినట్లు ఎసిబి కార్యాలయం తెలిపింది.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే సమాచారం మేరకు మహబూబాబాద్ సహాయ గిరిజన సంక్షేమశాఖాధికారి చెన్నం రామ మూర్తి, ఇల్లు, అతని కార్యాల యంపై వరంగల్ అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఏక కాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో రామమూర్తికి చెందిన రూ.54 లక్షల విలువగల ఆరు ప్లాట్లు, మూడు ఇళ్లకు సంబంధించిన డాక్యూమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని హన్మకొండ కొత్తూరు జెండా లోని ఇంట్లో, ఆలేరులో, మహబూబాబాద్ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం లో ఏసీబీ డీఎస్పీ టి.రఘుపతిగౌడ్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు వి.శ్రీని వాసరెడ్డి, వి.బాపిరెడ్డి, కిరణ్కుమార్ తదితరులు తమ సిబ్బందితో దాడులు చేశారు. ఈ దాడుల్లో రామమూర్తికి చెందిన ఆస్తులతోపాటు ఒక కిలో 600 గ్రాముల బంగారం, నాలుగు కిలోల వెండి ఆభరణాలు, రెండు లక్షల 60 వేల రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏక కాలం లో దాడులు నిర్వహించడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

విశాఖ నార్త్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వి. రాజశేఖర్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయన్న ఫిర్యాదు ల మేరకు ఈ దాడులు నిర్వహించినట్టు ఏసీబీ అధి కారులు చెప్పారు. ఒకే సారి విశాఖ, రాజమండ్రి, అమలాపురంలలో బంధువుల ఇళ్లపై జరిపిన దాడు ల్లో కోటి రూపాయల వరకు ఆస్తులకు సంబంధిం చిన డాక్యుమెంట్లు, 250 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి, ఆరు లక్షల విలువ చేసే ఇన్స్యూరెన్స్ బాండ్లు, 40 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
సుమారు నాలుగు కోట్ల రూపా యల విలువ చేసే అస్తులు ఉండవచ్చని ఏసీబీ అధి కారులు అంచనా వేస్తున్నారు. రాజశేఖర్ గతంలో విశాఖ సిటీ, అమలాపురం ప్రాంతాలలో పనిచేశా రు. ఇటీవలే విశాఖలో బర్మాకాంప్ వద్ద 150 గజా ల్లో నిర్మించిన ఇల్లు వివాదాస్పదమైంది. నగరంలో పలు లారీల అసోసియేషన్ల నుంచి భారీగానే ముడుపులు వసూలు చేసినట్లు ఆయనపై ఆరోపణ లువున్నాయి. ఎసిబి డిఎస్పి రామకృష్ణ ప్రసాద్ సారధ్యంలో ఎసిబి సిఐ నాగేశ్వరరావు, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సహకార శాఖ సహయ సంచాలకులు వెంకటేశ్వరరావు ఇంటిపై ఏసీబీ దాడులు జరిపింది. వెంకటేశ్వరరావుకు సుమారు రూ.20 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. మధురానగర్లో వెంకటేశ్వరరావు పేరిట రెండతుస్థుల భవనం ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాదు కళ్యాణ్నగర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాకర్ను గుర్తించారు. అధికారులు లాకర్ను సోదా చేసే అవకాశం ఉంది. వెంకటేశ్వరరావు ఇంట్లో రూ.11 లక్షలనగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వెంకటేశ్వరరావు పేరపై నెల్లూరులో 30ఎకరాలు, మాదాపూర్లో 1142 గజాల షెడ్డు, మరోఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ శేరిలింగంపల్లిలో ఓ భవనం, గాజులరామారంలో మరో భవనం ఉన్నట్లు గుర్తించారు. సోమాజీగూడ ఆదిత్య ఎన్క్లేవ్లో ప్లాట్ నెం:101, బంజారాహిల్స్ రోడ్డు నెం:12లో ఇంటిస్థలం ఉన్నట్లు గుర్తించారు. జూబ్లిహిల్స్ రోడ్ నెం:79లో ఓ ప్లాట్, కూకట్పల్లి హౌసింగ్ సొసైటీలో మరో ఇంటిస్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
- ఏకమవుతున్న అవినీతి అధికారులు – రాజకీయ నేతలపై వత్తిడి – కులం రంగు – ఎసిబి జాబితాలో మరిన్ని పెద్ద చేపలు.

అరవింద రావు ఎసిబి డిజీగా బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్రంలో ఎదురు లేకుండా సాగిపోతున్న అవినీతి అధికారుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినంత పని అయ్యింది. అరవింద రావు అవినీతిపై రగిలించిన నవీన కాంతిగోళంలో నిలువలేక ఎసిబి కోర్టులో ఒక్కొక్కరుగా క్యూ కట్టి దోషులుగా నిలబడుతున్నారు. సమాజానికి వెలుగుదారులు చూపుతామంటూ ప్రతిజ్ఞలు చేసి బయలుదేరిన అధికారులు ఉన్నవారి పల్లకీని మోస్తూ నల్లధన రాశుల అండతో నీతి నిజాయితీని చెరబట్టి, తమ నలుపు తామెరుగని గురివిందల చందంగా తనదైన శైలిలో ముందుకు వెలుతున్నారు. అరవింద రావు ఎసిబి డిజీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అవినీతి పై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా, రాజకీయ నాయకుల పలుకుబడికి తలొగ్గకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు.. ఇంతవరకు ఏ డీజి చేయనటువంటి సాహసాలు చేస్తున్నారు… ఎ.ఇ., డి.ఇ.,లు, ఎమ్మార్వోలు, డిఆర్వోలు అని క్రింది స్థాయి అవినీతి అధికారులకే పరిమితం కాకుండా ఇటీవలనే రంగా రెడ్డి జాయింట్ కలెక్టర్ జగన్మోహన్ ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. ఇంతే కాక రహస్య సమాచారం ప్రకారం ఇంకా ఇలాంటి ఐఎఎస్లు, ఐపిఎస్లు చాలామంది తన జాబితాలో ఉన్నట్లు వెల్లడవుతుంది. బాధ్యతలు చేపట్టిన 6 నెలల కాలంలో దాదాపు 45 మంది అవినీతి అధికారులపై దాడులు చేయడం కూడా ఒక రికార్డు. అంతేకాకుండా ఇంతకు ముందు ఇంటెలిజెన్స్లో పనిచేయడం వలన అవినీతి అధికారు చిట్టా మొత్తం తన దగ్గర ఉందని, పధకం ప్రకారం వ్యూహాత్మకంగా ముందు కెళుతున్నాడని స్పష్టమవుతోంది. దీంతో అవినీతి ఐఎఎస్లకు నిద్దుర కరువైంది. అవినీతి ఐఎఎస్లు అంతా ఒక్కటిగా చేరి అరవింద్ దూకుడుకు అడ్డు కట్ట వేయాలని పావులు కదుపుతూ.. రాజకీయ నాయకులపై తీవ్ర వత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అరవింద్ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలో కాలంలోనే రికార్డు స్థాయిలో దాడులు నిర్వహించి గతంలో ఏ ఎసిబి అధికారి కూడా చేయనన్ని దాడులు చేశారు. అంతేకాక అరవింద రావుతో పాటు ఆయనకు మంచి టీం కూడా లభించడంతో అవినీతి అధికారులు గజగజ వణికి పోతున్నారు. అరవింద్ రావుతో పాటు సంతోష్ మెహ్రా, మాల కొండయ్య, శ్రీనివాస్ రెడ్డి, షికా గోయల్, సంపత్, అబ్రహం లింకన్, సత్యనారాయణ గతంలో అకున్ సభర్వాల్ తదితర అధికారులు అరవింద రావు పూర్తిగా సహాయ సహాకారాలు అందిస్తూ అలుపెరగని ప్రయత్నాలు, దాడులు చేస్తూ ఎసిబికే వన్నె తెస్తున్నారు. అవినీతి అధికారుల చిట్టా తయారు చేసి ఒక్కొక్కరి అట కటిస్తు ముందుకెళుతున్నారు.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, అభివృద్దికి చేయుతనివ్వాల్సిన అధికారులు ఆ బడుగు, బలహీన వర్గాల రక్త మాంసాలను పీక్కు తినే రీతిలో రాక్షస విధానాలతో దొరికినంత దోచుకుంటున్నారు. అరవింద రావు అవినీతిపై ఎక్కుపెట్టిన అస్ర్తానికి తట్టుకోలేక తాజాగా బడుగు, బలహీన వర్గాల మీద దాడి అంటూ రక్షణ కవచాన్ని పెట్టుకోవడం ఎంత సిగ్గు చేటు.. నరనరాన అవినీతి కుళ్ళు నింపుకుని, దోపిడియే కుత్సితాయుధంగా చేసి అవినీతి కాలుష్యాన్ని అడుగడుగునా వెదజల్లుతున్న అధికారుల కుతంత్రానికి తగిన జవాబు చెప్పవలసిన చారిత్రక అవసరాన్ని గుర్తించిన మరో అధికారి ఆ బాధ్యతలను తన భుజస్కాందాలపై ఎత్తుకుని బాధితులకు నేనున్నాంటూ చెప్పకనే చెబుతున్నారు. అనునిత్యం స్వీయ ప్రయోజనకాండకే ప్రాధాన్యమిచ్చే అవినీతి చీడ పురుగులు, సభలలో సమావేశాలలో నీతి, నిజాయితీలు వల్లిస్తున్న అవినీతి బాసుల కుటిల పయత్నాలు.. నిత్యం ఎక్కడికక్కడ ఎండ గడుతూ తనదైన శైలిలో ముందుకు వెలుతున్నారు. కరువు జిల్లా అనంత వాసి అయిన అరవిందరావు తన అసమాన ప్రతిభా పాటవాలతో రాష్ర్టానికే వన్నే తెస్తున్నారు. తాను చేపట్టే పదవి తనకు గుర్తింపు నివ్వడం కన్నా తాను చేపడితే ఆ పదవికే అలకారం అన్న విధంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రయత్నాలే కాని ఫలితాల గురించి ఆలోచించని అరవింద రావు అవినీతి నిరోదక శాఖ డిజీగా రావడం నిజంగా అవినీతి పరులకు గడ్డు కాలంగా చెప్పుకుంటున్నారంటే తానే స్థాయిలో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో ఇట్టే అర్థం అవుతుంది. ఏనాడు పత్రికలకు కాని, పబ్లిషిటీలకు ఉత్సాహం చూపని వైనం ఆయనది. దొంగ దొరికితే తాము బడుగు, బలహీన వర్గాలు అంటూ మహాత్మా ఫూలే, అంబేడ్కర్ చూపించి మమ్మల్ని అవమానిస్తే వారిని అవమానించి నట్టే, మమ్మలను అవినీతి పరులంటే బడుగు బలహీన వర్గాలను ఊరుకోవు.. న్యాయం కోసం పోరాడుతాయి అని పెద్ద పెద్ద డైలాగులు అనర్గలంగా చెబుతుంటూ నిజమైన మహాత్మా ఫూలే, అంబేడ్కర్ వారసులు, అభిమానులు ముక్కున వేలుకొనే పరిస్థితి వస్తుంది.
గతంలో బ్యూరోక్రసీ చేతుల్లో రాజకీయ నేతలు వుండే వారు. నేడు పరిస్థితి మారింది. రాజకీయ నాయకుల చేతుల్లో బ్యూరో క్రసీ ఐఎఎస్లు, ఐపిఎస్లు కీలు బొమ్మలుగా మారారు. రాజకీయ నాయకులు, ఐఎఎస్లు కుమ్మక్కై దోచుకుంటున్నారు. ఇటీవల చత్తీష్ ఘడ్లో అగర్వాల్ ఐఎఎస్ అవినీతి అధికారి మీద దాడి చేయగా 400 కోట్ల రూపాయలు బయట పడటంతో ఒక్క సారిగా దేశం విస్తుత పోయింది. చిన్న రాష్ట్రం చత్తీష్ గడ్లోనే ఒక ఐఎఎస్ 400 కోట్ల ఆస్తులు ఉంటే దేశంలోనే అత్యంత ఉన్నత రాష్ట్రంగా పేరున్న రాష్ట్రంలో ఉన్న అవినీతి ఐఎఎస్లు, ఐపిఎస్లు అంతకు మూడింతలు సంపాదించారనేది కాదనలేదనే సత్యం, మరి మన రాష్ర్టంలో ఎంతి మంది ఐఎఎస్, ఐపిఎస్ల మీద దాడులు జరిగాయో ఒక్కసారి ఆలోచించు కోవాలి. గతంలో కేవలం విశాఖ ఎస్పీ జె.జి. మురళీ, ఇప్పుడు రంగా రెడ్డి జాయింట్ కలెక్టర్ జగన్మోహన్ రెడ్డిలపై దాడుల చేశారు. ఇలాంటి వారు రాష్ర్టంలో వందల మంది ఉన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎన్ని ఆరోపణలు వచ్చినా ఐఎఎస్ల, ఐపిఎస్ల మీద ప్రభుత్వం చర్య తీసుకున్న పాపాన పోలేదు. రాష్ట్రంలో డజన్ మందికి మించి ఐఎఎస్లు అగర్వాల్కు మించిన వారు లేక పోలేదు. చిన్న రాష్ట్రలను స్ఫూర్తిగా తీసుకొని అయినా రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అధికారులపై ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందా అనేది ప్రశ్నార్థకమే. ఇప్పటికి కూడా రాష్ట్రంలో అవినీతి ఐఎఎస్, ఐపిఎస్లదే హల్ చల్, రాజకీయ నాయకులు ఐఎఎస్లు, ఐపిఎస్లు మిలఖత్ అయ్యి ప్రభుత్వ పథకాలకు అవినీతి చీడ చుట్టుకుంటుంది. ఇప్పటికైన ముఖ్యమంత్రి ఎసిబికి పూర్థి అధికారాలు ఇస్తే మురళీ, జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ఎంతో మంది దొరుకుతారు. ఆదిశగా ఎసిబి డిజీ అరవింద రావు కూడా దృష్టి పెట్టి అవినీతి చీడపురుగులను ఏరి వేసే ప్రయత్నం చేయాలి…
- మరి అవినీతి రాజకీయ నాయకులు సంగతేంటి ?
ఎంత చెప్పుకున్న తక్కువ అన్నట్టు అవినీతి గురించి ఎన్ని చెప్పినా తక్కువగానే ఉంటాయి ఎందుకంటే చిన్న అధికారి మొదులుకొని రాష్ర్టం పారిపాలన సాగిస్తున్న రాజకీయనాయకుల వరకు ఎంతో మంది అవినీతి బురదలో మునిగి తెలుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో కేవలం అధికారులను మాత్రమే శిక్షిస్తే అవినీతి అంతమవదు ఆ అవినీతికి పునాది రాజకీయ నాయకులు ఆ రాజకీయా నాయకుల ఆట కట్టిస్తే 90 శాతం అవినీతిని రూపు మాపి నట్లే.. రాష్ర్టంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభం ఇట్టే కనుమరుగవుతుంది.. ప్రతి రోజు రాజకీయ నాయకుల అవినీతి గురించి పుంకాలు పుంకాలుగా, కథలు కథలుగా పత్రికలలో వస్తున్నా ఏ రాజకీయ నాయకునికి చీమ కూడా కుట్టినట్లు లేకుండా పోయింది అది ఒక స్టేటస్ సింబల్ బావిస్తు మరింత అవినీతి, భూ కబ్జాలకు పాల్పడుతూ మరిన్ని పత్రికలలో ప్రముఖంగా కనిపిస్తున్నారు. బూరోకట్ల ఒక్కరే అవినీతికి పాల్పడటం రాజకీయ నాయకుల అండతోనే వారు ఇలా చేస్తున్నారు. వీరు అవినీతి చేపలతే.. రాజకీయ నాయకులు అవినీతి తిమింగాలు.. మరి చేపలను పట్టడానికి ప్రభుత్వం సహకరించకపోతే ఇక తిమింగలాలను ఏలా పడుతారో ? కేవలం చిన్న చిన్న చితక అధికారుల మీద మాత్రమే దాడలు చేయడం కాదు మరి ఎసిబి డిజి అరవింద రావు అధికారుల మీదే కాకుండా అవినీతి రాజకీయ నాయకులపై కూడా దృష్టి సారిస్తే అవినీతి పరుల అగడాలకు అడ్డు కట్ట వేయగలడు. ఐ.ఎ.ఎస్., ఐపిఎస్లు, రాజకీయనాయలపై దృష్టి సారిస్తే అప్పుడు నిజమైన అవినీతికి అడ్డు కట్ట పడుతుంది. రాబోవు కాలంలో ఆ దిశగా అరవింద రావు ప్రయత్నిస్తారని ఆశిద్దాం.

రాజమండ్రి మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమణారావు అవినీతి నిరోధక శాఖ అధికారుల (ఏసీబీ) వలలో చిక్కారు. శనివారం ఒక వ్యక్తి వద్ద నుంచి రమణారావు 15వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. దీంతో ఆర్ఐ నివాసం, కార్యాలయంలో అధికారులు సోదాలు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎసీబీ అధికారులు దాడులు జరిపింది. రంగారెడ్డి జిల్లాకలెక్టరేట్ కార్యాలయం, జాయింట్ కలెక్టర్ నివాసంలో మంగళవారం ఎకకాలంలో దాడులు చేశారు. జేసీ జగన్మోహన్కు ఇరవై కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. విశాఖ, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్లో విలువైన ఇళ్ల స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. అరకిలో బంగారం, పది లక్షల నగదు దోరికినట్లు తెలుస్తోంది. కార్యాలయం నుంచి పలు రికార్డులను ఎసీబీ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.

గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. సికింద్రాబాదుతోపాటు ఖమ్మంలో ఆయన ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ దాడి చేసింది. గతంలో హౌసింగ్ డీఈగా పనిచేస్తున్నపుడు అతనిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ పదవినుంచి సరెండర్ చేశారు. అనంతరం రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఖమ్మం హౌసింగ్ పీడీగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రమేశ్రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ దాడుల్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

అవినీతి అధికారుల వలలో భారీ చేప చిక్కింది. ఎస్సారెస్పీ డిప్యూటీ చీఫ్ ఇంజనీరు అన్నం నాయుడు నివాసాలపై మంగళవారం ఉదయం ఎసీబీ దాడులు నిర్వహించింది. కరీంనగర్, శ్రీకాకుళం, హైదరాబాదు, జీడిమెట్లలోని నివాసాలపై ఎసీబీ అధికారులు ఒకేసారి తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.