అనంతపూర్
జిల్లాలో ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్స్కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు.ఐ.ఐ.ఎస్ కేంద్రం ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోలేదని ఆయన స్పష్టం చేశారు.దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్రెడ్డి తన హయాంలోనే బెంగుళూర్లోని ఐ.ఐ.ఎస్.సి రెండవ క్యాంపస్ను జిల్లాలో ఏర్పాటు చేయించేందుకు ప్రత్యేక శ్రద్ద చూపారని తెలిపారు.ఈ కేంద్రం ఏర్పాటుకు సానుకూలతవ్యక్తంచేస్తూ కేంద్రమానవ వనరులు అభివృద్దిశాఖ మంత్రి కపిల్సిబాల్ ముఖ్యమంత్రి రోశయ్యకు ఏప్రిల్లో లేఖవ్రాసారని తెలిపారు.దానికికొనసాగింపుగా ఆగస్టు 31న ముఖ్యమంత్రి రోశయ్య కేంద్రమంత్రికి ఒకలేఖవ్రాసినట్లు తెల్పారు.గత నెలలో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్తో జరిగి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లినప్పుడు తాను స్వయంగా ఈ అంశంపై కేంద్రమంత్రితో కలసి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు.అందుకుసానుకూలం స్పందించడం జరిగిందని వివరించారు.ఐ,ఐ.ఎస్.సి క్యాంపస్ ఏర్పాటుకు కావలసిన వెయ్యి ఎకరాల భూమిని బెంగుళూరు విమానాశ్రయానికి 70కిలోమీటర్ల దూరంలో జిల్లాలో ఇదివరకే గుర్తించామని ఈ స్థలాన్ని2009లో ప్రొఫెసర్మోహన్నేతృత్వంలోని ఇన్స్ట్యూషన్ కమిటి పరిశీలించి క్యాంపస్ ఏర్పాటుకు అనుకూలమైందిగా ఎంపికచేసినట్లు తెలిపారు.ప్రసుత్తం బెంగుళూరులో ఉన్న కేంద్రానికి ఇది సమీపంలో ఏర్పాటు అవుతుండడంతో కోర్సు నిర్వహణ,ఫ్యాకల్టి నియామకం,ప్రయోగశాలలఏర్పాటు,పరిశోధన పథకాలు చేపట్టడానికి అనుకూలంగా ఉంటుందని కమిటి అభిప్రాయ పడినట్లు మంత్రితెలిపారు.త్వరలోనే క్యాంపస్ ఏర్పాటు సాకారం కానున్నదని అన్నారు.
సత్యసాయి బాబా 85వ జన్మదినోత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లుపై అదనపు ఐజి శివన్నారాయణ ఆద్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం శాంతి భవనంలో అదనపు ఐజితో పాటు డిఐజి, ఎస్పీలు సమీక్ష నిర్వహించారు. బాబా జన్మదినోత్సవాలకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పుట్టపర్తికి వస్తున్న సందర్భంలో వారిని నిశ్చితంగా పరిశీలించాలని పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన అంశాలపై వారు చర్చించారు. బాబా జన్మదిన వేడుకలకు పలువురు విఐపిలు వస్తున్నందున భద్రత గట్టిగా చేయడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక బద్దంగా వ్యవహరించాలని చర్చించారు. ఈసమావేశం అనంతరం ఎస్పీమనీష్కుమార్ సిన్హా మాట్లాడుతూ రక్త చరిత్ర సినిమా ఫ్యాక్షన్ను ప్రోత్సహించే విధంగా వుంటే తగిన చర్యలు చేపడుతామన్నారు.
జిల్లాలో ప్రజలు, మీడియా సహకారంతో నేరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ మనీష్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. మంగళవారం బాబా 85వ జన్మదిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షకు విచ్చేసిన సందర్బంగా ఆయన అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగిన చోరీలకు సంబందించి ఈయేడు ఇప్పటికి మూడు కోట్ల రూపాయల మెత్తాన్ని రికవరీ చేసినట్లు ఎన్ పోర్స్ మెంట్ టీం సహకారంతో జిల్లాలో చోరీల రికవరీ బాగా జరిగిందని, క్రైం రేటు కూడా తగ్గిందన్నారు. బెల్టుషాపులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని విలేకర్లు ప్రశ్నించగా అందుకు సంబందించి శాఖ వుందని అవన్నీ ఆ శాఖ చూసుకుంటుందన్నారు. ప్రపంచం మెత్తం ఒక నమ్మకం పై నడుస్తోందని పోలీసులపై కూడా ప్రజలు నమ్మకం పెట్టుకోవాలని, నమ్ముకొని పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారికి సహాయం చేయడం మన మెదటి బాద్యత అని ఆయన తెలియజేశారు. పట్టణంలో హోటల్లు, లాడ్జ్ లు, ఆపార్టమెంట్ల లో సి.సి.కెమరాల ఏర్పాటు అంశంపై విలేకర్లు ప్రశ్నించగా సి.సి.కెమరాల వ్యవహారం ప్రైవేటుదని, ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోరాదని అవసరమైనప్పుడు సాంకేతిక సలహాలు మాత్రమే ఇవ్వవచ్చునన్నారు. బాబా జన్మదిన సందర్బంలో ప్రధాన రహదారులలో ప్రభుత్వ సహకారంతో సి.సి.కెమరాలను ఏర్పాటు చేస్తామని ఎస్పీ మనీష్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా డి.ఏ.పికోసం రైతులు పడరానిపాట్లుపడుతుంటే స్వయాన వ్యవసాయయశాఖామంత్రి రఘువీరారెడ్డి స్వంతజిల్లాలోనే ఓ అనుమతిలేని గోదాములో అక్రమంగా డి.ఏ.పి నిల్వలుండగా వాటిపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి సీజ్చేసిన సంచలన సంఘటన మంగళవారం అనంతపురంలో చోటుచేసుకొంది.రూ.1.10కోట్లను దిగమింగేదుంకు సిద్దంగాఉన్నవారికి ఒక్కసారిగా విజిలెన్స్ చెక్పెట్టింది.మంగళవారం సాయంత్రం విజిలెన్స్ ఎస్పి రంగారెడ్డి ఆధ్వర్యంలో అక్రమ గోదాములు పై మెరుపుదాడులు నిర్వహించారు.దాడుల్లో 650మెట్రిక్టన్నుల డి.ఏ.పి నిల్వలున్నట్లు గుర్తిం చిసీజ్చేశారు.వ్యవసాయాధికారుల అవినీతికి,అరాచకానికి పరాకాష్టగా ఉన్న ఈ డి.ఎ.పి వ్యవహారం వెనుక ఏ పెద్దల హస్తం ఉందోనన్న చర్చకు తెరలేచింది.వివరాల్లోకి వెలితే జూలై మాసంలో సంబంధిత కంపెనీనుంచి 650మెట్రిక్ టన్నుల డి.ఏ.పి జిల్లాకేంద్రానికి చేరింది.దీన్ని 7నంబర్ జాతీయరహదారిపైనున్న ఆయిల్పెడ్ వెనుక ఎలాంటి లైసెన్స్లేని గోదాములో భద్రపరిచారు.ఈ ఎరువు ఏకంపెనీనుంచి వచ్చింది,ఎప్పుడు వచ్చింది,ఎందుకోసం వచ్చింది తదితర వివరాలేవి ఇక్కడి అధికారులకు అందలేదు.లక్ష్మీశ్రీనివాస ఫర్టిలైజర్స్కు కేటాయించినట్లుగా చెబుతున్న ఈ నిల్వలను ఎవరు తెప్పించారు,ఎవరికోసం కేటాయించేందుకు ఎరువులు తెప్పించారన్న వివరాలుకూడా ఏవిలేవు.ఈ సందర్భంలో ఆగస్టు2వతేది మాత్రం వ్యవసాయాధికారులు నింపాదిగావెల్లి గోదామును పరిశీలించారు.ఏమిజరిగిందోఏమోగాని చూసిచూడనట్లుమిన్నకుండిపోయారు.ఈ వ్యవహారాన్ని జిల్లా అధికారయంత్రాంగం దృష్టికి కూడాతీసుకురానున్నట్లు తెలుస్తోంది.అనంతరం ఆగస్తు23న మరోసారి వ్యవసాయాధికారులు సంబంధిచిన గోదామును పరిశీలించి ఎంత ఎరువుంది,ఎవరికోసం తెప్పించారు,ఎన్నిరోజుల క్రితం తెప్పించారన్న వివరాలను సేకరించుకొన్నారు.తరువాత కూడావారు సంబంధిత ఫర్టిలైజర్స్పైనగాని,ఎలాంటి లైసెన్స్లేనిగోదాముపైగాని ఎలాంటి చర్యలకు సిఫార్సు చేయకపోగా చూసిచూడనట్లు ఉండిపోయారు. ఈ క్రమంలోనే వ్యవహారాన్ని పసికట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా ఎస్పి రంగారెడ్డి నేతృత్వంలో మంగళవారం దాడిచేశారు.650మెట్రిక్ టన్నుల ధర రూ.1.90కోట్లుందని అంచనా వేశారు.ఇందులో రూ.1.10కోట్లు ప్రభుత్వ సబ్సిడి ఇవ్వనుండగా రైతులు తమ వాటాగా 80లక్షలుచెల్లించాల్సిఉంది.మొత్తంగా చూసినప్పుడు రూ.1.10కోట్లు దిగమింగేందుకు ప్రయత్నించి గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన డి.ఏ.పిని విజిలెన్స్ అధికారులు దాడిజరిపి గోదామును సీజ్ చేయడంతో వారి అక్రమాలకు అడ్డుకట్ట పడ్డట్లు అయ్యింది.జిల్లా రైతాంగం ఎరువుల కొరతతో చీకటి బజారులో అధిక ధరలను పెట్టి కొనుగోలుచేసి నానాఅవస్థలు పడుతున్న తరుణంలో జిల్లా కేంద్రంలో జాతీయరహదారిప్రక్కనే అనుమతిలేని ప్రభుత్వరంగసంస్థ గోదాము వెనుక డి.ఏ.పి ఎరువుల అక్రమనిల్వలను నిర్భయంగా నిల్వచేసిన సంఘటననుబట్టి పలుమార్లు వ్యవసాయశాఖ అధికారులుసైతం అదేగోదామువద్దకువెళ్లి పరిశీలన జరిపి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం,విజిలెన్స్ దాడులు చేసేవరకు అక్రమ నిల్వల వ్యవహారం దర్జాగా నిర్వహిస్తున్న వైనం జిల్లాలో సంచలనాత్మ చర్చగా మారింది.ఉన్నత స్థాయి అధికారవర్గాల విచారణతో విజిలెన్స్దాడుల అనంతరం అయినా నిష్పక్షపాతంగా విచారణ జరిపితే పలుఅంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.పలుమార్లు వ్యవసాయశాఖవర్గాలుపరిశీలించి కిమ్మనకుండా వెల్లాయంటే ఆశాఖావర్గాల ఆశీస్సులతోనే ఈ తంతంగం కొనసాగుతోందా అన్న అనుమానాలకు రాష్ట్రస్థాయి అధికారవర్గాల విచారణలో సమాధానం లభించాల్సి ఉంది.
జనాభా గణన రెండవ దశ 2011 ఫిబ్రవరి 9 నుంచి 28వ తేదీ వరకూ చేపట్టనున్న పరిశీలనను విజయ వంతం చేయడానికి ఇప్పటినుంచే సంసిద్ధం కావాలని జనాభా గణన ఆపరేషన్ డైరెక్టర్ అనూరాధ డిఆర్వోలు, మున్సిపల్ కమీషనర్లందరినీ ఆదేశించారు. మంగళవారం ఉదయం సచివాలయం నుంచి జనాభా గణన అంశంపై రాష్ట్రంలోనే విఆర్వోలు, మున్సిపల్ కమీషనర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో హైదరాబాదు నుంచి జిఎడి స్పెషల్ సియస్ రెమాండ్ పీటర్, జాయింట్ డైరెక్టర్ హనుమంత రాయ చౌదరి ఇతర కార్యదర్శులు పాల్గొనగా జిల్లా నుంచి డిఆర్వో సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ శివ కోటి ప్రసాద్, కలెక్టర్ కార్యాలయం సూపరింటెండ్ కెవి సుబ్బయ్య, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ నారయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం ఏప్రిల్ 26 నుంచి జూన్ 10 వరకూ చేపట్టిన మొదటి దశ జనాభా గణనను విజయవంతం చేయడం జరిగిందని, ఇదే స్పూర్తిలో రెండవ దశను విజయవంతం చేయాలన్నారు. మొదటి దశలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని సూచించారు. నిర్ధేశించిన షెడ్యూల్లను ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా ఈ నెల 15 లోపు నివేదిక పంపాలన్నారు. సివిల్ రిజిస్ట్రేషన్ అంశంలో జనన, మరణాల నమోదు 70 శాతం వుందని దీనిపై ప్రత్యేక శ్రద్ధ గైకొని తహశీల్దార్లు, ఎంపిడివోల సమన్వయంతో ఆశా అంగన్వాడీ వర్కర్ల వద్ద నున్న సమాచారం పొంది 100 శాతం జనన మరణాల నమోదుకు కృషి చేయాలన్నారు.
పంచాయితీ పట్టణ వారి సమాచారం
పంచాయితీ పట్టణ వారీగా రెవెన్యూ గ్రామాల వివరాలపై డైరెక్టర్ అడిగిన ప్రశ్నలకు డిఆర్వో సుదర్శన్ రెడ్డి బదిలిస్తూ జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని గత నెల 27న ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. అలాగే డిటైల్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ పేజ్ ..999కు సంబంధించి గతంలో రెండు మండలాల సమాచారం పంపించామని, ఇంకా 35 మండలాల సమాచారం రెడీగా వుందన్నారు. మిగిలిన సమాచారాన్ని 5 రోజుల్లో పంపాలని డైరెక్టర్ అనూరాధ డిఆర్వోకు సూచించారు.
రాష్ట్రంలో ఎంతోమంది కళాకారులు ఉన్నప్పటికి వారికి అన్నివిదాలా సహాయసహకారాలు అందకపోవడంతో కళాకారుల కుటుంబాలు వీదినపడుతున్నాయని వారి కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశ్యంతో కళాకారుల ఐక్యవేదికను స్థాపించడం జరిగిందని ఇందులో భాగంగానే కళాకారులకున్న సమస్యలను అడిగి వారికి కావాల్సిన వనరులు సమకూర్చకోవడానికి వీలుగా ప్రతి గ్రామానికి వెళ్ళి కళాకారులను ప్రోత్సాహిస్తున్నామని కళాకారుల ఐక్యవేదిక రాష్ట్రఅద్యక్షుడు సినినటుడు నరేష్ మంగళవారం కళాకారులకు మండలంలో సమావేశం అయి మాట్లాడారు.కళను బ్రతికించుకోవాల్సిన భాద్యత కళాకారులందరిపైనా ఉందని కళాకారుడు తన కళను నిరూపించుకోవాలనే ఉద్దేశ్యంతో లోకంలో బ్రతుకుతారని కళవల్ల ఎంతో మంది కళాకారులు ఎన్నో వ్యయప్రయాసలకు వెచ్చించి వారు కళను బయటకు తెస్తున్నారని ఇలాంటి కళాకారులకు రాష్ట్రప్రభుత్వం ఏదైనా ఆర్థికసహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఒక్క మండలానికి వెళ్ళి ప్రతి ఒక్క కళాకారునివద్ద ఆ కళాకారునికి ఉన్న సమస్యలను పరిష్కరించడంకోసం తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్రంలో ఐదులక్షలమంది కళాకారులు ఉన్నారని వీరందరికి ప్రతి సంవత్సరం రూ.లక్షకోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతుందని,అయినప్పటికీ కళాకారులకు బడ్జెట్ కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తున్నారని కళాకారుడు కళారంగంపైనే ఆదారపడి ఉంటారని కళారంగంలో ఉంటూనే కుటుంబాన్నిపోషించుకుంటున్నారని,కళారంగం ద్వారా ఎంతోమంది సినీరంగంలో ప్రవేశించి లక్షలకొద్ది డబ్బు సంపాదించుకుంటున్నారని అయినప్పటికీ పేదకళాకారులను ఆదుకునే విషయంలో ఎవరూ ముందుకు రాకపోవడం శోచనీయం అని ఏ ఒక్క కళాకారుడు కూడా ఆదైర్యపడకుండా కళాకారులకు అన్నివిదాలా సహాయసహాకారాలు అందించడానికి తాను ముందుంటానని హామీఇచ్చారు.ఏప్రిల్ 2వతేదీన కళాకారుల దినోత్సవం సందర్బంగా హిందూపురంలో కళాకారుల ఐక్యవేదికను స్థాపించడం జరిగిందని ప్రస్తుతం అనంతపురం జిల్లాతోపాటు విజయవాడ,విజయనగరం తదితర జిల్లాల్లో కూడా కళాకారులను ప్రోత్సాహించడంకోసం కళాకారుల ఐక్యవేదికను స్థాపించడం జరుగుతుందని కాబట్టి ఏ ఒక్క కళాకారుడు ఆదైర్యపడకుండా కళారంగాన్ని బతికించడంకోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలన్నారు.
కార్మిక ప్రజల ప్రయోజనాల కంటే కంపెనీల బడాబాబుల ప్రయోజనాలకే యు.పి.ఏ.ప్రభుత్వం కట్టుబడిందని ఆరోపిస్తూ, మంగళవారం ఆత్మకూరు నంది సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్, సి.పి.ఎం.అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్బంగా సి.యఐ.టి.యు.కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ధరలను పెంచుతూ, పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపరిచి, దాని ద్వారా సరుకులు రవాణాచేయించాలన్నారు. ప్రభుత్వ రంగసంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించి లక్షల, కోట్లరూపాయలు ప్రైవేటు రంగసంస్థలకు రాయితీలు కల్పించడం దుర్మార్గమైనచర్య అన్నారు. రాష్ట్రంలో మూడ లక్షల పైచిలుకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన వివిధశాఖల్లో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారి ఉద్యోగభద్రత గాలికివదిలేశారన్నారు. కార్మిక చట్టాల అమలుకు గట్టిచర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు.నాయకులు సర్దానప్ప, నాగరాజు, ఎర్రిస్వామి, రామాంజినేయులు, మల్లికార్జున, రామచంద్ర, శశిధర్, జయచంద్ర, శివతదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామానికి చెందిన బి.జె.పి.నాయకులపై దాడిచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని మంగళవారం బి.జె.పి.జిల్లా అధ్యక్షుల అధ్వర్యంలో జిల్లా ఎస్.పి.కి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా బి.జె.పి.జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బత్తలపల్లి మంలం, మాల్యవంతం గ్రామానికి చెందిన బి.జె.పి.యువమోర్చ జిల్లా అధ్యక్షులు పిల్లేరవీంద్ర, ధర్మవరం పట్టణానికి చెందిన మైనార్టీ మోక్షా అధ్యక్షునిపై మారణాయుధాలతో దాడులు చేయడం హేయమైనచర్య అన్నారు. ఈ గ్రామాల్లో వర్గకక్షలు సమిసిపోలేదని, ఇలాంటి సమస్యలుపునరావృతం కాకుండా గట్టిచర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే, బి.జె.పి.అధ్వర్యంలో ఆందోళన చేపడుతామని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామాల్లో గట్టిబందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. దాడులు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్యాక్షన్స్ సాంస్కృతినికి తిరిగి ప్రాణంపోయకుండా గ్రామీణ ప్రాంతప్రజలు స్వేచ్చగా, సుఖసంతోషాలతో జీవించే విధంగా ప్రశాంత వాతావరణం కల్పించాలని జిల్లా ఎస్.పి.కి వినతి పత్రం సమర్పించారు.
ఖరీష్ పంటరుణాల మంజూరు ప్రక్రియ సమయాన్ని సెప్టెంబర్ 20 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అందుకు అనుగుణంగా పంటరుణాల లక్ష్యసాదనను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి.జనార్దన్రెడ్డి బ్యాంకు అదికారులకు సూచించారు.సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంటరుణాల మంజూరుపై బ్యాంకు అదికారులతో సమీక్షనిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకూ రూ.1567 కోట్ల పంటరుణాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.సెప్టెంబర్ 20నాటికి మిగిలిన రూ.33 కోట్ల పంటరుణాలను రైతులకు అందించడానికి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.దీంతోపాటు ప్రభుత్వ సంక్షేమహాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా వారికి వాటర్ ఫ్యూరిఫైయర్లను అందచేయాల్సిందిగా బ్యాంకు అదికారులను కోరారు.ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ రాఘవేంద్ర,సిండికేట్ జిఎమ్ రవిశంకర్,కెనరా బ్యాంకు అదికారి కులకర్ణి,డిసిసి బ్యాంకు అదికారి నరసింహారెడ్డి,అనంతగ్రామీణబ్యాంకు అదికారి శ్రీదేవి తదితరులు పాల్గోన్నారు.
రాష్ట్రంలోని రాజకీయ నాయకులలోకెల్ల అతి పెద్ద అవినీతి పరుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి అని తెలుగుదేశం పొలిట్ బ్యూరోసభ్యుడు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి విలేకర్ల సమావేశంలో కాలువ శ్రీనివాసులు, మహాలక్ష్మి శ్రీనివాస్, వెంకటరాముడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ హైదరాబాద్లో సచివాలయం వద్ద పేద విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంటు అమలు చేయాలని దేశం నాయకులు ధర్నా చేపడితే వారిని అరెస్టు చేయడం అమానుషం అన్నారు.
ఫీజు రీఎంబర్స్మెంటు రద్దు పరిస్తే దాదాపు 30 లక్షల మందిపేద విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుందని అవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి పేద, మధ్య తరగతి వారు తమ పిల్లలను చదివించు కోవాలంటే గగనం అవుతుందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి రఘువీరారెడ్డి, వైయస్ విగ్రహాలు లక్ష పెడతామని వ్యాఖ్యానించడం మంచి ధోరణీ కాదన్నారు. విగ్రహాల ఏర్పాటులో వున్న కాంగ్రెస్ శ్రేణులు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని అదుకోవడం మరచిపోయారన్నారు. చంద్రబాబు నాయుడును విమర్శించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు నాగరాజు, రమణయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.