కడప

నేను ఒంటరిని కాను – జగన్

06.09
ప్రజాసమస్యలు తెలుస్తాయని తనతోపాటు ఓదార్పుయాత్రలో పాల్గొనమని శాసనసభ్యులను చేతులు జోడించి ప్రార్థించానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో మూడవరోజైన ఆదివారం జగన్ ఓదార్పుయాత్రను సాగించారు. వెలిగండ్ల మండలం గుడిపాటిపల్లి ఎస్‌సి కాలనీలోని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆకాలనీకి చెందిన గోన దేవమ్మ సమస్యలను జగన్‌కు విన్నవించారు. గుడిపాటిపల్లి, కట్టికిందపల్లె, పి. నాగులవరం, రామగోపాలపురం, గన్నవరం, వెలిగండ్ల తదితర గ్రామాల్లో వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. జగన్ మాట్లాడుతూ తన వెంట శాసనసభ్యులు లేకపోయినా ప్రజలు అండగా ఉన్నారని తెలిపారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోలేదని ప్రతివాడి గుండెల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఓదార్పుయాత్ర సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తనపై ప్రేమానురాగాలు చూపిస్తున్నారని ఆయన తెలిపారు. జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలికారు. కాబోయే సిఎం అంటూ ప్రజలు నినాదాలు చేసినప్పటికీ జగన్‌నుండి ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ పేరును కాని, రాష్ట్రప్రభుత్వ పనితీరుపై ఎక్కడ కూడా విమర్శలు చేయకుండా జగన్ కేవలం తనతండ్రి వైఎస్‌ఆర్ పేరునే ఉచ్చరిస్తూ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.
జిల్లాకు చెందిన ఐపిఎస్ అధికారి ఆవుల రమేష్‌రెడ్డి ఏర్పాటుచేసిన వైఎస్‌ఆర్ స్మృతివనాన్ని జగన్ ప్రారంభించారు. ఓదార్పుయాత్రలో రాష్ట్ర భూగర్భగనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కాటం అరుణమ్మ, దర్శి శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాదురెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాద్ రావు, కాకినాడ శాసనసభ్యుడు వి చంద్రశేఖరరెడ్డి, జమ్మలమడుగు శాసనసభ్యుడు దేవగుడి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఇదిలాఉండగా కనిగిరి నియోజకవర్గంలో జగన్ పర్యటన సాగించినప్పటికీ ఆ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఓదార్పుకు డుమ్మాకొట్టారు. కనిగిరి మాజీ శాసనసభ్యుడు ముక్కు కాశిరెడ్డి అన్ని తానై ఈ ఓదార్పుయాత్రలో పాల్గొని విజయవంతం చేశారు.
ఓదార్పులో ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు
ఒంగోలు: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాలో చేపట్టిన ఓదార్పుయాత్రకు ఇతర జిల్లాలనుండి ముగ్గురు శాసనసభ్యులు వచ్చి తమ మద్దతు ప్రకటించారు. ఆదివారం ప్రకాశం జిల్లాలోని వెలిగండ్ల, హనుమంతునిపాడు తదితర మండలాల్లో జగన్ ఓదార్పుయాత్ర నిర్వహించారు. రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాద రావు, కాకినాడ శాసనసభ్యుడు చంద్రశేఖరరెడ్డి, జమ్మలమడుగు శాసనసభ్యుడు దేవగుడి నారాయణరెడ్డి పాల్గొని జగన్ ఓదార్పుయాత్రకు మద్దతు ప్రకటించారు. తనకు కూడా జగన్ ఓదార్పుయాత్రలో పాల్గొన వద్దని ఆదేశాలు ఉన్నాయని అయితే తాను మాత్రం ఓదార్పుయాత్రలో పాల్గొంటున్నాని తెలిపారు. మంత్రి బాలినేని కూడా తనమంత్రి పదవిపోయినప్పటికీ జగన్ ఓదార్పుయాత్రలో పాల్గొంటానని మరోసారి అధిష్ఠానానికి సంకేతాలు పంపారు.

రాష్ర్టంలో విస్తుతంగా పోటెత్తిన వరదలు

మరో పర్యాయం తూర్పు తడిసి ముద్దయ్యింది. ఒకప్రక్క గోదావరి వరద ఉధృతి, మరో ప్రక్క అధిక వర్షాలతో జిల్లా అతలా కుతలం అవుతున్నది. ముఖ్యంగా కోనసీమ నీటి ముంపులో వుంది. గోదావరి కాచ్‌మెంట్‌ ఏరియాలోను, ఏజెన్సీలోను భారీగా వర్షాలు పడడంతో గోదావరి ఉప్పొంగుతుంది. ఆదివారం అర్థరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. ఇప్పటికి 9 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులు తున్నారు. మరోపక్క కోనసీమ వర్షపు నీటి ముంపులో వుంది. శుక్రవారం రాత్రి నుండి శనివారం తెల్లవారుజాము వరకు కురిసిన సుమారు 20 సెం.మీ.ల వర్షపాతంతో కోనసీమ తడిసి ముద్దయ్యింది.
ఇంత భారీగా కురి సిన వర్షపాతం వల్ల కోనసీమలో పంట పొలాలన్నీ ముంపులో వున్నాయి. సుమారు 50 వేల ఎకరాలలో వరిపంట పూర్తిగా నీటముంపులో వుంది. గోదావరి నిండుగా పారడం, డ్రైన్లు అన్నీ బిగబట్టడంతో పంట పొలాలలో నీరు ఎగదన్నడంతో ఖరీఫ్‌ ఉక్కిరిబిక్కిరవు తుంది. పరిస్థితి ఇదే విధంగా రెండు, మూడు రోజులపాటు కొనసాగితే ఖరీఫ్‌పై ఆశ వదులుకోవలస్సిందేనన్న భయంతో కోనసీమ రైతాంగం వుంది. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటికే సుబ్బారెడ్డి సాగర్‌కు గండి పడడం, ఆనక పూడ్చివేత జరిగింది. ఏలేరు ఆయకట్టుతో పాటు విశాఖ జలాలకు నీరందించే ఏలేరు ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరుకుంది. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రానున్న రెండు, మూడు రోజులలో కూడా అల్పపీడనం ప్రభావం వల్ల వర్షాలు కురిస్తే అటు డెల్టాలోను, ఇటు ఏలేరు రిజర్వాయర్‌కు ముప్పు పొంచివుం దం టున్నారు.
వశ్చిమంలోనూ అదే పరిస్థితి
ఏలూరు,మేజర్‌న్యూస్‌ ప్రతినిధి : పశ్చిమ గోదావరి జిల్లాను వరదలు వణికిస్తున్నాయి. గత వారం రోజులుగా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, డ్రైన్లు పొంగిపొర్లడంతో లక్షా 50 వేల ఎకరాలు నీటి మునిగాయి. గత నాలుగు రోజులుగా జిల్లాలోని ప్రధాన వాగులకు వస్తున్న వరద నీరు తగ్గకపోవడంతో పరిస్థితి మరింతగా జఠిలమవుతుందని ఆం దోళన చెందుతున్నారు.ఇప్పటికే జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
మరింతగా వస్తున్న తమ్మిలేరు, రామిలేరు, కొవ్వాడ, ఎర్రకాలువ, గొంతేరు డ్రైన్‌, యనమదుర్రు డ్రైన్లు, మొయ్యేరు లాంటి ప్రధాన డ్రైన్ల ద్వారా వస్తున్న వరద నీటితో కొల్లేరు నీటిమట్టం గణనీయంగా పెరుగుతున్నది. ఇప్పటికే అనేక కొల్లేటి గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. దీనికి తోడు గోదావరికి కూడా భారీ ఎత్తున వరద రావడంతో ఏటిగట్టు పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు.రానున్న రెండు రోజులలో గోదావరి నీటి మట్టం మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించడంతో ఏటిగట్టు ప్రజలు దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతం, పల్లపు ప్రాంతం అనే బేధం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వరద పరిస్ధితి ఒకేలా ఉండడం, గతంలో ఎన్నడూ లేదని అధికారులు చెబుతున్నారు.

ఘనంగా వైఎస్‌కు నివాళులు

దివంగత ముఖ్యమంత్రి డావైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్దంతిని పురష్కరించుకొని మండల పరిషత్‌ కార్యాలయం నందు మండల అధ్యక్షుడు ద్వార్శల గురివిరెడ్డి ఆధ్వర్యంలో సంస్మరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గురివిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు రాజశేఖర్‌ రెడ్డి చేసిన సేవలను, సంక్షేమ పథకాలను గురించి ఆయన వివరించారు. అనంతరం వైఎస్‌ చిత్రపటానికి పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జెడ్పీటీసి మేకల బాబు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి అకాల మరణం చెందడం చాలా దురదృష్ట కరం. ఆయన చనిపోయి సం కాలం అయినప్పటికీ ఆయన మన మధ్యనే ఉన్నట్లు ఉందని తెలిపారు. మాజీ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ అన్నవరం రామ్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ముఖ్యమంత్రులందరిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ సాటిలేని నేటి ముఖ్యత్రిగా ఆయన పదవీ కాలంలో మంచి పేరు తెచ్చుకున్నారన్నారు.
మండల తహశీల్దారు పుల్లా రెడ్డి, మండల అభివృద్ధి అధికారి మద్దిలేటి మాట్లాడుతూ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలు, నిరుపేదలకు ఆరోగ్యశ్రీ, కిలో రూ.2ల బియ్యం వంటి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారన్నారు. ఈ సంక్షేమ పథకాలు మారుమూల పల్లెలకు అందాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల విస్తరణ అధికారి శివకుమారి, మండల కాంగ్రెస్‌ నాయకులు కాంట్రాక్టర్‌ పి వెంకట రమణా రెడ్డి, బద్రి పల్లె రామచంద్ర శర్మ, మాజీ మండల అధ్యక్షుడు వెంటక సుబ్బారెడ్డి, ఉప మండలాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు వైఎస్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

వైఎస్‌ఆర్‌ వర్దంతి సందర్భంగా రక్తదాన శిబిరం

మహానేత దివంగత ముఖ్యమంత్రి డా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటి కడప వారి ఆధ్వర్యంలో కడప రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో గురువారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. వైఎస్‌ జగన్‌ యువసేన అధ్యక్షుడు రాచమల్లు చంద్రశేఖర్‌ రెడ్డి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. డిసిసి ప్రసిడెంట్‌ సురేష్‌ బాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. డా వైఎస్‌ రాజశేఖర్‌ వర్దంతి సందర్భంగా రక్తందానం చేసిన యువకులను సురేష్‌ బాబు అభినందించారు. ఈ కార్యక్రమ ంలో డా ఇస్మాయిల్‌, రెడ్‌ క్రాస్‌ సొసైటి మేనేజర్‌ నారాయణరాజు, డాశశికళ, డిగ్రీకాలేజి ప్రిన్సిపాల్‌, రెడ్‌ క్రాస్‌ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

యావత్‌ ప్రపంచం వైయస్‌కు నివాళి అర్పిస్తొంది – ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికి యావత్‌ ప్రపంచం నివాళి అర్పిస్తొందని జమ్మలమడుగు నియొజకవర్గ శాసనసభ్యులు అదినారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం స్దానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఎర్పాటు చేసిన చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.
అనంతరం ఆయన మీడియా తొ మాట్లాడుతు దేశ చరిత్రలొ ఏ ముఖ్యమంత్రి చేపట్టని సంక్షేమపధకాలు ఎన్నొ చేపట్టి, అన్ని పధకాలు విజయవంతం పేదలకు అందేలా చేసిన మహనాయకుడు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అని అన్నారు. అంతేగాక దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి తనయుడు కడప యం.పి. వైయస్‌ జగన్మొహన్‌రెడ్డి చేపట్టిన ఓదార్పుయాత్రకు కాంగ్రేస్‌ అదిష్టానం సానుకూలంగా స్పందించి అనుమతి ఇవ్వాలని కొరారు. అనంతరం మున్సిపల్‌ వైయస్‌ చైర్మ్‌న్‌ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతు పేద ప్రజల అభ్యున్నతి పాటు పడిన మహనేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. 108,104, అరొగ్యశ్రీ లాంటి ఎన్నొ పధకాలు పేదలకు అందించిన ఆ మహనాయకుని మరణం లేదని,ప్రతి పేదవాడి గుండెలొ నిత్యం కొలువైవున్నాడని అన్నారు.
అనంతరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారు రాగసుద, మరియు మున్సిపల్‌ వైయస్‌ చైర్మ్‌న్‌ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, కమీషనర్‌ మదుకుమార్‌ మరియు కౌన్సిలర్స్‌ దివంగత నేతకు పూలమాలవేసి ఘనంగా నివాళఇర్పించారు. ఈ కార్యక్రమంలొ యన్‌.కొట్టాలపల్లే సర్పంచ్‌ నారాయణరెడ్డి, చిన్నముడియం క్రిష్ణారెడ్డి మరియుమున్సిపల్‌ కార్యాలయ సిబ్బంది గంగిరెడ్డి, మాదవరెడ్డి మదుసూదన్‌ మరియు సిబ్బందిపాల్గొన్నారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లొ వైయస్‌కు నివాళి, స్దానిక తహశీల్దార్‌ కార్యాలయంలొసైతం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి ఎమ్మేల్యే అదినారాయణరెడ్డి పూలమాలవేసి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమం కార్యాలయ సిబ్బంది డిప్యూటి తహశీల్దార్‌ నజీర్‌బాష, అర్‌ఐ బాబయ్య, మరియు అడిషనల్‌ అర్‌ఐ బాష మరియు వఇర్వొలు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అర్‌ఐ భాష మాట్లాడుతు భూమి ఆకాశం వున్నంతకాలం వైయస్‌అర్‌ కీర్తి ప్రతిష్టలు వుంటాయన్నారు. అనంతరం స్దానిక ప్రభుత్వ ఆసుపత్రిలొ ఎమ్మేల్యే అదినారాయణరెడ్డి వైయస్‌అర్‌ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలొ అసుపత్రి సూపరిండెంట్‌ విజయ్‌కుమార్‌ మరియు ఇతర వైద్యబృందంతొ పాటు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం స్దానిక అలంకార్‌ సినిమా ధియేటర్‌ వద్ద ముస్లిం నాయకులు ఎర్పాటు చేసిన వైయస్‌ చిత్రపటానికి ఎమ్మేల్యే పూలమాలవేసి నివాళి అర్పించారు.
అనంతరం మున్సిపల్‌ వైస్‌ చైర్మ్‌న్‌ తాతిరెడ్డి సూర్యంరెడ్డి పూలమాలవేశారు.తదనంతరం పెద్దపసుపల మొటు వద్ద జగన్‌యువసేన నాయకులు ఎర్పాటు చేసిన వైయస్‌అర్‌ చిత్రపటానికి ఎమ్మేల్యే అదినారాయణరెడ్డి, సూర్యనారాయణరెడ్డి రమణారెడ్డి తదితరులు పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు.. అలాగే యం.పి.డివొ కార్యాలయంలొ యం.పి.డి.వొ. మల్లయ్య వైయస్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అంతేగాక పట్టణంలొని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లొ అయాకార్యాలయ అదికారులు వైయస్‌కు ఘనంగా నివాళి అర్పించారు. తదనంతరం సుమారు వందవాహనాల్లొ వైయస్‌అర్‌ కు నివాళి అర్పించెందుకు ఈడుపులపాయకు బయలుదేరి వెళ్ళారు.
స్దానిక సియస్‌ఐ క్రైస్ట్‌ చర్చ్‌లొ ప్రత్యేక ప్రార్దనలు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆత్మశాంతికై స్దానిక సియస్‌ఐ క్రైస్ట్‌ చర్చిలొ గురువారం ప్రత్యేక ప్రార్దనలు నిర్వహించారు. వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రదమ వర్దంతి సందర్బంగా చర్చిఫాదర్‌ రెవరెండ్‌ జయకుమార్‌ మాట్లాడుతు మైనార్టిలకు ఎన్నొ సేవలు చేసిన మహొన్నత వ్యక్తి అని వైయస్‌ను కొనియాడారు. అంతేగాక దివంగత ముఖ్యమంత్రి ఆత్మకు శాంతికలుగాలని, అలాగే వైయస్‌ కుటుంబసభ్యులకు ఆ ప్రభువు ఓదార్పును అనుగ్రహించాలని ప్రార్దించారు. ఈకార్యక్రమంలొ చర్చి కార్యదర్శి రబ్బిన్‌బాబు, విజయ్‌కుమార్‌,రాజశేఖర్‌ జయరాజ్‌,బాస్కర్‌,హన్నమ్మ,నిర్మలమ్మ,సారమ్మ తదితరులు పాల్గొన్నారు.
మైలవరం మండలంలొ…..
స్దానిక తహశీల్దార్‌ కార్యాలయంలొ దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటానికి రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌ వేణుగొపాల్‌ పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలొ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండలాబివృద్దికార్యాలయంలొ మండలాద్యక్షులు బండేన్న వైయస్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలొ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మైలవరం జడ్పిటిసి ఎ.సి.చెన్నారెడ్డి వితరణ
జమ్మలమడుగు పట్టణంలొని జ్యొతిమనొవికాస కేంద్రంలొని మానసిక చిన్నారులకు మైలవరం జడ్పిటిసి ఎ.సి.చెన్నారెడ్డి వైయస్‌అర్‌ ప్రదమ వర్దంతి సందర్బంగా సుమారు ఏడు వేల రూపాయల విలువ చేసే సరుకులు పంపిణి చేశారు.

తృటిలో తప్పిన ఘోరరోడ్డు ప్రమాదం

ముద్దనూరు మండల పరిదిలోని ముద్దనూరు,జమ్మలమడుగు రహదారిలోని పులికోన వంపు వద్ద గురువారం దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ ఆర్‌ ప్రథమ వర్థంతికి వెళుతున్న వైయస్‌ అబిమానుల ప్రవేటు బస్సు బోల్తా పడింది,తృటిలో ఘారప్రమాదం తప్పింది,దాదాపు 20మంది రక్తగాయాలయ్యాయి.జెడ్‌పిటిసిశివనాథరెడ్డి,కాంగ్రెస్‌నాయకులు మధుసూధనరెడ్డి,సర్పంచుదానంబాబు ప్రమాదస్థలంలో సహాయచర్యలు చేపట్టారు.మధుసూదనరెడ్డి సొంత జెసిబితో డ్రైవర్‌,కంటెక్టర్‌ల ప్రాణలను కాపాడారు.
పులివెందుల నియోజకవర్థంలోని ఇడుపులపాయలలో వైయస్‌ఆర్‌ప్రథమ వర్థంతికి వెళుతున్నారు.వీరు జమ్మలమడుగు నాగలగట్టుకు ప్రాంతానికి చెందినవారు.పులికోన వంపువద్దకు రాగానే ఈప్రమాదం జరిగింది,ఎటువంటి ప్రాణాపాయం జరుగలేదు.బస్సుబోల్తాపడిన వెంటనే గాయపడినవారిని వెనుక వర్థింతికి వెళుతున్న వాహనాలను నిలిపి వాటిలో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బస్సులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌,కండక్టర్‌ను జెసిబి సహాయంతో భయటకు లాగి 108 లో ఆసుపత్రికి తరలించారు.ప్రమాదానికి గురురైన బస్సును చూస్తే చాలా మంది మరణించి వుండవచ్చు అనుకొంటారు,బస్సుమరో పల్టీకొట్టిన 60అడుగుల లోయలో పడి భారీ ప్రాణనష్టం జరిగిండేది.వైయస్‌ఆర్‌ సాక్షాత్తుగా తమ అబిమానులను కాపాడుకొన్నారు.

వైఎస్‌ జగన్‌ తన తండ్రి అంతటి గొప్పవాడు అవుతాడు – మంత్రి సాయిప్రతాప్‌

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన అంతటి వాడు అవుతాడని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి సాయిప్రతాప్‌, రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖా మంత్రి అహ్మదుల్లాలు పేర్కొన్నారు. గురువారం ఆకేపాటి ఫౌండేషన్‌ట్రస్టు అధినేత ఎమ్మేల్యే ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేట నియోజిక వర్గంలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి సాయిప్రతాప్‌ మాట్లాడుతూ గురువులను ప్రతి ఒక్కరూ గౌరవిస్తే ఉన్నతశిఖరాలు అధిరోహించడం ఖాయమన్నారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ వర్ధంతి నాడు గురుపూజోత్యవం ఏర్పాటు చేసి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం ఎమ్మేల్యే ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డికే సాటి అన్నారు. 25 కోట్ల రూపాయలతో వైఎస్‌ శృతి వనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైఎస్‌తో తన బంధం విడదీయలేనిదని స్నేహానికి చిహ్నం వైఎస్‌ అన్నారు. ఆయన హాఠత్‌మరణం ఆయన వర్ధంతిని జరుపుకోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. జిల్లా వాసులు జిల్లాలో ఆయన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకోవల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్‌ కుటుంబానికి తామెంతో రుణపడి ఉన్నామన్నారు. ఆయన తనయుడ వైఎస్‌ జగన్‌ వెన్నంటే ఉంటామన్నారు. రాష్ర్ట ప్రాధమిక విద్యాశాఖా మంత్రి అహ్మదుల్లా మాట్లాడుతూ గురువులను అందరూ గౌరవించాలన్నారు. ప్రపంచంలోనే మంచి గుర్తింపు కల్గిన నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు.  ఆయన మరణం చాలా బాదకరమైన విషయమన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు బాగా చదువుచెప్పి మంచి వృద్ధిలోకి తీసుకరావాలన్నారు. డ్రాప్‌అవుట్‌లు లేకుండా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రైట్‌ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ను ప్రవేశపెట్టిందని తద్వారా ప్రతి ఒక్కరు చదువుకొనే అవకాశం ఉంటుందన్నారు. రానున్న కొన్ని సంవత్సరాలలో రాష్ట్రంలో చదువురాని వారు ఒక్కరు కూడా ఉండరని ఆయన పేర్కొన్నారు. శాసన సభ్యులు ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆకేపాటి ఫౌండేషన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించడం తమ విధిగా భావిస్తున్నామన్నారు. పేద విద్యార్ధులకు మంచి విద్యను అందించి రాజంపేటకు పేరు ప్రఖ్యాతలు తీసుక రావాలని ఉపాధ్యాయులకు సూచించారు.  అనంతరం రాజంపేట, వీరబల్లి, సుండుపల్లి, ఒంటిమిట్ట, నందలూరు, సిద్దవటం, పెనగలూరు మండలాలకు చెందిన 90 మంది ఉత్తమ ఉపాధ్యాయులను మంత్రుల చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ మల్లెల శ్రీవాణి, జిల్లా జెడ్‌పి కోఆప్షన్‌ సభ్యులు షబ్బీర్‌ అహ్మద్‌, నందలూరు జెడ్‌పిటిసి ప్రమీలమ్మ, ఎస్టీయు రాష్టన్రాయకులు అబ్బిగారి రాజేంద్ర ప్రసాద్‌, ఎంఇఓ రమణారెడ్డి, నిర్వాహకులు జె.వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు మురళీధర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డి, పోలి మురళీధర్‌రెడ్డి, రెడ్డిమాసి రమేష్‌నాయుడు, దండుగోపి, విశ్వనాధరెడ్డి, సోమబత్తిన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా వైఎస్‌ఆర్‌ వర్థంతి వేడుకలు

దివంగత ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రథమ వర్థంది వేడుకలను శుక్రవారం మండల కేంద్రాలతోపాటు గ్రామగ్రామాన పండుగ వాతావరణంలో వైభవంగా నిర్వహించారు. వై.ఎస్‌.ఆర్‌కు ఘనంగా నివాళి అర్పించి ఆయన సేవలను కొనియాడారు. పలుచోట్ల అన్నదాన, వస్తద్రాన కార్యక్రమాలు చేపట్టారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాయచోటి, మేజర్‌న్యూస్‌ ః దివంగత నేత రాజశేఖర్‌ రెడ్డి ప్రథమ వర్థంతి వేడుకలను శుక్రవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కార్యాలయం, మున్సిపల్‌ కార్యాలయాలు, శ్రీనివాస, యస్‌.డి.హెచ్‌.ఆర్‌ డిగ్రీ కళాశాలలు, న్యాక్‌ కేంద్రాల్లో రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటానికి పుష్ఫ గుచ్చాలు వుంచి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వై.యస్‌.ఆర్‌ పేద ప్రజల అభ్యున్నతి కొరకు చేసిన సేవలు మరువలేనివన్నారు.
ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ర్టంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో అందాయన్నారు. ప్రియనేత వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి అమరశేఖరుడయ్యారన్నారు. ఈ సంక్షేమ పథకాలు పొరుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలకు అదర్శంగా వున్నాయని వై.యస్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను కీర్తించారు. ఆ మహోన్నత వ్యక్తి ఆశయాలను కొనసాగించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అనంతరం 12వ ఆర్థిక సంఘ గ్రాంటు ద్వారా ప్రతి ఇంటా చెత్త సేకరించేందుకు మున్సిపాలిటీ వారు కొనుగోలు చేసిన రెండు ఆటోలను వారు అందించారు.
ఈ మాసపు వితంతు,విద్యార్థి, వికలాంగుల ఫించన్లను మున్సిపల్‌ కార్యాలయంలో చేపట్టారు. యస్‌.యన్‌. కాలనీలో జె.సి.బి ఓనర్స్‌ అసోసియేషన్‌ఆధ్వర్యంలో, కౌన్సిలర్‌ ఫయాజ్‌ అధ్వర్యంలో స్థానిక కుమ్మరమిట్ట నందు అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ వీరభద్రయ్య, కమీషనర్‌ వెంకట్రావ్‌, కాంగ్రెస్‌ నాయకులు డాక్టర్‌ సుగవాసి విద్యాధర్‌, డాక్టర్‌ శ్రీనివాస రాజు, జనార్థన్‌ రెడ్డి, చంద్రమోహన్‌ రెడ్డి, కౌన్సిలర్లు రషీద్‌, దశరథరామిరెడ్డి, షబ్బీర్‌, ఖాదర్‌ మోదీన్‌, కో-ఆప్షన్‌ కొట్టే చలపతి , డిసిసి ప్రధాన కార్యదర్శి హారూన్‌, పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో…..
వై.యస్‌.ఆర్‌ ప్రథమ వర్థంతిని పురస్కరించుకొని గురువారం స్థానిక రెడ్డీస్‌ కాలనీలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పేద మహిళలకు బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు శ్రీనివాస కుమార్‌ రాజు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం వై.యస్‌.ఆర్‌ ఎనలేని సేవ చేశారన్నారు. ఆయన వర్థంతి నాడు లయన్స్‌ క్లబ్‌ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం తమకు గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ సభ్యులు డాక్టర్‌ బయారెడ్డి, అశోక్‌ రెడ్డి, హరినాధ రెడ్డి, నారాయణ రెడ్డి, టక్కు సుబ్బారెడ్డి, స్వరూపగుప్త, యంపిటిసి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గాలివీడులో…
వై.యస్‌.ఆర్‌ ప్రధమ వర్థంతిని పురస్కరించుకొని మండల సభా భవనంలో వై.యస్‌.ఆర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి యంపిడిఓ నారాయణ నాయక్‌ ఘన నివాళి అర్పించారు. అనంతరం కొద్ది నిముషాలు మౌన వ్రతాన్ని పాటించి ఆయన కార్యక్రమాలను నెమరువేసుకున్నాడు. అనంతరం స్థానిక పంచాయితీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఫించన్‌దారులతో కలసి వై.యస్‌.ఆర్‌ చిత్రపటానికి పూలమాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఇ.ఓ.పి.ఆర్‌డి శేఖర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళ దారుణహత్య

పట్టణంలోని ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసంవుంటున్న వద్ది సుబ్బలక్ష్మమ్మ (55) అనే మహిళను గొంతుకోసి హత్యచేసిన సంఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం ఈశ్వరరెడ్డినగర్‌లో సుబ్బలక్ష్మమ్మను గతరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకోసి దారుణంగా హత్యచేసినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం మేరకు.. గత సంవత్సర కాలం నుంచి సుబ్బలక్ష్మమ్మ ఈశ్వరరెడ్డినగర్‌లో నివాసం ఏర్పరుచుకొని వడ్డీ వ్యాపారం చేసేదన్నారు. భర్త వద్దిరంగప్ప ఒక హత్యకేసులో జీవిత ఖైదీగా శిక్షణ అనుభవిస్తున్నారన్నారు. ఉదయం ఆమె ఇంటినుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వన్‌టౌన్ సిఐ రవికుమార్‌రెడ్డి సిబ్బందితో ఇంటి తలుపులు తెరచి మృతదేహాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల వారిని విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి

రాయచోటి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న యస్‌. మస్తాన్‌వలి(40) గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అతను బుధవారం గుండె నొప్పి రావడంతో రాయచోటి ప్రైవేటు ఆసుపత్రికి చికత్స కొరకు వెళ్ళాడని బంధువులు తెలపారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కొరకు తిరుపతికి వెళ్తుండగా మార్గ మద్యంలో మృతి చెందాడని తెలిపారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు వున్నారు.