రంగా రెడ్డి

రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. ప్రచండబానుడిదాటికి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడదెబ్బతో 10మంది మృతిచెందారు. ఉదయం ఏడు గంటలనుంచే వేసవి ప్రతాపం చూపుతోంది. ఇళ్లలో విద్యుత్ వాడకం కూడా భారీగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో విద్యుత్ కోతలు కూడా మళ్లీ మొదలయ్యాయి. బుధవారం హైదరాబాద్లోనూ అనధికారికంగా 3 గంటల విద్యుత్ కోత విధించారు. రాష్టవ్య్రాప్తంగా బుధవారం ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి.
తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీలు, కోస్తోంధ్ర, రాయలసీమలో 1 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదువుతన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రెంటచింతలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యవసా య రంగానికి ప్రాణధారమైన నైరుతి రుతుపవనాలు జూన్ 1 కల్లా కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం ప్రకటించిన విషయం తెలిసిందే. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకేవరకు ఇదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు. ఈసారి సాధారణ తేదీ కన్నా కొంత ఆలస్యంగా దక్షిణ అండమాన్ సముద్రంలో రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.

పోలవరం సమస్యపై చర్చలకు
ఒడిశా సీఎంను ఆహ్వానించా
ఛత్తీస్గఢ్ సీఎంనూ సంప్రతిస్తాం
మంత్రి డీఎల్కు పనేమీ లేదు
మీడియా.. ప్రభుత్వానికి సలహాదారుగా
వ్యవహరించాలి.. విశాఖలో సీఎం కిరణ్
- ఉప ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపు.. అందుకు నరసన్నపేట నుంచే శ్రీకారం
- మాజీ సీఎం వైఎస్కు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది
- ఆయన కుటుంబానికి అనేక పదవులు కట్టబెట్టింది
- కాంగ్రెస్ మోసం చేసిందని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు
- శ్రీకాకుళం ఉప ప్రచారంలో సీఎం
- ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు మేం జ్యోస్యులం కాదు: పీసీసీ చీఫ్ బొత్స
విశాఖపట్నం/శ్రీకాకుళం, మే 6:పోలవరం, ప్రాణహిత-చే ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి కిరణ్కుమార్డ్డి చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేందుకు తాము కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తూ.. విశాఖపట్నం విమానాక్షిశయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సమస్యను పరిష్కరించుకునేందుకు పొరుగు రాష్ట్రాలతో సంప్రతింపులు జరుపుతామని సీఎం చెప్పారు. దీనిపై ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంవూతులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
పోలవరంపై చర్చలకు రావాలంటూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను ఢిల్లీలో ఎన్సీటీసీ సదస్సు సందర్భంగా ఆహ్వానించినట్లు చెప్పారు. మంత్రి డీఎల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా ఆయనకేం పనిలేదు, మీకేం పనిలేదు అని వ్యంగ్యంగా స్పందించారు. అభివృద్ధి కార్యక్షికమాల విషయంలో మీడియా ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించాలని హితవు పలికారు. అనంతరం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసన్నపేటలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు లోక్సభతోపాటు అన్ని అసెంబ్లీ స్థానాల్లో తామే గెలుస్తామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం నుంచే శ్రీకారం చుట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్డ్డికి కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. రాజశేఖర్డ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనను ఎవరు విమర్శించినా తాను, ధర్మాన ప్రసాదరావు, ఇతర మంత్రులు తిప్పికొట్టామని, ఆయనకు రక్షణ కవచంలా నిలిచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి అనేక పదవులు ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాజశేఖర్డ్డి కుమారుడు జగన్ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ బహిరంగసభలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొండ్రు మురళీమోహన్, శ్రీకాకుళం ఎంపీ కృపారాణి తదితరులు పాల్గొన్నారు.
అన్ని పార్టీల్లో కోవర్టులుంటారు: బొత్స
నరసన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్డ్డికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్తోసహా కోవర్టులు ఏ పార్టీలోనైనా ఉంటారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఉప ఎన్నికల్లో విజయమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఉప ఎన్నికల అభ్యర్థు ఎంపిక సరిగానే జరిగిందని, ఇందులో చర్చకు తావులేదని అన్నారు. నెల్లూరు లోక్సభ స్థానంతోపాటు 1 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా తాము ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పుడే ఫలితాలు చెప్పేందుకు తామేమీ జ్యోతీష్యులం కాదని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

తెలంగాణ మంత్రులకు సీమాంధ్రలో జరగనున్న ఉప ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు. మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డికి గుంటూరు జిల్లా మాచర్ల, డీకే అరుణకు కడప జిల్లా రైల్వే కోడూరు, సబిత ఇంద్రారెడ్డికి కడప జిల్లా రాయచోటి, శ్రీధర్బాబుకు తిరుపతి నియోజకవర్గాల బాధ్యతలు కట్టబెట్టారు.

ఎక్సైజ్ శాఖలో మద్యం ముడపులు అందుకున్న ఏ ఒక్కరినీ వదలకుండా అవినీతి నిరోదక శాఖ ఏరేసే కార్యక్రమాన్ని ఉధృతం చేసింది. ముడుపులు అందుకున్న మరికొందరు ఎక్సైజ్ అధికార్లను కోర్టు బోను ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే రాష్టవ్య్రాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాలపై సోమవారం ఏకకాలంలో దాడులకు దిగింది. ఏసిబి సిట్ బృందాలు అనూహ్యంగా దాడులకు దిగాయి. ఎక్సైజ్ శాఖలో ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నవారి జాబితా తయారు చేసి ఉచ్చును మరింత బిగిస్తోంది. ఎసిబి అదనపు డైరక్టర్ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోని స్పెషల్ ఇనె్వస్టిగేషన్ బృందాలు ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. ఎక్సైజ్ శాఖలో మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు అందుకున్న వారేకాకుండా, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న వారినీ తాజాగా ఎసిబి టార్గెట్ చేస్తోంది. విజయనగరం, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లో ఎసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కీలకమైన ఫైళ్లు, ఆఫీసు రికార్డులు, కంప్యూటర్ సామగ్రి, అధికారుల మొబైల్ నెంబర్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాల్లోని అధికారులను విచారించడంతోపాటు, వారి వద్దనున్న మొబైల్ నెంబర్లనుంచి గత కొన్ని రోజులుగా ఎవరెవరికి కాల్స్ వెళ్లిందీ విచారిస్తున్నారు. ఎసిబి దర్యాప్తుతో వ్యాపారాలు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిన సిండికేట్ల గురించీ సిట్ బృందాలు గాలిస్తున్నాయి. చిక్కడపల్లికి చెందిన మద్యం వ్యాపారి బాలరాజ్గౌడ్ అరెస్టు కాకుండా తప్పించుకుంటున్నాడు. ఇతను దేశం విడిచిపోకుండా ఎసిబి లుకౌట్ నోటీసు జారీ చేసింది. త్వరలోనే అరెస్టు చేస్తామని ఎసిబి వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే, విజయనగరం జిల్లాలోని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏసిబి బృందాలు తనిఖీలు నిర్వహించాయి. విజయనగరం జిల్లా కేంద్రం, పార్వతీపురం ఇఎస్ ఆఫీసుతోబాటు బొబ్బిలి సబ్ డివిజన్లో సైతం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్పీ వెంకటేశ్వర రావు నేతృత్వంలో సిబ్బంది ఇఎస్ కార్యాలయానికి చేరుకుని 2010-12 మద్యం దుకాణాల టెండర్ రికార్డులు పరిశీలించారు.
పట్టు బిగిస్తున్న ఎసిబి
ఖమ్మం జిల్లాలో 2010 మద్యం టెండర్లలో 16 దుకాణాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని నిర్థారించిన ఎసిబి, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఎసిబి ఆధారాలు సేకరించే పనిలో పడింది. రెండురోజులుగ దాడులు కొనసాగిస్తున్న ఎసిబి, సోమవారం టెండర్లకు సంబంధించిన అన్ని ఫైళ్లనూ ఎసిబి డిఎస్పీ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో డిఆర్వో క్యాంప్ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్నారు. టెండర్ల సమయంలో జిల్లాలో పనిచేసిన జెసి అజీంతో పాటు పలువురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా విచారణ సాగుతోంది.
గుంటూరులోని ఎక్సైజ్ డిసి ఆఫీసులో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. సిండికేట్లు అందించిన వివరాలతో ఎక్సైజ్ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎసిబి జెడి రమేష్రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు సాగాయి. 2010లో జరిగిన మద్యం టెండర్లలో అవకతవకలు జరిగాయని, సిండికేట్లకు షాపులు కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన వెల్లడైనట్టు సమాచారం. రికార్డులను స్వాధీనం చేసుకున్న ఎసిబి, చర్యలకు సిద్ధమవుతోంది. దాడుల సందర్భంలో డిసి కార్యాలయంలో ముఖ్య అధికార్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అలాగే తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ కార్యాలయాల్లోనూ సోమవారం ఎసిబి బృందాలు దాడులు నిర్వహించి రికార్డులు తనిఖీలు చేశాయి. ఎసిబి డిఎస్పీ శివాజీ, విజయవాడ రేంజ్ ఎసిబి సిఐ టిఎస్కె రవి నేతృత్వంలో రికార్డులను పరిశీలించి, టెండర్ల విషయంలో అధికార్లు అక్రమాలకు పాల్పడ్డారా? అన్న అంశాలను పరిశీలించారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇఎస్ కార్యాలయాలపై సోమవారం ఎసిబి బృందాలు దాడులు జరిపాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన సిట్ బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. 2010లో మద్యం దుకాణాల వేలం ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. దాడుల్లో ఎసిబి సిట్ డిఎస్పీలు విజయపాల్, లక్ష్మీపతి ఆధ్వర్యంలో ఇనస్పెక్టర్లు బి రామకృష్ణ, ఎస్ మురళీమోహన్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికార్లు సోమవారం రికార్డులు పరిశీలించారు. ఏలూరులో హైదరాబాద్ ఎసిబి డిఎస్పి నరసింహారావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా, మధ్యాహ్నం నుంచి భీమవరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విజయవాడ నుండి వచ్చిన బృందం ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. దాడుల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకుని, కార్యాలయాల్లోని కంప్యూటర్లలో నిక్షిప్తమైన సమాచారాన్ని సైతం ఎసిబి అధికార్లు సేకరించారు.
నెల్లూరు జిల్లాలోని నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు సాగాయి. మద్యం దుకాణాల లైసెన్సులు పరిశీలించి, 2010 నుంచి టెండర్లకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో సైతం ఎక్సైజ్ కార్యాలయాలపై ఎసిబి దాడులు జరిపింది. 2010 వేలం పాటల రికార్డులు, టెండర్లలో పాల్గొన్న వారి వివరాలు, ఆస్తిపాస్తుల సమాచారం, మద్యం దుకాణాలను వేలంలో దక్కించుకున్న వారి వివరాలు సేకరించారు. అలాగే, మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ పట్టణాలలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో ఎసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించి సోదాలు చేశారు. మద్యం దుకాణాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డిజిల్లా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని గుండ్లపోచంపల్లిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో గుడిసెలకు నిప్పంటుకుని ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఇందులో నలుగురు చిన్నారులు, ముగ్గురు వృద్ధులు ఉన్నారు. ఈ హృదయ విధారక సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. సంఘటన జరిగిన క్షణాల్లో అంతా బూడిదగా మారింది. గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలడంతో నిప్పు గుడిసెలకు అంటుకుని కొద్దిసేపట్లోనే బూడిదగా మారింది. బీహార్, ఒరిస్సా రాష్ట్రాలతోపాటు వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన 101 కుటుంబాలకు చెందిన 300 మంది గుడిసెలు వేసుకుని ఆ ప్రాంతంలో జీవనం కొనసాగిస్తున్నారు. ఇందులో మహిళలు, పురుషులు భవన నిర్మాణంలో కూలీలుగా పని చేస్తున్నారు. ఎప్పటి మాదిరిగానే శనివారం ఉదయం అంతా పనులకు వెళ్లగా పిల్లలు, వృద్ధులు గుడిసెల్లో ఉన్నారు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు రేగాయి. అక్కడ ఉన్న పిల్లలు, వృద్ధులు తేరుకునేలోపే గుడిసెలన్నీ బూడిదగా మారాయి. ప్రమాదంలో తాయప్ప, బల్బీర్, ఖాజా, త్రివేణి, రజింత్, విశాల్, ఆచల్లు సజీవ దహనమయ్యారు. మంటలు ఆర్పేందుకు జీడిమెట్ల నుండి ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. సంఘటనస్థలికి సైబరాబాద్ కమిషనర్ ద్వారకతిరుమలరావు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మృతి చెందిన వారికి మేడ్చల్లో పోస్టుమార్టం నిర్వహించారు.
సహాయక చర్యలకు ఆదేశించిన సిఎం
గుండ్లపోచంపల్లిలో గుడిసెలకు నిప్పంటుకుని ఏడుగురు సజీవ దహనమైన సంఘటనపై ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శేషాద్రిని ఆదేశించారు. కలెక్టర్ సెలవులో ఉండటంతో జాయింట్ కలెక్టర్ జగన్నాథం సంఘటన స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. బాధితులకు తక్షణ సహాయంగా రూ. 5వేలు అందజేశారు. మృతులకు రూ. 50వేల ఎక్స్గ్రేషియ చెల్లించనున్నారు. పలు స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో దుప్పట్లు, చీరలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. సందర్శించిన మంత్రులు సబిత,
ప్రసాద్కుమార్
గుండ్లపోచంపల్లి వద్ద ఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలికి హోం మంత్రి సబితారెడ్డి, చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్కుమార్, మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిలు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. సంఘటనకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుండి రావల్సిన సహాయం అందిస్తామని, గుడిసెలు వేయించి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు హామి ఇచ్చారు.

డీఎస్స-12 నోటిఫికేషన్ విడుదల
మే 2,3,4 తేదీల్లో రాత పరీక్షలు
అప్రెంటీస్ విధానం రద్దు
‘ఇంటర్’ నిబంధన తొలగింపు
‘ఓపెన్ డిగ్రీ’ వారికీ అర్హత
ఎస్ఏ పోస్టులకు సబ్జెక్టు నిబంధనల సడలింపు
80 మార్కులకే డీఎస్సీ
20 మార్కులకు టెట్ వెయిటేజి
మరో 7100 పోస్టులకు రెండు రోజుల్లో నోటిఫికేషన్
హైదరాబాద్, జనవరి 30 : లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. కొద్ది రో జులుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న ‘డీఎస్సీ -2012 నోటిఫికేషన్’ సో మవారం విడుదలైంది. మొత్తం 21,343 ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇందులో నోటిఫై చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులు దశాబ్దకాలంగా చేస్తోన్న ‘అప్రెంటిస్’ రద్దు డిమాండ్ కూడా నెరవేరుతోంది. వివాదాస్పదంగా మారిన ‘ఇంటర్లో సంబంధిత సబ్జెక్టులు తప్పనిసరి’ అనే నిబంధనను తొలగించారు.
నోటిఫై చేసిన మొత్తం పోస్టుల్లో.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 5,703, ఎస్జీటీ పోస్టులు 11, 602 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లు 2000, పీఈటీలు 365, మునిసిపల్ పాఠశాలల్లో 1,673 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 17వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం 3 గంటలకు మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి ఈ డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేశారు. డీఎస్సీకి విద్యార్హతల నిబంధనల్లో కొన్నింటిని సడలించారు.
స్కూల్ అసిస్టెంట్స్ (మేథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ స్థాయిలో కూడా మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జాగ్రఫీ సబ్జెక్టులు చదివి ఉండాలన్న నిబంధనలను తొలగించారు. అంటే.. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ చదివి ఉండాలన్న నిబంధన లేదు.
ఫలితంగా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేరుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అర్హత లభిస్తుంది. స్కూల్ అసిస్టెంట్స్ (జీవశాస్త్రం) పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జీ.వో.నెం.4లో పేర్కొన్న సబ్జెక్టులతో పాటు సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ సబ్జెక్టుల అభ్యర్థులకు కూడా అర్హత కల్పించారు. టీచర్లకు అప్రెంటిస్ విధానాన్ని ఈ డీఎస్సీ నుంచి రద్దు చేశారు. అభ్యర్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు నమూనా, యూజర్ గైడ్ కోసం జ్ట్టిఞ://్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీn వెబ్సైట్ను చూసుకోవాలి.
డీఎస్సీ 80 మార్కులకే..
టెట్కు వెయిటేజీ ఇవ్వనున్న కారణంగా 80 మార్కులకే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు టెట్ మార్కులను వెయిటేజీగా జమ చేస్తారు. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు 160 డీఎస్సీ పరీక్ష ఉంటుంది. ఎస్జీటీ పరీక్షలో జనరల్ నాలెడ్జ్కు 10 మార్కులు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, ఇంగ్లీష్ 9, ఇండియన్ లాంగ్వేజ్ 9, మాథ్స్ 9, సైన్స్ 9, సోషల్ స్టడీస్ 9, టీచింగ్ మెథడ్ 15 మార్కులు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ల్లో.. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 10, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10, సబ్జెక్ట్ కంటెం ట్ 44, టీచింగ్ మెథడాలజీ 16 మార్కులు ఉంటాయి. పీ ఈటీలకు టెట్ ఉండకపోవ డం వల్ల పూర్తిగా 100 మా ర్కులకు పరీక్ష ఉంటుంది.

రాష్ట్రంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాతే ఓట్ల కోసం వస్తామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రానున్న మూడు సంవత్సరాల్లో అర్హులైన వారందరికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పరిశ్రమలు, ఆసుపత్రి, సేవా రంగాల్లో నిరుద్యోగ యువత ఉద్యోగవకాశాలను అందిపుచ్చుకునే విధంగా అవసరమైన వృత్తి నైపుణ్య శిక్షణ నిచ్చేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సూరాబాద్లో మంగళవారం స్థానిక శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్రెడ్డి అధ్యక్షతన జరిగిన 2వ విడత రచ్చబండకు సిఎం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రూప్ 2 ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ తర్వాత భర్తీ చేసేందుకు జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఇంటర్వ్యూలు రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాత పరీక్షతో మౌఖిక పరీక్షకు ఎంపికైన అభ్యర్థులందరికీ ఎపిపిఎస్సికి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు రెండు నుంచి మూడు సంవత్సరాల కాలం పడుతుందని, దీన్ని నివారించి వెంటనే నియామకాలు జరిపేందుకు వీలుగా ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, సిఫార్సులకు తావు లేకుండా భర్తీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ఇక ఆధార్ (గుర్తింపు సంఖ్య)తోనే అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆధార్తో రాష్ట్రంలో ఏ జిల్లాకు చెందిన వారైన మరే జిల్లాలోనైనా తమ రేషన్ కార్డును ఉపయోగించుకునే వీలుందన్నారు. అయితే ఒకటికి మించి రెండు రేషన్ కార్డులున్న వారు ఒక కార్డును కోల్పోక
తప్పదన్నారు. మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకుగాను పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలకు 1000 కోట్ల రూపాయలతో స్త్రీ నిధి కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 125 పట్టణ కేంద్రాల్లో రూ.25 లక్షల వ్యయంతో ఒక్కో మహిళా సమాఖ్య భవనాన్ని నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్న స్త్రీ నిధి పథకంతో పాటు మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, దీనిని పట్టణ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మూడు వేల కోట్లతో పాఠశాలకు పక్కా భవనాలు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. డిసెంబర్లో ప్రధానమంత్రి చేతుల మీదుగా లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందజేసేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నామన్నారు.
ప్రజలకు త్వరితగతిన మెరుగైన సేవలందించేందుకు అదే విధంగా వివిధ సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పాటించేందుకుగాను వీలుగా భూమికి సంబంధించిన పట్టా సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్, కుల, ఆదాయ, నివాస, జనన, మరణ తదితర ధ్రువీకరణ పత్రాలను మీ-సేవ కేంద్రాల ద్వారా ఇచ్చేందుకు ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పటికే ఈ కేంద్రాలను పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన కృష్ణా, చిత్తూరు, ఖమ్మం జిల్లాల్లో ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
మీ సేవ ద్వారా దళారీలు, లంచాల బారినుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. రెండు విడతల రచ్చబండ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో 8 లక్షల పెన్షన్లు, 30 లక్షల రేషన్ కార్డులు, 28 వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్ద పీట వేస్తూ అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంటూ గత సంవత్సరం 27 లక్షల మంది విద్యార్థులకు రూ.3,500 కోట్ల స్కాలర్షిప్పులను అందించడం జరిగిందని, ఈ సంవత్సరం స్కాలర్షిప్పుల నిమిత్తం 5 వేల కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు సిఎం వెల్ల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు వీలుగా డిసెంబర్లోపు 1.16 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి ఇంటర్వ్యూలు లేకుండా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
పట్టణ ప్రాంతాల అభివృద్ధిపై రాజీవ్ ఆవాస్ యోజన కింద రూ.9 వేల కోట్ల వ్యయంతో 1500 మురికివాడలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని, ఇందులో పైలట్ ప్రాజెక్టు కింద 5 కాలనీలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, అర్హులైన నిరుపేదలందరికి తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తామని పేర్కొంటూ, రచ్చబండ సందర్భంగా తీసుకున్న దరఖాస్తులన్నింటిని పరిశీలించి రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, మంత్రి కాసు కృష్ణారెడ్డి, ఎంపీ సర్వే సత్యనారాయణ, శాసనసభ్యుడు డి.సుధీర్రెడ్డి ప్రసంగించారు. అనంతరం ముఖ్యమంత్రి లబ్ధిదారులకు రేషన్కార్డులు, పెన్షన్లు, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలను, పావలా వడ్డీ రుణాలను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రంగారెడ్డి, శాసనసభ్యులు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, ఆకుల రాజేందర్, ప్రసాద్ కుమార్, బి.రాజిరెడ్డి, భిక్షపతి యాదవ్, శ్రీశైలం గౌడ్, జిహెచ్ఎంసి కమిషనర్ కృష్ణబాబు, జల మండలి ఎండి అదర్ సిన్హా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి పాల్గొన్నారు.

కాయలున్న చెట్టుకే రాళ్లు పడతాయి…..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థమంతంగా నిర్వర్తిస్తున్నందుకే ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని… ఎవరు విమర్శలు చేసినా తాము పట్టించుకోమని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలంలోని చీర్యాలలో గురువారం రచ్చబండ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హాజరయ్యారు. సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అధ్యక్షతన వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో రాజీలేకుండా తమ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గతంలో కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షల రేషన్కార్డులు ఇచ్చా మని ఆయన తెలిపారు. 8 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 52 లక్షల గృహాలు పూర్తి చేశామని 15 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. కొత్తగా 12.30 లక్షల ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళలకు పావలా వడ్డీ
స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇక పావలా వడ్డీయేనని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లా సమాఖ్యల నుంచి మండల సమాఖ్యలకు అక్కడి నుంచి గ్రామ సమఖ్యల ద్వారా పావలా వడ్డీ రుణాలు పంపిణీ చేసే వారని ఇక ముందు స్వయం సహాయక సంఘాల మహిళలకు పంపిణీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. జిల్లా సమాఖ్యల ద్వారా వచ్చేందుకు నెల రోజుల సమయం పడుతోందని ఇక ముందు నేరుగా ఆన్లైన్ ద్వారా పావలా వడ్డీ రుణాలు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని కిరణ్కుమార్ వెల్లడించారు. ఆరేళ్ల కాలంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.830 కోట్లు పావలా వడ్డీ కింద పంపిణీ చేశామన్నారు. 7 శాతం వడ్డీకే మహిళలకు రుణాలు పంపిణీ చేయాలని ఇటీవల ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ను కోరినట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్లో దీనికి శ్రీకారం చుట్టనున్నారని, దీంతో మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన
పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు సంవత్సర కాలంలో రుణాలు తిరిగి చెల్లిస్తే వడ్డీ ఉండదని తెలిపారు. రాష్ట్రంలో 95 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు వెల్లడించారు. వీరందరికీ గాను రూ.12వేల కోట్లు అవుతుందన్నారు.
ముక్కిపోయిన బియ్యం ఎలా తినాలి
రూపాయికే కిలో బియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు…ఆ బియ్యాన్ని మీరు తినగలరా….ముక్కిపోయిన బియ్యం ఎలా తినగలమని స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రచ్చబండ కార్యక్రమం ప్రారంభమైన కొద్ది సేపటికే మహిళలు లేచి నిరసన వ్యక్తం చేశారు. జవహార్నగర్లో పట్టాల పంపిణీ చేయాలని, డంపింగ్ యార్డ్ను వెంటనే మార్పు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు లేచి నిరసన తెలుపుతున్న విషయం చూసిన ముఖ్యమంత్రి కలెక్టర్ శేషాద్రిని పిలిచి వారితో మాట్లాడాలని సూచించారు. కలెక్టర్ సూచన మేరకు డిఆర్డిఎ పిడి వరప్రసాద్రెడ్డి వెళ్లి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా మహిళలు ఒప్పుకోలేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్కుమార్ను పురమాయించారు. లక్ష్మారెడ్డి వెళ్లి నచ్చజెప్పగా మహిళలు శాంతించారు. హోం మంత్రి సబితారెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎంపీ సర్వే సత్యనారాయణ, మేయర్ బండ కార్తీకారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

అవినీతి సంపాదనతో కోట్లకు పడుగెత్తిన ఓ పోలీస్ అధికారి ఇంటిపై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. రంగారెడ్డిజిల్లా ఆఫీసర్ ఆన్స్పెషల్డ్యూటీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సర్వేశ్వర్రెడ్డి గచ్చిబౌలిలోని వెంకటాద్రిఆపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్ 401లో ఉండే నివాసంపై గురువారం తెల్లవారు జామునుంచే ఎసిబి జాయింట్డైరెక్టర్ సంపత్కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆదాయానికి మించి కూడబెట్టిన పలు విలువైన పత్రాలు అధికారులకు లభ్యమయ్యాయి.
దీంతో వాటిని అధికారులు సీజ్చేసి సర్వేశ్వర్రెడ్డిని అరెస్టుచేసి ఒకటవ అదనపు ప్రత్యేక జడ్జిముందు హాజరుపర్చారు. ఈ దాడుల్లో దాదాపు 5కోట్ల 79లక్షల 90వేల విలువజేస్తే ఆస్తులు ఉన్నట్లు (మార్కెట్ విలువ ప్రకారం రూ.25 కోట్లు) సంపత్కుమార్ తెలిపారు. ఏకకాలంలో సర్వేశ్వర్రెడ్డి ఇంటితో పాటు తన బంధువుల ఇళ్లపై సోదాలు చేయడం జరిగిందని, తన సొంత ఊరు మహబూబ్నగర్ జిల్లా చిల్కటోని పల్లిలో నివాసంఉండే ఇంటికి తాళం వేసి ఉందని, ఆఇంటిని తీసి సోదాలు నిర్వహిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు.

సకల జనుల సమ్మెలో అన్ని వర్గాలు కదిలివస్తుంటే ఏ మాత్రం చలనం లేకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీసి ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలేలా కృషి చేయాలని రాజకీయ జెఎసి ఛైర్మన్ ప్రొపెసర్ ఎం. కోదండరామ్ పిలుపునిచ్చారు. సకల జనుల సమ్మెలో భాగంగా గురువారం ఖమ్మంలో జరిగిన పోరు గర్జన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో పది రోజులుగా జరుగుతున్న సకలజనుల సమ్మెలో తెలంగాణ సమాజం మొత్తం కదిలివచ్చి భాగస్వాములవుతుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కన్పించకుండా పోయారని మంత్రులు ఏమీ ఆశించి మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారో తెలియడం లేదని.. ఎక్కడా దాక్కున్నారో వేతకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపిలు నోరు తెరిస్తే ఢిల్లీ కదిలిరాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు కదిలివస్తే నిజాం విద్యార్థులపై దాడులు జరిగేవా? స్వామిగౌడ్ను అరెస్ట్ చేసేవారా? ఆర్టీసి బస్సులను తిప్పేవారా? అంటూ కోదండరామ్ ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ప్రేక్షకపాత్రను సవాల్గా తీసుకొని ఎక్కడపడితే అక్కడ వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో సమ్మె జరగడం లేదని ఢిల్లీలో భజన చేసే రేణుకచౌదరి, అభిషేక్ సింఘ్వీలు కళ్లు ఉండి చూడదల్చుకుంటే చెవులు ఉండి వినదల్చుకుంటే తెలంగాణలో అడుగుపెట్టి చూడాలన్నారు.
శాంతియుతంగా సహనంతో సమ్మె చేస్తున్నామని ‘తెలంగాణ ప్రజల సహనాన్ని, ఓర్పును వారు తప్పుగా అర్థం చేసుకోవద్దని హితవు పలికారు. సమ్మెపై సీఎం కిరణ్ మాట్లాడిన తీరు పిల్లచేష్టల్లా ఉన్నాయన్నారు. సీఎం సమ్మె సెగ తాకకుండా బుల్లెట్ ప్రూప్ తగిలించుకున్నాడో లేదా ఏదైనా లేహ్యం, పౌడర్ రాసుకున్నాడో తెలియడం లేద న్నారు. ఆయనకు ఏ పేరు పెట్టాలో డిక్షనరీలో అర్ధాలు వెతకాల్సి వస్తుందన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే రైల్రోకో ద్వారా సమ్మె సెగ ఢిల్లీకి తాకాలని కోదాండరామ్ పిలుపునిచ్చారు. 48 గంటలపాటు తెలంగాణలో రైలు పట్టాలు కన్పించ కుండా మానవహారాలే కన్పించాలన్నారు. విద్యార్థులు అవేశానికి పోయి టవర్లు ఎక్క వద్దని, ఆత్మబలిదానాలకు పాల్పడవద్దని కోరారు.
వడ్డీతో సహా మూల్యం చెల్లిస్తాం : ఈటెల
తెలంగాణ కోసం జరుగుతున్న పోరాటాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తే వడ్డితో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని టిఆర్ఎస్ శాసనసభపక్ష నాయకులు ఈటెల రాజేందర్ అన్నారు. ఉద్యమాన్ని అణచివేయడానిి చూస్తే తెలంగాణ వచ్చిన తరువాత వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే సంసృ్కతి ఆంధ్రా వాళ్ళదని రేణుకచౌదరి మరోసారి నిరూపించిందన్నారు.
గర్జించిన ఖమ్మం
పోరుగర్జన పేరుతో నిర్వహించిన సభ విజయవంతం అయ్యింది.ఈ సభకు ముఖ్యఅతిథిగా రావాల్సిన టిఆర్ఎస్ అధినేత .ెచంద్రశేఖర్రావు అస్వస్థతకు గురికావడంతో హాజర ్కాలేకపోయారు.దీంతో నిర్వాహకులు నిరుత్సాహనాకి గురైనప్పటికి ప్రజలు మాత్రం భారీగా తరలివచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మేము సైతం అంటూ ఏజెన్సీ నుంచి ఆదివాసులు , కొయ్యలు భారీ ఎత్తున్న తరలి వచ్చారు.