హైదరాబాద్

కాపలా లేని క్రాసింగ్లు17వేలపైనే
85 శాతం మానవ తప్పిదాలు
నిధుల కొరతే శాపం
ఏలినవారి మాటల గారడీ
ప్రాణాలకు లేని హామీ
దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో మరో నెత్తుటి మరక. భద్రతపై కేంద్ర సర్కారు భరోసా ఇచ్చి వంద రోజులు కాకముందే మరో దుర్ఘటన. హంపీ ఎక్స్ప్రెస్ దుర్ఘటనకు మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని తేలింది. రైల్వే సిగ్నలింగ్ వైఫల్యం మరోసారి వెక్కిరించింది. ఏలిన వారి మాటల గారడీ పక్కన బెట్టి… ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన గుర్తు చేస్తోంది. తాతల నాటి రైల్వే ట్రాక్ రికార్డు మారుస్తామని ప్రతి మంత్రి చెబుతున్నారు. ఆచరణను బట్టి చూస్తే మాటలు ఒకింత కోతలుగానే అనిపిస్తున్నాయి. వాస్తవానికి రైల్వే భద్రత అంశంపై ఎన్నో ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.
140 సంవత్సరాల పైబడిన ఘన చరిత్ర తనదని భుజకీర్తులు తగిలించుకున్న భారతీయ రైల్వే ప్రస్థానంలో భద్రతకే భరసా లేదు. నలభై దేశాల జన సంఖ్యతో సరితూగే ప్రయాణికులను ప్రతిరోజూ గమ్యస్థానాలకు చేరుస్తున్నామని సగర్వంగా చాటుకునే భూరి వ్యవస్థలో, అత్యంత కీలకమైన భద్రతే.. అక్షరాల దేవతావస్త్రం. 63వేల కిలోమీటర్ల విస్తృతి, 44 వేల బోగీలు, 7,700 లోకోమోటివ్లు, 2.16 లక్షల వ్యాగన్లు, 15 లక్షలకు పైబడిన సిబ్బంది.. వీటన్నింటికీ మించి ఏకీకృత యాజమాన్యం సారథ్యంలో నడిచే వ్యవస్థ ప్రపంచంలోనే మరెక్కడా లేదనేది అక్షర సత్యం.
పెరుగుతున్న మృతులు
ప్రమాదాల సంఖ్య ఒకింత తగ్గిందన్న ఆనందమే కానీ… ప్రమాద మృతుల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే ఇది జగమెరిగిన సత్యం. 2001-10 మధ్య మొత్తం 2,431 ప్రమాదాలు జరిగాయి. అందులో రైళ్ళు ఢీకొన్న దుర్ఘటనలు 120, పట్టాలు తప్పినవి 1,410. ప్రమాదాలు జరిగినప్పడు దాని తీవ్రత ఎంత అనేది లెక్కగట్టడం కష్టంగానే ఉంటోంది. ప్రమాదాల్లో అత్యధికంగా రైల్వే ఉద్యోగులూ ప్రాణాలు కోల్పోతున్నారు.
2007-08 నుంచి 2011 వరకూ 1,624 మది ఉద్యోగులు చనిపోయారు. ఇదే సమయంలో విగతజీవులైన సాధారణ ప్రజల సంఖ్య 1,019. క్షతగాత్రులు 1,716. ఈ విషయాన్ని రైల్వే భద్రతపై ఏర్పాటు చేసిన కకోద్కర్ కమిటీ వెల్లడించింది. ట్రాక్ ఇంజనీరింగ్ పనుల్లో నిమగ్నమైన ఇంజనీరింగ్ ఉద్యోగుల్లో 1100 మంది రైళ్ళ కింద పడి నలిగిపోయారు. మెకానికల్ పనుల విభాగంలో ఈ సంఖ్య 110గా నమోదైంది.
పట్టాల నిర్వహణ, నిర్మాణాలను పూర్తిగా యాంత్రీకరిస్తే తప్ప ఈ ప్రమాదాలను అరికట్టలేమని కకోద్కర్ కమిటీ వెల్లడించింది. వాస్తవానికి రైలు ప్రమాదాల సంఖ్య తగ్గుతోంది. కానీ మరణాలే పెరుగుతున్నాయి. 2006-07లో 195 ప్రమాదాలు జరిగితే…208 మంది మృతి చెందారు.
కానీ గత ఏడాది ప్రమాదాల సంఖ్య 141కి తగ్గినా… మృతులు మాత్రం 381కి పెరిగారు.
నివేదికలకే పరిమితం
ప్రమాదం జరిగినప్పుడే సర్కారులో చలనం వస్తుంది. మొక్కుబడిగా ఓ కమిటీ వేయడం… తీవ్రత తగ్గాక వచ్చే ఆ నివేదికల మొఖం చూడకుండా పక్కన పడేయడం షరా మామూలుగా జరుగుతున్న తంతే. ఏ ప్రమాదం విశ్లేషించినా అందుకు దారితీసిన క్రమానుగత
విధి వైఫల్యాలు కళ్ళకు కడతాయి. సంస్థాగత లొసుగులు లోపాల్ని సరిదిద్దుకోవాలని ఎత్తి చూపుతున్నాయి.
న 1998లో జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా సారథ్యంలోని నియుక్తలైన రైల్వే భద్రతా సమీక్షా సంఘం ఇదే విషయాన్ని వెల్లడిచింది.
రెండు విభాగాలుగా 278 సూచనలు చేసింది. వీటిలో 240 సిఫార్సుల్ని పూర్తిగానో పాక్షికంగానో ఆమోదించామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వివిధ కారణాల రీత్యా 38 సూచనల్ని త్రోసిపుచ్చింది. కాలం చెల్లిన ట్రాక్లు, వంతెనలు సిగ్నల్ వ్యవస్థ వంటి వాటిని ఆరేళ్ళ కాల వ్యవధిలో పూర్తిగా మార్చి వేయడానికి రూ. 17,000 కోట్ల భద్రతానిధి ఏర్పాటు చేసి, కేంద్రం ఆ మొత్తాన్ని గ్రాంటుగా ఇవ్వాలని ఖన్నా కమిటి సూచించింది. ఈ నివేదికను వాజ్పాయ్ సర్కారు పరిశీలించేనాటికి అంచనా వ్యయం 20 వేల కోట్లు దాటింది. అందులో రూ. 5వేల కోట్లను భద్రత రుసుముగా ప్రయాణీకుల నుంచే కేంద్రం వసూలు చేస్తోంది.
న ఏమైనా విపత్తులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కొవాలన్న దానిపై 2002లో మరో ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తే అది 111 సూచనలు చేసింది. వాటిలో మెజారిటీ అమలుకు నోచుకోలేదు. భారత రైల్వే భద్రతంగా ఉండాలంటే లక్షకోట్ల రూపాయలు అవసరమని కకోద్కర్ కమిటి సూచించింది.
న ఘనీఖాన్ చౌదరి నుంచి మమతా బెనర్జీ వరకూ రైల్వే మంత్రులంతా భద్రతపై మొసలి కన్నీరు కార్చడం మినహా ఏ ఒక్క కమిటి నివేదికను యథాతథంగా అమలు చేసిన దాఖలాలు లేవు. మరమ్మత్తులు చేసే సమయమైనా లేకుండా అధిక సంఖ్యలో రైళ్ళు నడుపుతున్నారు. ఫలితంగా గత మూడేళ్ళలో 1100 మంది సిబ్బంది మరణించారు.
క్రాసింగులే మాయ ద్వారాలు
రైల్వే ప్రమాదాలకు అగ్రభాగం లెవల్ క్రాసింగ్లే కారణమని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 35,363 గేట్లు ఉంటే… ఇందులో 17,954 క్రాసింగుల వద్ద కాపలా కూడా లేదు. రాష్ట్రంలో కాపలా లెెని గేట్లు 935 వరకూ ఉన్నాయి. ప్రమాదాల్లో 59 శాతం కాపలా లేని లెవల్ క్రాసింగులను దాటుతుండగానే జరుగుతున్నాయి. మొత్తం ప్రమాద ఘటనల్లో 85 శాతం మానవ తప్పిదాలు. ఏడు శాతం విద్రోహ చర్యలు. 3 శాతం పరికరాల వైఫల్యం లేదా ఆకస్మిక కారణాలుగా ఉంటున్నాయి. ఓక్క శాతం ప్రమాదాలకు కారణాలు తెలియడం లేదు. విద్రోహ చర్యల వాటా నానాటికీ పెరుగుతోంది. 2006-07లో ఇది 4.1 శాతం ఉంటే… 2010-11 నాటికి 11.36 శాతంకు చేరింది. దేశవ్యాప్తంగా దాదాపు 15వేల లెవల్ క్రాసింగులు సరైన కాపలా లేకపోవడం వల్ల మృత్యు ద్వారాలుగా మారతున్నాయి. రైళ్ళు పట్టాలు తప్పడం, ఢీకొనడం, వంతెన మీద నుంచి పడిపోవడం వంటి ప్రమాదాలు భయావహ ప్రమాద చరిత్రనే లిఖించాయి. కమిటీలు వేసి నివేదికలు రాబట్టడమేగానీ చిత్తశుద్ధితో దీటైన కార్యాచరణకు ఉపక్రమించిన దాఖలాలు లేవు.
దక్షిణ మధ్య రైల్వే పరిస్థితి ఇదీ
దక్షిణ మధ్య రైల్వేకు దేశంలోనే ప్రధానమైన గుర్తింపు ఉంది. ఇక్కడే ఆదాయం ఎక్కువ. అయినా సౌకర్యాల వైపు రైల్వేశాఖ కన్ను పడటం లేదు. తీవ్ర నిర్లక్ష్యంగా కారణంగా భద్రత పెనుశాపంగా మారుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 7500 కిలో మీటర్ల పొడవున రైలు మార్గం ఉంది. ఈ మార్గంలోదాదాపు 3500 రైల్వే లెవల్ క్రాసింగ్లున్నాయి. ఈ క్రాసింగ్ల వద్ద రైలు పట్టాలు దాటి వేరే ప్రాంతాలకు వెళ్ళడం నిత్యకృత్యం. కాబట్టి అక్కడ రైల్వే గుట్లు పెట్టి ఒక కాపలా మనిషి నియమించదాలనదే సర్వసాధారణ విషయం.
రైలు వచ్చిన ప్రతిసారి గెెటు తీసే ఏర్పాటు లెెకపోవడం వల్ల ఏటా ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో మొత్తం 1234 కాపలా గేట్లు ఉన్నాయి. ఇంకా 1177 క్రాసింగ్ల వద్ద ఎటువంటి కాపలా లేదు. ఈ క్రాసింగుల వద్ద ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో తరచూ ప్రమా దాలు సంభవిస్తున్నాయి. ఐదేళ్ళలో ఈ రైల్వే క్రాసింగ్ల వద్ద కాపలా గేట్లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదించినా వాటికి నిధులు మంజూరు కాలేదు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో రూ. 12 కోట్లను వ్యయం చేసి కేవలం 9 గేట్లను మాత్రమే ఏర్పాటు చెెశారు.
2010-11 ఆర్థిక సంవత్సరంలో 12.40 కోట్లతో 68 గేట్లను ఏర్పాటు చేయడంతో పాటు కొన్ని రైల్వే బ్రిడ్జిలను కూడా కట్టాలని ప్రతిపాదించారు.
మరో 56 రైల్వే క్రాసింగ్ల వద్ద పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని అధికారులే గుర్తించారు. దీనికి రూ. 11.25 కోట్లు వ్యయం అవుతుం దని అంచనా వేశారు తప్ప, నిధులు ఇవ్వలేదు. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం నిధులు మంజూరు చేయాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కొరవడటం వల్ల నిధుల మంజూరు సాధ్యం కావడం లేదు.

తనను అరెస్ట్ చేసేందుకు గవర్నర్, ముఖ్యమం త్రి, మరికొంతమంది నాయకులు, తాను ఎఐసిసి నాయకుడు వాయలార్ రవిని కలిసారంటూ వైయస్ జగన్ చేసిన ఆరోపణలను డిజిపి దినేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా తాను వాయలార్ రవిని అసలు కలుసుకోలేదని ఆయన వివరించారు. జగన్ చేసిన ఆరోప ణలన్నీ పూర్తిగా సత్యదూరం అని ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రక టనలో స్పష్టం చేశారు. ఇలాంటి అసత్యప్రకటనలు, ఆరోపణలు చేయవద్దని ఆయన సూచించారు.

ఇప్పటివరకు రూ.20.63 కోట్లు స్వాధీనం
- వెల్లడించిన ఎన్నికల ప్రధానాధికారి భన్వర్
- మంగళవారం 27 నామినేషన్లు దాఖలు
- కాంగ్రెస్ 5, టీడీపీ 5, సీపీఐ 2, బీజేపీ 1
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒకే చెక్పోస్టు వద్ద మంగళవారం ఒక్కరోజే రూ.2.35 కోట్ల నగదును పట్టుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ చెప్పారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఒకేరోజు ఇంత పెద్ద మొత్తం డబ్బు లభ్యంకావడం ఇదే తొలిసారని ఆయన మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో మీడియాకు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కాళ్ల మండలంలో ఏలూరుపాడు చెక్పోస్టు వద్ద ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.2.35 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నామని, సూరి కిరణ్ అనే వ్యక్తి వద్ద రూ.15 లక్షలు, నీలేమా నుంచి రూ.40 లక్షలు, కిషోర్బాబు అనే వ్యక్తి నుంచి రూ.1.80 కోట్లు పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ఈ డబ్బుకు సంబంధించి వారివద్ద సరైన ఆధారాలు లేవని, మొత్తం డబ్బును సీజ్ చేశామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఇప్పటివరకు రూ.20.63 కోట్లు నగదు స్వాధీనం చేసుకోవడంతోపాటు 2715 మందిని అరెస్టు చేసినట్లు భన్వర్లాల్ వివరించారు. ఇవి కాకుండా ఎక్సైజ్ కేసులు మరో 8592 ఉన్నాయన్నారు. ఎన్నికల ప్రచారం కోసం రాజకీయ పార్టీలు చేసే ఖర్చుకు పరిమితి అంటూ ఏమీలేదని, అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులకు రూ.16 లక్షలు, పార్లమెంట్ స్థానానికి పోటీచేసే అభ్యర్థులకు రూ.40 లక్షల పరిమితి ఉందన్నారు. ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటినుంచి ఇప్పటివరకు అనంతపురం జిల్లాలో అత్యధికంగా రూ.4.09 కోట్లు పట్టుకున్నామని వివరించారు.
ఒక్కరోజులో 27 నామినేషన్లు
ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, మంగళవారం ఒక్కరోజే 27 నామినేషన్లు దాఖలైనట్లు భన్వర్లాల్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అయిదు, టీడీపీ నుంచి అయిదు, సీపీఐ నుంచి రెండు, బీజేపీ నుంచి ఒక నామినేషన్ దాఖలు కాగా, స్వతంత్ర అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి మిగిలిన నామినేషన్లు దాఖలయ్యాయన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సుమన గంటెల (పాయకరావుపేట), ఎన్ పార్వతి (పోలవరం), టీజేఆర్ సుధాకర్బాబు (పత్తిపాడు), మేడా సుజాత, మేడా వెంకట మల్లికార్జునడ్డి (రాజంపేట) నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ తరఫున బొగ్గు లక్ష్మణరావు, స్వామి బాబు (నర్సన్నపేట), దామచర్ల జనార్దన్రావు, దామచర్ల సత్యనారాయణ (ఒంగోలు), సుగవాసి సుబ్రమణ్యం (రాయచోటి) నామినేషన్ వేశారు. సీపీఐ తరఫున కే వెంకటయ్య (ఉదయగిరి), వీ రాంభూపాల్డ్డి (అనంతపూర్ అర్బన్), బీజేపీ తరఫున కేఎన్పీ కల్యాణ్చక్షికవర్తి (పాయకరావుపేట) నామిషన్లు వేశారు.

ఒక పక్క ఆస్తుల కేసులో సీబీఐ ఇస్తున్న షాకు లతో ఉక్కిరిబిక్కిరవు తున్న వైఎస్ జగన్కు, తాజాగా రాష్ట్ర సీఐడి అధికారులు కూడా మరో షాక్ ఇచ్చారు. ఆయనకు అత్యంత సన్నిహి తుడిగా ఉన్న దంతులూరి కృష్ణ, అలియాస్ పులివెందుల కృష్ణ, అలియస్ మంగలి కృష్ణను సిఐడి అధికారులు మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ చెక్పోస్టు వద్ద మంగళవారం నాడు అరెస్టు చేశారు. మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడైన మలి శెట్టి భానుకిరణ్కు ఆయుధాలు సరఫరా చేసిన నేరంపై అతన్ని అరెస్టు చేసినట్లు సిఐడి విభాగం అద నపు డిజిపి రమణమూర్తి ప్రకటించారు. సూరి హత్యకు ముందు మంగళి కృష్ణ దఫదఫాలుగా తనకు 8 తుఫాకులు సరఫరాచేసినట్లు భాను కిరణ్ సిఐడి విచారణలో అంగీకరించాడు.
ఈ సమాచారం ఆధారంగా గతంలో సూరికి బాడీగార్డుగా పనిచేసిన మహబూబ్నగర్ జిల్లాకి చెందిన చంద్రశేఖర రెడ్డిని హైదరాబాద్ టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేసి, అతడి వద్ద భాను దాచిన రెండు తూఫాకులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అనంతరం భాను వద్ద కూడా రెండు తుఫాకులు స్వాధీనం చేసుకు న్నారు. భాను ఇచ్చిన సమాచారం మేరకే కొద్దిరోజుల క్రితం అనంతపురంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సిఐడి పోలీసులు మరో రెండు తుఫాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తెలుగు దేశం పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి దివంగత పరిటాల రవిని హతమర్చడానికి అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని మేడాపురం గ్రామంలో 1999 సంవత్సరంలో సూటికేసు బాంబు అమర్చిన కేసులో కోర్టు గత నెలలో మంగలి కృష్ణతోపాటు మరో నాల్గురికి జైలు శిక్షణ ఖరారు చేసింది.
దానిపై మంగలి కృష్ణ హైకోర్టులో అప్పిల్ చేసుకోవడంతో బెయిల్ లభించింది. అయితే భాను కిరణ్కు ఆయుధాలు సరఫరాచేసిన కేసులో సిఐడి పోలీసులు తన కోసం గాలిస్తున్నారని తెలుసుకొని కృష్ణ నాలుగు రోజలు కిత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయా డు. అయితే మంగలి కృష్ణ మరో ముగ్గురు అనుచరులతో కలిసి హైదరాబాద్ వస్తున్నాడన్న పక్కా సమాచారం అందండంతో షాద్నగర్ సమీపం లోని చెక్పోస్టు వద్ద కాపలా కాసిన సిఐడి అధికారు లు అతన్ని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, మంగలి కృష్ణ కద లికలకు సంబంధించి విశ్వసనీయ సమాచారం అం దడంతో సోమవారం రాత్రి 11.40 నిమిషాలకు మహబూబ్నగర్జిల్లా కొత్తూరు టోల్గేటు దగ్గర సిఐడి అధికా రులు కృష్ణను అరెస్టు చేసినట్లు తెలు స్తున్నది. ఈ విష యం బయటకు పొక్కకుండా జాగ్ర త్తపడ్డ సిఐడి అధి కారులు మంగళవారం రాత్రి అధికారికంగా అరెస్టు చూపట్టారు. కృష్ణను బుధవా రం మెజిస్ట్రేట్ ముందు హజరపరుస్తామని సిఐడి అధికారులు చెప్పారు.

ఉప ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేలా ప్రచారాన్ని నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ అనేక కార్య క్రమాలు చేపడుతోంది. ప్రచార వ్యూహాన్ని ఇప్పటికే నిర్ణయించిన పార్టీ నేతలు పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబుతో చర్చించి ఖరారు చేయనున్నారు. తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్, జగన్ను లక్ష్యంగా చేసుకొని ప్రచారం దూకుడుగా చేయాలని భావిస్తు న్నారు. ఇప్పటికే చంద్రబాబు దాదాపు అన్ని నియోజక వర్గాల్లో ఒక విడత ప్రచారాన్ని పూర్తిచేయగా, బుధవారం నాడు పరకాలలో నిర్వహించే బహిరంగ సభకు తెలంగాణాలో కూడా ప్రచారం ముగించను న్నారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ప్రతి మండ లానికి ఒక ఎమ్మెల్యేనుగానీ ఎమ్మెల్సీని గానీ ఇన్ఛార్జ్గా నియమించి ఆయనకు సహాయకులుగా మరో ఐదుగురు రాష్ట్ర స్థాయి నాయకులను బాధ్యు లుగా నియమించారు. ప్రచారం, స్థానిక నాయకుల మధ్య సమన్వయం, కరపత్రాల పంపిణీ, ఓటర్లను పోలింగ్ బూత్కు తరలించడాన్ని ఈ నాయకులు పర్యవేక్షిస్తారు.
చంద్రబాబు మొదటివిడత ప్రచారంతో పార్టీ నాయకులు, శ్రేణుల్లో ఉత్సాహం కల్పించి ప్రచారంలో ముందుకు దూసుకుపోయేలా ప్రోత్సహించారు. ఆయన పర్యటించిన 17 నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల నుంచి మంచి స్పందన రావడంతో చంద్రబాబు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రచారంతో అనేకవిధాలుగా పార్టీ నాయకులు, అభ్యర్థులు ప్రజలను కలుసుకొని ఓట్లు అభ్యర్థించాలని నిర్ణయించారు. చంద్రబాబు జగన్ అవినీతి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు స్థానిక పరిస్థితులు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల లోటుపాట్లు, లొసుగులను ఎత్తిచూపి ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
జగన్ను టార్గెట్గా చేసి ఆయన అవినీతిని ప్రజలకు వివరించేందుకు లక్ష కరపత్రాలతో తెలుగుదేశం ఉప ఎన్నికలు జరిగే అన్ని నియోజక వర్గాల్లోని ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నారు. కొన్నిచోట్ల జగన్ అభిమానులు కరపత్రాలను తీసుకునేందుకు నిరాకరించి నప్పటికీ వాటిని ఒక్కసారి చదివి ఏ పార్టీకి ఓటెయ్యాలో నిర్ణయం తీసుకోవాలంటూ ఎంతో ఓపికతో నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కరపత్రా లను ఓటర్లచే చదివించగలిగితే జగన్ను నైతికంగా దెబ్బ తీయొ చ్చునని తెలుగుదేశం భావిస్తోంది. జగన్ డబ్బు పంపిణీపై గట్టి నిఘా ఏర్పాటుచేసి ఎక్కడికక్కడ అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక కార్యకర్తలు గ్రూపులుగా ఏర్పడి జగన్కు సంబంధించిన వాహనాలపై నిఘా పెట్టినట్లు సమాచారం. కోవూరు ఉప ఎన్నికల్లో జగన్ పెద్దఎత్తున డబ్బు పంపిణీ చేస్తే దాన్ని అడ్డుకోలేని పరిస్థితులను సమీక్షించుకొని ఈ ఎన్నికల్లో ధీటుగా వ్యవహరిం చాలని పార్టీ నిర్ణయించింది. అలాగే తిరుమలను వైఎస్ రాజశేఖరరెడ్డి అపవిత్రం చేశారని, అదే రీతిలో ఆయన కుమారుడు కూడా దేవాలయాల సంప్ర దాయాలను ఉల్లంఘించిన అంశాన్ని కూడా ప్రజలకు వివరించి ఆయనను అన్య మతస్తుడిగా ప్రచారం చేసేందుకు తెలుగుదేశం నాయకులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఇతర మతస్తులు ఉండే ప్రాంతాల్లో పార్టీలోని ఆయా మతాలకు చెందిన నాయకులను వారికి అనుకూలంగా ఉన్న వారితో మంతనాలు జరిపి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎంతో సున్నితమైన ఈ అంశాన్ని తగు జాగ్రత్తగా పరిశీలించి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ అధిష్ఠానం నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కులపెద్దలకు కూడా వివరించడం, అలాగే స్థానిక సమస్యలపై నాయకుల హామీలతో విస్తృతంగా ఆయా వర్గాలను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రామీణ ప్రజలను విశేషంగా ఆకట్టుకునేందుకు కళా బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ నున్నారు. సుప్రసిద్ధ ప్రజాకవులతో రాయించిన పాటలను పార్టీ అనుబంధ సాంస్కృతిక విభాగం కార్యకర్తలు ఇప్పటికే గత మూడు రోజులుగా ఎన్టిఆర్ భవన్లో రిహార్సల్స్ చేస్తున్నారు.

ప్రధానికి కడప ఎంపీ జగన్ లేఖ..
-జోక్యం చేసుకోవాలని వినతి
తనను అరెస్టు చేసేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు సీబీఐతో కలిసి కుట్ర చేస్తున్నాయని కడప ఎంపీ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్డ్డి ప్రధాని మన్మోహన్సింగ్కు ఫిర్యాదు చేశారు. ఈ కుట్రను అడ్డుకునేందుకు జోక్యం చేసుకోవాలని ఆయనను కోరారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ప్రధానికి ఆయన ఒక లేఖ రాశారు. తనను అరెస్టు చేసేందుకు జరుగుతున్న కుట్రలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా భాగస్వామి అయ్యారని ఆ లేఖలో పేర్కొన్నారు. జూన్ 12న జరిగే ఉప ఎన్నికలను నిలిపివేసేందుకు ఈ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనను ఇరికించాలని మొదటి నుంచీ సీబీఐ ప్రయత్నిస్తున్నదని జగన్ పేర్కొన్నారు. తనపై జరుగుతున్న కుట్ర అప్రజాస్వామికమని, సిగ్గుమాలినదని అన్నారు. దీన్ని అడ్డుకునేందుకు కృషి చేయాలని జగన్ తన లేఖలో ప్రధానికి విన్నవించారు.

హైదరాబాద్, గచ్చిబౌలిలోని టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల కేటాయింపు లలో భారీగా అక్రమాలు జరిగాయని తేలింది. సొసైటీలో అవకతవకల విషయాన్ని విచారణాధికారి కిరణ్మయి నిగ్గు తేల్చారు. ఈ మేరకు సౌసైటీలో జరిగిన అక్రమాలపై మంగళవారంనాడు ప్రభుత్వానికి దాదాపు వెయ్యి పేజీలతో కూడిన నివేదికను అందజేశారు. దీంతో ఈ సొసైటీ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకూ అన్ని విషయా లలో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన టీఎన్జీఓ అధినేత, హౌసింగ్ సొసైటీ అధ్య క్షుడు స్వామిగౌడ్ బండారం బయటపడిందని ఉద్యోగులలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. టీఎన్జీవోలకు కేటాయించిన ప్లాట్లలో అవకతవకలు జరిగాయంటూ, సొసైటీని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దీనిపై పూర్తిస్థాయి విచారణకు కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు హైదరాబాద్ జిల్లా సహకార శాఖ అధికారి కిరణ్మయిని టీఎన్జీఓ సొసైటీలో ప్లాట్ల కేటాయింపుల వ్యవహారంపై విచారణాధికారిగా నియమించారు. ఆమె తాజాగా పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ హౌసింగ్ సొసైటీలో ఇళ్ల స్థలాల కేటాయింపులలో భారీగా అవకతవకలు జరిగాయని విచారణాధికారి తన నివేదికలో నిర్ధారించారు. నివేదికలో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. 1991లో నగరంలోని గచ్చిబౌలిలో టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కోసం 160 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే సొసైటీలో లబ్ధిదారుల సభ్యత్వ నమోదు నుంచే అవకతవకలు మొదలైనట్లు విచారణలో తేలింది. కనీసం సభ్యుల నమోదు రిజిష్టరును కూడా నిర్వహించకుండా ఇష్టానుసారంగా ఇళ్లస్థలాలు కేటాయించినట్లు నివేదికలో స్పష్టంచేశారు. 240 ప్లాట్లను బినామీ పేర్లతో కేటాయించారని, ప్లాట్లు పొందేందుకు కొందరు దొంగ అఫిడవిట్లు కూడా ఇచ్చినట్లు విచారణలో వెల్లడించారు.
ఇతర జిల్లాల టీఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులకు ప్లాట్లు కేటాయించినట్లు నిర్ధారణ అయినట్లు నివేదికలో విచారణాధికారి స్పష్టం చేశారు. సొసైటీ అభివృద్ధికి రూ. 30 కోట్లు వెచ్చించినా ఎలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మ్యూచువల్లి ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ (ఏపీమ్యాక్స్) యాక్ట్ 1995ని, సొసైటీ బైలాస్ను, ప్రభుత్వ ఉత్తర్వులను సైతం పూర్తిగా పక్కన పెట్టారని నివేదికలో స్పష్టం చేశారు. సొసైటీ రిజిస్ట్రేషన్ చేయడం మొదలుకుని, ఇందులో సభ్యత్వ నమోదు, అకౌంట్లు, రికార్డుల నిర్వహణ, డెవలప్మెంట్, ఇళ్ల స్థలాల కేటాయింపు విషయాలలో అవకతవకలు జరిగాయని తేల్చారు. అంతేగాక ఇళ్ల నిర్మాణం, రోడ్లు, డ్రైనేజి, వీధి దీపాలు, తదితర సదుపాయాలకు సంబంధించి నిధుల వినియోగంలోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఎలాంటి నియమ నిబంధనలను పాటించలేదని, ఏపీమ్యాక్స్ చట్టాన్ని, ప్రభుత్వ ఉత్తర్వులను, సొసైటీ బైలాస్ను కూడా పూర్తిగా విస్మరించారని నివేదికలో పేర్కొన్నారు.
స్వామిగౌడ్గ ఆస్తులను జప్తు చేయాలి : టీజేఎస్సి
టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అక్రమాల పుట్ట అని తెలంగాణ జాయింట్ స్ట్రగుల్ కమిటీ ఆరోపించింది. టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కమిటీ డిమాండ్ చేసింది. హౌసింగ్సొసైటీలో అక్రమాలకు పాల్పడిన టీఎన్జీఓ ఛైర్మన్ స్వామిగౌడ్ ఆస్తులను జప్తు చేయాలని టీజేఎస్సి నేతలు తిరువరంగం ప్రభాకర్, ఇ.వెంకటేశం,గంజి వెంకటేశ్వర్లు, జె.రవీందర్ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణాధికారి ప్రభుత్వానికి నివేదిక అందజేసిన నేపథ్యంలో టీజేఎస్సి నేతలు సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు.
హౌసింగ్ సొసైటీ ఛైర్మన్ కె.స్వామిగౌడ్ ఇతర డైరెక్టర్లు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అర్హులైన సీనియర్ ఉద్యోగులకు అన్యాయం చేశారని దుయ్యబటా ్టరు. అసలు ఉద్యోగులే కాని వారికి, అస్మదీయులకు దాదాపు 776 మంది కి ప్లాట్లను అక్రమంగా కట్టబ ెట్టారని ఆరోపించారు. తద్వారా స్వామిగౌడ్ కోట్ల రూపాయల కుంభ కోణానికి పాల్పడినట్లు స్వయంగా విచారణాధి కారి తేల్చారన్నారు. ఇంది రమ్మ ఇళ్ల కేటాయింపులలో చిన్న తప్పులు దొర్లి తేనే సంబంధిత గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేస్తున్న ప్రభుత్వం 160 ఎకరాల ఖరీదైన భూ మిని దుర్వినియోగపరిచిన స్వామిగౌడ్పై, సొసైటీ డైరెక్టర్లపై కఠిన చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సొసైటీ ఛైర్మన్, డైరెక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని టీజేఎస్సి నేతలు డిమాం డ్ చేశారు. సొసైటీలో జరిగిన అక్రమాలు ఇంకా పూర్థిగా బయటికి వచ్చేం దుకు సీబీఐ చేత విచారణ జరిపించాలన్నారు. టీఎన్జీఓ హౌసింగ్సొసైటీని వెంటనే రద్దు చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టరును గానీ, జిల్లా కో ఆపరేటివ్ అధికారిని గాని స్పెషలాఫీసరుగా నియమించాలన్నారు.
జూన్ 14లోగా చర్యలు
హౌసింగ్ సొసైటీ అక్రమాలపై తాజాగా విచారణ అధికారి నివేదిక ఇచ్చిన మేరకు ప్రభుత్వం త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు టీజేఎస్సీ నేతలు తెలిపారు. జూన్ 14 నాటికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటీషన్ వేసిన గడువు ఆరు నెలలు పూర్తి కానున్నట్లు తెలిపారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆ గడువులోగా సొసైటీలో జరిగిన అక్రమాలపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకుని ఆ విషయాన్ని కోర్టుకు నివేదించాల్సి ఉందని ఉద్యోగ నేతలు తెలిపారు.
స్వామిగౌడ్కు నైతిక హక్కు లేదు….
తెలంగాణా ఉద్యోగులనే మోసం చేసి సీమాంధ్ర ఉద్యోగులకు అక్రమంగా ప్లాట్లను కట్టబెట్టి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడిన స్వామిగౌడ్కు తెలంగాణా ఉద్యమానికి నాయకత్వం వహించే నైతిక హక్కు లేదని టీజేఎస్సి నేతలు పేర్కొన్నారు. కోట్లు సంపాదించుకుని, తాను చేసిన అక్రమాలను స్వామిగౌడ్ ఉద్యమం మాటున క్లియర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
రాజకీయంగా ఎదుగుతున్నందుకే కుట్రః స్వామిగౌడ్
టీఎన్జీఓ సొసైటీ స్థలాల కేటాయింపులో తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని టీఎన్జీఓ నేత స్వామిగౌడ్ పేర్కొన్నారు. మంగళవారంనాడు టీఎన్జీఓ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వానికి సహకార శాఖ అధికారిని కిరణ్మయి ఇచ్చిన నివేదికపై ఆయన స్పందిస్తూ రాజకీయంగా ఎదుగుతున్నందుకే తనపై కుట్ర పన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తనకు నివేదిక ఇవ్వకుండానే లీక్ చేశారని స్వామిగౌడ్ ఆరోపించారు.

చట్టం తన పని తాను చేసుకుపోతోంది
విచారణ అనంతరం మంత్రుల పాత్ర ఎంతో తేలుతుంది
అభివృద్ధి ముందు ఏవాదం పనిచేయదు
పరకాలలో సీఎం కిరణ్
తమ ప్రభుత్వంలోని మంత్రులకు సీబీఐ నోటీసుల విషయంలో తన ప్రమేయం ఉండదని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. ఈ వ్యవహారంలో తమ జోక్యం ఉండదని సీఎం చెప్పారు. ఒక సంస్థకు చేరిన సొమ్ముపై విచారణ జరుగుతోందని, అందులో మంత్రులకు పాత్ర ఉందా, వారికి క్లీన్చిట్ ఇస్తారా అనేది విచారణ అనంతరం నిర్ధారణ అవుతుందని చెప్పారు. ఆదివారం పరకాల వచ్చిన ముఖ్యమంత్రిని మీడియా ప్రతినిధులు కలిశారు. రాష్ట్ర మంత్రులకు సీబీఐ నోటీసుల విషయమై విలేకరులు ప్రస్తావించగా, అది పూర్తిగా సీబీఐ పరిధిలోనిదని ముఖ్యమంత్రి చెప్పారు.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పరకాల నియోజకవర్గంలోని ఆత్మకూర్ మండలం గూడెప్పాడులో కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడారు. అనంతరం బహిరంగసభలో పాల్గొనేందుకు వచ్చారు. అయితే ఈదురుగాలుల కారణంగా టెంట్లు కూలి సభ జరగలేదు. సభలో ఎక్కువసేపు ప్రసంగించకుండానే సీఎం వెనుదిరిగారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి వాదం ముందు ప్రత్యేకవాదం పనిచేయదన్నారు. వైఎస్ జగన్ కు చెందిన మీడియా సంస్థల సిబ్బందికి జీతాలు ఇవ్వవద్దని ప్రభుత్వం ఏనాడూ చెప్పలేదని, సాక్షి వ్యవహారంలో సీబీఐ తనపని తాను చేసుకుపోతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ముందు ప్రత్యేకవాదం సన్నగిల్లుతోందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రసమితికి ఓట్లశాతం తగ్గడమే ఇందుకు నిదర్శనమన్నారు. తమ ప్రభుత్వం లక్షలాదిమంది ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందని, ప్రజలు అది గమనించి అభివృద్ధి వైపే మొగ్గుచూపుతున్నారన్నారు.
ఇప్పుడు జరిగే ఉప ఎన్నికలతోపాటు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2014లో జరిగే సాధారణ ఎన్నికల నాటికి ప్రజల ఆలోచనల్లో మరింత మార్పు వస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఒక కుటుంబంలోని సభ్యులు ఒకో జిల్లాను పంచుకుని తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకుని ఓట్లు చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం విమర్శించారు. తెరాస అధినేత కేసీఆర్కు తెలంగాణలో ఓట్లు అడిగే నైతిక హక్కులేదన్నారు. మతతత్వవాదంతో బీజేపీ, ప్రత్యేక వాదంతో తెరాస ఓట్లు చీల్చి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. మతతత్వం ద్వారా అభివృద్ధి సాధ్యపడదని గతంలో ఇందిరాగాంధీ సైతం స్పష్టంచేశారని సీఎం గుర్తుచేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజాబలం తమకే ఉందని సీఎం చెప్పారు. మత తత్వపార్టీలతో జతకట్టే పార్టీలను కూడా ప్రజలు ఆదరించరన్నారు.
కృష్ణాజలాల పంపిణీ విషయంలో ట్రైబ్యునల్లో వాదనలు కొనసాగుతున్నాయని, దీనిపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి అందరికీ ఆమోదయోగ్యమయ్యే దిశగా సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.మధ్యాహ్నం 2.45 నిమిషాలకు రావలసిన ముఖ్యమంత్రి సాయంత్రం 4.10 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్కడికి చేరుకున్నారు. ఆయన వెంట పీసీసీ అధ్యక్షుడు బొత్స ఉన్నారు. వీరికి మంత్రులు బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ చీఫ్విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల కాంగ్రెస్ అభ్యర్థి సాంబారి సమ్మారావు తదితరులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, బలరాంనాయక్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

తిరుపతి ఉప ప్రచారంలో చంద్రబాబు
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ భూములతోపాటు, పేదల భూములను కూడా వారు దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని విమర్శించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుపతి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ బినామీ పేర్లతో భూముల్ని కబ్జా చేశారని ఆరోపించారు. తిరుపతి-తిరుచానూరు ప్రధాన మార్గం వెంట వెంకట రమణ కబ్జా చేసినట్లుగా చెబుతున్న భూములను చంద్రబాబు పరిశీలించారు. అక్కడి ప్రజలను, మాజీ సర్పంచ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వస్తే కబ్జాకు గరైన భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.

ఐదుగురికి గాయాలు.. కార్యకర్తలు చెల్లాచెదురు
-నాయకుల పరుగులు.. అర్ధాంతరంగా ముగిసిన సభ
-కాంగ్రెస్ నేతల్లో కలవరం.. సీఎంకు అచ్చిరాని ఓరుగల్లు పర్యటన
(టీ న్యూస్ ప్రతినిధి-వరంగల్) ముఖ్యమంత్రి కిరణ్కుమార్డ్డికి వరంగల్ పర్యటన అచ్చిరావడం లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత జిల్లాలో మూడుసార్లు పర్యటించారు. మేడారం జాతర మినహా మిగతా రెండుసార్లు ఆయన వేదిక మీద మాట్లాడకుండానే వెళ్లిపోయారు. తెలంగాణవాదాన్ని అపహాస్యం చేసేవిధంగా ఆయన ప్రవర్తించడంవల్లే ఆయనకీ కష్టాలు వస్తున్నాయని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే వాపోతున్నారు. గతంలో ఆయన రచ్చబండ కార్యక్షికమంలో భాగంగా రాయినిగూడెం వచ్చినప్పుడు తెలంగాణవాదులు, ప్రత్యేకించి ఈ ప్రాంతపు ఆడబిడ్డలు జై తెలంగాణ అంటూ నినదించారు. ఆయనకు తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. దాంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఈసారి ప్రకృతే అనుకూలించలేదు. ఆదివారం ఆయన పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడెప్పాడ్లో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు గాలిదుమారాన్ని చవిచూడాల్సి వచ్చింది. (నిజానికి ఇది బహిరంగ సభే కానీ జన స్పందన ఇబ్బందిగా మారితే దాని ప్రభావం ఫలితం మీద ఉంటుందని బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంగా మార్చారు). ఈ సభకు సీఎం కిరణ్కుమార్డ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి వాయలార్ రవి కోసం పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2.45కి సభ ప్రాంగణానికి రావాల్సి ఉన్న సీఎం ఆ సమయానికి సభా ప్రాంగణంలో జనం రాకపోవడంతో తన కార్యక్షికమ సమయంలో మార్పు చేశారని తెలుస్తోంది. జనం అంతా వచ్చిన తరువాత ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు. కేంద్ర మంత్రి వాయలార్ రవి మినహా పీసీసీ చీఫ్ బొత్సతో కలిసి వచ్చారు. ఆయన రాగానే నేతలంతా వరుస క్రమంలో మాట్లాడటం మొదలైంది. మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రసంగం పూర్తవుతుండగానే బలమైన ఈదురుగాలులు మొదలయ్యాయి. అంతే ఒక్కసారిగా గాలిదుమారం తీవ్రత పెరిగిపోవడంతో వేదిక ముందు షామియానా టెంట్లు ఒక్కటొక్కటిగా కుప్పకూలడం మొదలైంది.
క్షణాల్లో వేదిక ముందున్న టెంట్లన్నీ కూలిపోయాయి. వేదిక సైతం కూలుతోందని భావించిన పోలీసులు జాగ్రత్త వహించారు. పరిస్థితిని గమనించిన ఇద్దరు ఎస్పీలు (అర్బన్, రూరల్) సీఎంను వేదిక మీది నుంచి దింపుకొని పక్కకు తీసుకెళ్లారు. షామియానా కూలుతుండగా ఒక్కరొక్కరు పరుగులు తీశారు. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొన్నది. నాయకులు ఒకవైపు ధైర్యం నూరిపోసినట్టు కనిపించినా వారూ బయటకు పరుగులు తీశారు. సభలో మాట్లాతుండగానే ఇలా కావడంతో నాయకులు అవాక్కయ్యారు. నిమిషాల్లోనే టెంట్లన్నీ నేలకూలాయి. ఐదుగురికి గాయాలయ్యాయి. టెంట్ల కిందినుంచి కార్యకర్తలు తప్పించుకున్నారు. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రాణాలు కాపాడుకోవడంకోసం ఎవరికివారే పరుగులు తీశారు.
రెండే మాటలు..
ఒకవైపు గాలి దుమారం, అంతలో పవర్ కట్. గాలిదుమారానికి కార్యకర్తల్లో ధైర్యాన్ని నూరిపోసేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స కొంత ప్రయత్నం చేశారు. ‘గీదీనికే భయపడి పోవద్దు. వర్షం శుభసూచకం’ అని ఆయనంటే ‘వానొచ్చినా గాలొచ్చినా గెలిసేదానికే ప్రభుత్వం ఉండాలె’ అని సీఎం అన్నారు. ఇద్దరు ఈ రకంగా చెరో రెండు మాటలు మాత్రమే మాట్లాడారు. కాంగ్రెస్ సమావేశం అర్ధాంతరంగా ముగియడంతో నాయకుల్లో నైరాశ్యం నెలకొంది. పార్టీ శ్రేణుల్లో నైతికస్థైర్యాన్ని నింపేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్డ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రసంగించేముందే గాలిదుమారం భీభత్సం సృష్టించడంతో వారు వెనుదిరిగి వెళ్లడం నాయకులకు నిరాశ కలిగించింది.