కర్నూలు

కర్నూలు జిల్లా పరిధిలోని ఫ్యాక్షన్ గ్రామాలుగా పేరుగావించిన గ్రామాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. సోమవారం ఆయన మండల కేంద్రమైన ఆస్పరి పోలీసుస్టేషన్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో గ్రామాల్లో ప్రశాంతత నెలకొందన్నారు. జిల్లాలో ఫ్యాక్షన్ నాయకులకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. పోలీసు సిబ్బంది మండల పరిధిలో జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్, పోలీసు క్వార్టర్స్లు శిథిలా వస్థకు చేరినందువలన కొత్త భవనాల కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఎకై్సజు శాఖ వారి సహకారంతో బెల్టుషాపుల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 400 మంది పోలీసు సిబ్బంది తక్కువగా ఉండడంతో ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నామన్నారు. ప్రజలు రాత్రివేళల్లో ఇళ్లకు తాళాలు వేయకుండా నిద్రించరాదని సూచించారు. అనంతరం పోలీసు క్వార్టర్స్ను పరిశీలించారు. ఎస్పీతో పాటు డిఎస్పీ విల్సన్, సిఐ వెంకటరమణ, ఎస్ఐ శ్రీనివాసులు, సిబ్బంది ఉన్నారు.
అతిసార ప్రాణాలు తీస్తోంది. రక్షిత మంచినీరు లేక గ్రామాలు విలవిల లాడుతున్నాయి. పలు గ్రామాల్లో తాగునీటిని అందించే పటిష్టమైన రక్షిత మంచినీటి పథకాలు లేకపోవడంతో గ్రామీణులు వ్యాధుల బారిన పడి అల్లాడుతున్నారు. గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న పారిశుధ్ద్యలోపం, పైపులైనుల లీకేజి, కలుషిత నీటి వాడకం వంటి వాటితో అతిసార ప్రబలి ప్రజలు మంచాన పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే వేలాది మంది కలుషిత నీటి తాకిడికి మంచాన బారిన పడి వైద్యం కోసం నానా ఆగచాట్లు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం అతిసార వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రెండు పదులకు దాటింది. ఇటీవల పత్తికొండ మండలంలోని పందికోనలో పారిశుద్ద్యం లోపంతో అతిసార ప్రబలి ఇద్దరు మృతిచెందారు. అలాగే కౌతాళం గ్రామంలో కలుషిత నీరు తాగి 60 మందికి పైగా ప్రజలు అతిసార వ్యాధి బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని చాగలమర్రి, కోసిగి మండలంలోని చింతకుంట, ఐరన్గల్ తదితర గ్రామాల్లో అతిసార వ్యాధి బారిన పడి గ్రామంలో అనేక మంది రోగానపడ్డారు. ఇదిలా ఉండగా జిల్లాలో వర్షాకాలం మొదలైంది మొదలు గ్రామాలు ఒక్కక్కటి అతిసార వ్యాధి బారిన పడుతున్న ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్లైనా లేదు.
ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెబుతున్నా గ్రామస్థాయిలో ఎలాంటి ప్రభావం కన్పించడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాజాగా నందికొట్కూరు మండల పరిధిలోని బిజనవేముల గ్రామంలో కలుషిత నీరు తాగి దాదాపు 70 మంది అతిసార వ్యాధిబారిన పడ్డారు. గ్రామానికి మంచినీటిని సరఫరా చేస్తున్న పైపులైను మురికి కాలువలో లీకేజి కావడంతో నీరు కలుషితమైనట్లుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఇరువురి పరిస్థితి విషమంగా ఉండగా, మరో 35మంది వాంతులు, వీరేచనాలతో మంచం పట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శివశంకర్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో పారిశుధ్ద్యలోపం ,పైపుల లీకేజి వంటి కారణాలతో అతిసార విజృంభిస్తోంది.
ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యసిబ్బంది అతిసార వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రచారం చేయాల్సి వున్నా ఆరోగ్య కార్యకర్తలు విధి నిర్వహణలో ప్రదర్శిస్తున్న అలక్ష్యం రోగుల ప్రాణాలు తీస్తోంది. ప్రతి రెండు గ్రామాలకు ఒక ఆరోగ్య కార్యకర్త ఉన్నా రోగాలు ప్రబలితేనే వారు గ్రామాలకు వస్తుండటంతో ఆరోగ్యంపై గ్రామీణుల్లో చైతన్యం కలగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా పంచాయితీలకు కేటాయించే అరకొర నిధులకు అవినీతి గ్రహణం పట్టడంతో క్లోరినేషన్, పారిశుద్ద్యం వ్యవస్థ దారుణంగా ఉంటుందని విమర్శలు విన్పిస్తున్నాయి. గ్రామీణులకు వైద్యం అందని ద్రాక్షగానే మారింది. మూకుమ్మడిగా గ్రామ ప్రజలందరు వ్యాధుల బారిన పడితేనే తప్ప వైద్యసిబ్బంది అందుబాటులోకి రావడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. పిహెచ్సిలకు వైద్యులు ఎగనామం పెట్టడంతో వ్యాధిగ్రస్తులకు ఆర్ఎంపిల వైద్యమే శరణ్యంగా మారింది. ఏదీ ఏమైనా దేశాభివృధ్దికి పట్టుకొమ్మలుగా నిలవాల్సిన పల్లెలు వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో వ్యాధులకు కేంద్రాలుగా మారడం శోచనీయం.
మరాఠీలకు మానవత్వం లేదని సాటి మనిషిపై విచక్షణా రహితంగా దాడి చేయడమే వారి నైజమని ఆదోని ఎమ్మెల్యే మీనాక్షినాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులను చూపిస్తామని చెప్పి తమను నిర్భంధించి నానాహింసలకు గురిచేశారన్నారు. కనీసం మంచినీటి వసతి కూడా కల్పించలేదన్నారు. దీంతో నాలుగు రోజుల పాటు నరకయాతన
అనుభవించామన్నారు. మన ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను కూడా మరాఠ పోలీసులు తమకు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను కూడా పిడిగిద్దులు గుద్దారన్నారు. ఆంధ్రా పోలీసుల్లో ఉన్న బాస్యిజం మహారాష్ట్ర పోలీసుల్లో లేదని, ఎస్పీ వచ్చినా సామాన్య పోలీసులు సెల్యూట్ చేయడం లేదన్నారు. నాలుగు రోజుల పాటు సరైన భోజన సౌకర్యాలు లేకపోవడంతో అనారోగ్యాలకు గురయ్యామన్నారు. కనీసం వైద్య సౌకర్యం కూడా కల్పించలేదని, తమకు వైద్యం అందించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యులపై కూడా మరాఠి పోలీసులు లాఠి ఛార్జీ చేశారన్నారు. చంద్రబాబు తప్ప మిగతా అందరూ లాఠి దెబ్బలు తిన్నామన్నారు. రాష్ట్ర స్వప్రయోజనాల కోసం మహారాష్టల్రో రాజకీయ పార్టీలన్ని ఒకే తాటిపైకి వచ్చి పోరాడుతున్నాయన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లి కష్టాలు పాలైన సమయంలో మద్దతు ఇవ్వాల్సింది పోయి విమర్శలు చేయడం మన నేతలకు తగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాడాలని ఆయన కోరారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు మల్లేష్గౌడు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్తోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమవుతుంది. తెలంగాణ కనుచూపు మేరలో వస్తుందని అక్కడి ప్రజలను మభ్య పెడుతున్న టిఆర్ఎస్ థీఫ్స్ రీజినల్ సీజనల్ సంస్థ. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధికి కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అనే విషయాన్ని అక్కడి ప్రజలు గ్రహించాలి. ఈ నెల 27న తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి మూలింటి మారెప్ప విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్తో మొదలు పెట్టి బడుగుల బడ్జెట్ వరకు అనేక విషయాలను వెల్లడించారు. డిఎస్ సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న వ్యక్తిగా మారెప్ప చెప్పారు. ప్రస్తుతం నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో వున్న డిఎస్ గెలుపు తధ్యమన్నారు. ప్రత్యేక తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది తానే అని డిఎస్ ప్రచారం చేసుకోవడంలో వాస్తవం వుందన్నారు. అయితే డిఎస్ వ్యక్తిగా కాక, కాంగ్రెస్ ద్వారా సాధ్యమని అర్థం చేసుకోవాలన్నారు. డిఎస్ ఖచ్చితంగా గెలిచిన అనంతరం ఆయనకు మంత్రి పదవి లభిస్తుందని, అప్పుడు ఖాళీగా ఏర్పడే పిసిసి అధ్యక్ష పదవిని దివంగత నేత వైఎస్ తనయుడు వైఎస్ జగన్కు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బసవరాజు, తిరుమలకు మంత్రి పదవులు: రజక వర్గానికి చెందిన బసవరాజు సారయ్య, వాల్మీకి వర్గానికి చెందిన ఎంఎల్సి తిరుమల శ్రీనివాసులుకు మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని మారెప్ప కోరారు. ఆగష్టు 15వ తేది తరువాత మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశం వున్నందున బిసి వర్గాలకు చెందిన వీరికి మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. అలాగే ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనార్టి వర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యత గల శాఖలను అప్పగించాలన్నారు. జగన్ ఓదార్పు యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఇమేజ్ పెరిగిందన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న యాత్ర వల్ల కూడా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మరింత పెరుగుతోందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టి అమలు చేసిన 60 పథకాలను తూచ తప్పకుండా అమలు చేస్తే, 90 శాతంగా వున్న అట్టడుగు వర్గాల ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడు వుంటాయని మారెప్ప చెప్పారు.
జనాభా ప్రకారం బడుగులకు బడ్జెట్: జనాభా ప్రాతిపదికన ఎస్సీ,ఎస్టీ,బిసి,మైనార్టిలకు బడ్జెట్ను కేటాయించాలని మారెప్ప డిమాండ్ చేశారు. 54 శాతంగా వున్న బిసిలకు రూ.54 వేల కోట్లు, 15 శాతంగా వున్న ఎస్సీలకు రూ.15వేల కోట్లు, 6 శాతంగా వున్న ఎస్టీలకు రూ.6వేల కోట్లు, 5 శాతంగా వున్న క్రిష్టియన్లకు రూ.5వేల కోట్లు, మిగిలిన బడ్జెట్ను ఇతరులకు కేటాయించాలన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు రాయలసీమ నుండి మాదిగ కులానికి చెందిన ఒక్కరికి కూడా రాజ్యసభ సీటు దక్కలేదని మారెప్ప ఆవేదన వ్యక్తం చేశారు. జనరంజకంగా పాలన సాగించిన స్వర్గీయ ఎన్టిఆర్, వైఎస్ఆర్లకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని ఆయన కోరారు.
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే విద్యుత్ ఉత్పాదనకు రంగం సిద్ధం చేస్తున్నారు. రిజర్వాయర్లో నీరు అడుగంటడంతో గత రెండు నెలలుగా శ్రీశైల జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన నిలిపివేసిన విషయం తెలిసిందే. జల విద్యుత్ కేంద్రంలోని 4వ నెంబర్ యూనిట్ను నేడో రేపో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. యూనిట్ పూర్తిస్థాయిలో పని మొదలైన తరువాత విద్యుత్ ఉత్పాదన చేసే అవకాశం ఉంది. సోమవారం నాటికి శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 831.40 అడుగులు ఉండగా, నీటిసామర్థ్యం 81.93 టిఎంసీలు ఉంది. ఎగువ నుండి 4119 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్కు చేరుతోంది. గత ఏడాది ఇదే నెలలో రిజర్వాయర్కు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిమట్టం 825 అడుగులున్నా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 845 అడుగులు చేరిన తరువాతే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు తిలోదకాలిచ్చి ఉత్పాదన చేస్తున్న విషయం తెలిసిందే.
శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 854 అడుగులకు చేరితే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కెసి కెనాల్కు సాగునీరు విడుదల చేసే అవకాశం ఉంది. దిగవనున్న రైతుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యుత్ ఉత్పాదన పేరుతో సాగర్కు నీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మొత్తానికి ఏ ఏటికాఏడు సీమ రైతుకు మాత్రం సాగునీటి కష్టాలు తప్పడం లేదు. తుంగభద్ర ప్రాజెక్టు నీటిమట్టం 1609.20 అడుగులు ఉండగా, నీటిసామర్థ్యం 34.13 టిఎంసీలు ఉంది. ఎగువ నుండి ప్రాజెక్టుకు 25,405 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, దిగవకు 200 క్యూసెక్కులు మాత్రం విడుదల చేస్తున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నీటిమట్టం 373.15 అడుగులు, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిమట్టం 253.70 అడుగులు, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిమట్టం 259.75 అడుగులు ఉంది. సుంకేసుల రిజర్వాయర్ నీటిమట్టం 289.00 అడుగులు ఉండగా, నీటిసామర్థ్యం 0.33 టిఎంసీలు ఉంది. 750 క్యూసెక్కుల వరదనీరు రిజర్వాయర్కు చేరుతుండగా, 256 క్యూసెక్కుల నీరు కెసి కెనాల్కు విడుదల చేస్తున్నారు.
కళకళలాడుతున్న వరదరాజస్వామి ప్రాజెక్టు
నల్లమల అడవుల్లో నిర్మించిన వరద రాజస్వామి ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతోంది. పై ప్రాంతంలో కురిసిన వర్షాలతో వరద నీరు ప్రాజెక్టు భారీగా చేరుతోంది. నీటిమట్టం 367.00 మీటర్లు ఉండగా, నీటిసామర్థ్యం 0.252.50 ఎంసిఎఫ్టిలు ఉంది. తొలిసారిగా వరదరాజ స్వామి ప్రాజెక్టుకు వరద నీటితో కళకళలాడుతోంది.
రైతే దేశానికి వెన్నెముఖ అని భావించిన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతన్న సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించడం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యవసాయ రంగంలో ఆధునిక యంత్రీకరణను ప్రవేశపెట్టింది.
అయితే అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ ఊదాసీనత, వ్యాపారుల లాభాపేక్షతో ఆళ్ళగడ్డ సబ్డివిజన్లో వ్యవసాయ యాంత్రీకరణకు తూట్లు పడుతున్నాయి. ఖరీప్ సీజన్ మొదలవ్వక ముందే పరికరాలను, యంత్రాలను రైతులకు 50 శాతం సబ్సిడీపై అందజేస్తామని అందరూ సంబంధిత మండల వ్యవసాయాధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్భాటంగా సభలు, సమావేశాలు పెట్టి రైతులకు చెప్పారు. దీనిపై ఆశలు పెంచుకున్న సబ్ డివిజన్లోని దాదాపు 500 మందికిపైగా రైతులు సంబంధిత అధికారులకు దరఖాస్తులు అందజేశారు. మరి కొందరు సబ్సిడీ పోను మిగిలిన మొత్తానికి డిడిలు కూడా కట్టి అందజేసినట్లు తెలిసింది. సీజన్ మొదలవ్వకముందు మండలానికి రూ.7 లక్షల నిధులు మంజూరు అయ్యాయని వ్యవసాయాధికారులు తెలిపారు. దీంతో రైతులు దరఖాస్తులు ఇచ్చి యంత్రపరికరాలు తీసుకెళ్ళవద్దని ఎంతో ఆశపడ్డారు.
పరికరాలను వెంటనే అందజేస్తామన్న అధికారులు సీజన్ ముగుస్తున్నా పట్టించుకోకపోవడమే కాక ముఖం చాటేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రైతుల సంక్షేమం గురించి ఊకదంపుడు మాటలు మాని వ్యవసాయ పరికరాలను రైతులకు అందజేయడమో… లేక వారు కట్టిన డీడీల సొమ్మును తిరిగి వారికి ఇవ్వడమో చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యవసాయ పరికరాల మీద ఉన్న ఆశతో అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి డీడీలు తీశామని, నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పరికరాలను అందడంలేదని రైతులు వాపోతున్నారు. సబ్సిడీ వ్యవసాయ పరికరాలు వస్తాయన్న ఆలోచనతో బయటమార్కెట్లో వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయలేదన్నారు. సొమ్ముపోయి దుమ్ముపట్టే అన్న చందంగా అటు ప్రభుత్వ వ్యవసాయ పరికరాలు రాకపోగా నెలలుగా తాము కట్టిన మొత్తానికి వడ్డీలు కూడా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
మరాఠీలకు మానవత్వం లేదని సాటి మనిషిపై విచక్షణా రహితంగా దాడి చేయడమే వారి నైజమని ఆదోని ఎమ్మెల్యే మీనాక్షినాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులను చూపిస్తామని చెప్పి తమను నిర్భంధించి నానాహింసలకు గురిచేశారన్నారు. కనీసం మంచినీటి వసతి కూడా కల్పించలేదన్నారు. దీంతో నాలుగు రోజుల పాటు నరకయాతన
అనుభవించామన్నారు. మన ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను కూడా మరాఠ పోలీసులు తమకు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యేలను కూడా పిడిగిద్దులు గుద్దారన్నారు. ఆంధ్రా పోలీసుల్లో ఉన్న బాస్యిజం మహారాష్ట్ర పోలీసుల్లో లేదని, ఎస్పీ వచ్చినా సామాన్య పోలీసులు సెల్యూట్ చేయడం లేదన్నారు. నాలుగు రోజుల పాటు సరైన భోజన సౌకర్యాలు లేకపోవడంతో అనారోగ్యాలకు గురయ్యామన్నారు. కనీసం వైద్య సౌకర్యం కూడా కల్పించలేదని, తమకు వైద్యం అందించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యులపై కూడా మరాఠి పోలీసులు లాఠి ఛార్జీ చేశారన్నారు. చంద్రబాబు తప్ప మిగతా అందరూ లాఠి దెబ్బలు తిన్నామన్నారు. రాష్ట్ర స్వప్రయోజనాల కోసం మహారాష్టల్రో రాజకీయ పార్టీలన్ని ఒకే తాటిపైకి వచ్చి పోరాడుతున్నాయన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లి కష్టాలు పాలైన సమయంలో మద్దతు ఇవ్వాల్సింది పోయి విమర్శలు చేయడం మన నేతలకు తగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాడాలని ఆయన కోరారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. ఈ సమావేశంలో టిడిపి నేతలు మల్లేష్గౌడు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
అతిసార ప్రాణాలు తీస్తోంది. రక్షిత మంచినీరు లేక గ్రామాలు విలవిల లాడుతున్నాయి. పలు గ్రామాల్లో తాగునీటిని అందించే పటిష్టమైన రక్షిత మంచినీటి పథకాలు లేకపోవడంతో గ్రామీణులు వ్యాధుల బారిన పడి అల్లాడుతున్నారు. గ్రామాల్లో అపరిష్కృతంగా ఉన్న పారిశుధ్ద్యలోపం, పైపులైనుల లీకేజి, కలుషిత నీటి వాడకం వంటి వాటితో అతిసార ప్రబలి ప్రజలు మంచాన పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే వేలాది మంది కలుషిత నీటి తాకిడికి మంచాన బారిన పడి వైద్యం కోసం నానా ఆగచాట్లు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం అతిసార వ్యాధి బారిన పడిన వారి సంఖ్య రెండు పదులకు దాటింది. ఇటీవల పత్తికొండ మండలంలోని పందికోనలో పారిశుద్ద్యం లోపంతో అతిసార ప్రబలి ఇద్దరు మృతిచెందారు. అలాగే కౌతాళం గ్రామంలో కలుషిత నీరు తాగి 60 మందికి పైగా ప్రజలు అతిసార వ్యాధి బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని చాగలమర్రి, కోసిగి మండలంలోని చింతకుంట, ఐరన్గల్ తదితర గ్రామాల్లో అతిసార వ్యాధి బారిన పడి గ్రామంలో అనేక మంది రోగానపడ్డారు. ఇదిలా ఉండగా జిల్లాలో వర్షాకాలం మొదలైంది మొదలు గ్రామాలు ఒక్కక్కటి అతిసార వ్యాధి బారిన పడుతున్న ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్లైనా లేదు.
ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెబుతున్నా గ్రామస్థాయిలో ఎలాంటి ప్రభావం కన్పించడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాజాగా నందికొట్కూరు మండల పరిధిలోని బిజనవేముల గ్రామంలో కలుషిత నీరు తాగి దాదాపు 70 మంది అతిసార వ్యాధిబారిన పడ్డారు. గ్రామానికి మంచినీటిని సరఫరా చేస్తున్న పైపులైను మురికి కాలువలో లీకేజి కావడంతో నీరు కలుషితమైనట్లుగా అధికారులు గుర్తించారు. వీరిలో ఇరువురి పరిస్థితి విషమంగా ఉండగా, మరో 35మంది వాంతులు, వీరేచనాలతో మంచం పట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శివశంకర్ రెడ్డి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో పారిశుధ్ద్యలోపం ,పైపుల లీకేజి వంటి కారణాలతో అతిసార విజృంభిస్తోంది.
ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యసిబ్బంది అతిసార వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రచారం చేయాల్సి వున్నా ఆరోగ్య కార్యకర్తలు విధి నిర్వహణలో ప్రదర్శిస్తున్న అలక్ష్యం రోగుల ప్రాణాలు తీస్తోంది. ప్రతి రెండు గ్రామాలకు ఒక ఆరోగ్య కార్యకర్త ఉన్నా రోగాలు ప్రబలితేనే వారు గ్రామాలకు వస్తుండటంతో ఆరోగ్యంపై గ్రామీణుల్లో చైతన్యం కలగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా పంచాయితీలకు కేటాయించే అరకొర నిధులకు అవినీతి గ్రహణం పట్టడంతో క్లోరినేషన్, పారిశుద్ద్యం వ్యవస్థ దారుణంగా ఉంటుందని విమర్శలు విన్పిస్తున్నాయి. గ్రామీణులకు వైద్యం అందని ద్రాక్షగానే మారింది. మూకుమ్మడిగా గ్రామ ప్రజలందరు వ్యాధుల బారిన పడితేనే తప్ప వైద్యసిబ్బంది అందుబాటులోకి రావడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. పిహెచ్సిలకు వైద్యులు ఎగనామం పెట్టడంతో వ్యాధిగ్రస్తులకు ఆర్ఎంపిల వైద్యమే శరణ్యంగా మారింది. ఏదీ ఏమైనా దేశాభివృధ్దికి పట్టుకొమ్మలుగా నిలవాల్సిన పల్లెలు వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో వ్యాధులకు కేంద్రాలుగా మారడం శోచనీయం.
మహిళా సంఘాలలోని సభ్యులు ఆర్థికంగా బలో పేతం అయినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని టౌన్ హాలులో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక బృందాలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన మెగా బుణ మేళాకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై 205 మహిళా గ్రూపులకు 3కోట్ల4లక్షలు రుణపత్రాలను అంద జేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేం దుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుందని గత సంవత్సరం జిల్లాలోని బ్యాంక్ల ద్వారా మహిళా సంఘాలకు రూ.270కోట్లు రుణాలు ఇవ్వగా, ఈసారి రూ.520కోట్లు బుణం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. తీసుకున్న రుణాలను మహిళాలలు సకాలంలో తిరిగి చెల్లించాలని కలెక్టర్ కోరారు. పావుల వడ్డీ కింద గత సంవత్సరం రూ.10కోట్ల బుణాలు ఇచ్చామని, ఈ రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి పావులా వడ్డీ రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. పొదుపే లక్ష్యంగా ప్రారంభమైన మహిళా సంఘాలు జిల్లాలో 40 వేలకుపైగా వున్నాయన్నారు. ఇందులో 5లక్షల మందికి పైగా సభ్యులు ఉన్నారని సంఘాలు అకౌంట్ సరిగా నిర్వహించుసుకోవాలని, మహిళా సంఘాలకు సరిగ్గా పనులు చూసేందుకు అన్ని బ్యాంక్ల్లో బ్యాంక్ మిత్రలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గురువారం బ్యాంకర్లు మహిళా సంఘాలకు సంబంధించిన పనిని చూస్తారని, సంఘాల సభ్యులు పిల్లలను తప్పని సరిగా బడికి పంపాలని సాక్షర భారతిలో చదువురాని నిరక్ష్యరాస్యులు తప్పని సరిగా చదుకోవాలన్నారు. డీఆర్డీఏ పీడీ చంద్రకాంత్రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలు అభివృద్ధి చెందాలంటే పంచసూత్రాలు పాటించాలని, తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని కోరారు. బ్యాంక్ల ద్వారా బుణాలు పొందిన మహిళా సంఘాలు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని నాబార్డు ఏజీఎం సురేశ్ పిలుపు నిచ్చారు. కేంద్ర బ్యాంక్ డివిజినల్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల అభివృద్ధి కోసం కెనరా బ్యాంక్ ఎప్పుడు సిద్ధంగా వుంటుందని, మైక్రో ఫైనాన్స్ కింద 500 గ్రూపులకు పట్టణంలో 3వేల గ్రూపులకు రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. మేప్మా పీడీ బాలకొండయ్య మాట్లాడుతూ పట్టణ ప్రాంతంలో 21 గ్రూపులకు 24లక్షల రుణం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ అధ్యక్షత వహించారు. క్యాతుర్, కడ్తాల్, కేశంపేట్, నారాయణపేట్, షాద్నగర్ మండలాల్లోని కెనరా బ్యాంక్ శాఖల ద్వారా 205 గ్రూపులకు రూ.3 కోట్ల 4లక్షల బుణపత్రాలను అందజేశారు.
జగదేవపూర్ మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి చెరువులోకి సగం నీరు చేరుకున్నాయి. వాగులు వంకలు కుటలు జలంతో కళకళలా డుతున్నాయి. ఈ వర్షానికి మండలంలోని నర్సన్నపేట్ గ్రామం లోని ఓప్ప ప్రైవేట్ జిన్నింగ్ మిల్కు సరఫరా అయ్యె 11కెవి విద్యుత్ స్థంబాలు నేలకొరిగాయి. వైర్లు సైతం తెగిపడ్డాయి. గతంలో సైతం ఈస్థంబలు నేలకొరిగాయి. అయిన సంబధిత అధికారులు పట్టించుకొకపొవడం మూలంగా మాములు వర్షా నికే అవి నేలకొరుగుతున్నాయని విటితో ప్రమాదం పోంచి ఉం దని నర్సన్నపేట గ్రామస్తులు పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికైన సంబధిత అధికారులు కంపనీ యాజమనులు ఈవిద్యుత్ స్థంబలను పక్బ ందిగా బిగించి విద్యుత్ సరఫరా చేసుకొవాల్సిన అవసరం ఉం ది. రాత్రిపూట పడటం వల్ల ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. కాని ఉదయం పూట జరిగితే పెద్ద ప్రమాదం జరిగిదేదని గణేశ్ పల్లి, నర్సన్నపేట, గ్రామస్తులు ఆందొళన వ్యక్తం చెశారు. మం గళవారం రాత్రి కురిసిన వర్షానికి కొన్ని పంటలు సైతం ద్వం సం అయ్యయాని, మండలంలో 6.14సె.మి. వర్షం పాతం నమోదు అయిందని తహసీల్దార్ రాములు తెలిపారు.