జాతీయం

పాకిస్తాన్లో బుధవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 152 మంది మృతి చెందారు. పాకిస్తాన్లోని ప్రయివేట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కరాచీలో బుధవారం ఉదయం 7.45 గంటలకు బయల్దేరింది. ఇస్లామాబాద్కు రెండు గంటల ప్రయాణం. ఇస్లామాబాద్ శివారు పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 100కు పైగా మృతదేహాలను ఇప్పటివరకు వెలికితీశారు. భారీ వర్షం, పొగమంచుతో మార్గం కన్పించక దామనేఖో ప్రాంతంలో వున్న మార్గల్లా పర్వతాన్ని విమానం ఢకొీన్నదని పోలీసులు, సహాయ కార్యకర్తలు చెప్పారు. సగం కాలిన మృతదేహాలు పర్వత సానువుల్లో చెల్లాచెదురుగా పడివున్నాయని, భారీ వర్షం, మంచు కారణంగా విమాన శిధిలాలు, మృతదేహాలను వెలికితీయడం కష్టంగా మారింది. ప్రమాదానికి ముందు నగరంలో అతి తక్కువ ఎత్తులో ఎగిరిన విమానాన్ని తాము చూసినట్లు స్థానికులు మీడియాకు వివరించారు. గాయాలతో బయటపడిన వారి కోసం తాము వెతకగా ఎవరూ కనిపించలేదని వారు పేర్కొన్నారు. మృతులకు సంతాప సూచకంగా పాకిస్తాన్ ప్రభుత్వం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పాక్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విమానంలో ఉన్నవారందరూ పాకీస్తానీయులేనని అధికారులు తెలియచేశారు. ప్రమాదానికి కారణం ఇంత వరకూ తెలియలేదు. కొంతమంది ప్రతికూల వాతావరణమే కారణమంటున్నారు. ప్రమాదాన్ని చూసిన కొంతమంది స్థానికులు విమానం బ్యాలన్స్ తప్పి కిందకి పడిపోయినట్లు కనపడిందని తెలిపారు. విమానం దిగవల్సిన సమయానికి కంట్రోల్ టవర్తో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు.

రాష్ర్ట నాయకులు అఖిల పక్షంగా వెళ్ళి కేంద్రం మెడలు వంచి బాబ్లీపై రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయన్ని ఆపుతారని అనుకున్న రాష్ర్ట ప్రజలకు మరోసారి అవమానం ఎదురైంది.. అఖిల పక్షంగా వెళ్ళిన రాష్ర్ట పెద్దన్నలు ప్రధాని ముందు పేద అరుపులు అరవడానికే సరిపోయింది.. అయితే పేద అరుపులు విన్న ప్రధాని చాలా రిలాక్స్గా నాకు సాంకేతిక సమస్యలు తెలియవు తెలుసుకుంటానని తెలపడం అత్యంత హాస్యా స్పదం. రెండు రాష్ర్టాల మధ్య ఇంత పెద్ద ఎత్తున జల వివాదం తలెత్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట ప్రదాన ప్రతి పక్ష నేత మహారాష్ర్ట అరెస్టు, లాఠీ చార్జి జరిగిన తరువాత కూడా ఇంకా ప్రధాని సాంకేతిక సమస్యలు తెలియవని కుంటి సాకులతో సమాధానం ఇవ్వడం ఎంతో హాస్యస్పాదం. దీన్ని బట్టి కేంద్రం ఆంధ్ర ప్రదేశ్పై ప్రభుత్వానికి ఎంత చిత్తశుధ్ది వుందనేది ఇట్టే అర్థం మవుతుంది.. అయితే మన పెద్దన్నలు ఈ విషయాన్ని ఎక్కడ కనపడకుండా మీడియా ముందు చంకలు గుద్దుకున్నారు. వారి మాటల్లో.. “ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బాబ్లీ సమస్యను సావధానంగా విన్నారు. సమస్య పరిష్కారానికి ఆయన చిత్తశుద్ధితో కృషి చేస్తారనే విశ్వాసం నాకుంది” – ముఖ్యమంత్రి రోశయ్య
బాబ్లీపై కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రధాని నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. కార్యాచరణ ప్రకటించలేదు. – చంద్రబాబు, తెలుగుదేశం
బాబ్లీ సమస్యను ప్రధాని సీరియస్గా తీసుకున్నారు. ఆయనతో సమావేశం సంతృప్తికరంగా జరిగింది. – చిరంజీవి, ప్రజారాజ్యం
బాబ్లీని రాజకీయంగానే పరిష్కరించాలని ప్రధానిని కోరాం. ప్రధాని స్పందించిన తీరు అసంతృప్తి కలిగించింది. – నారాయణ, సీపీఐ
కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై చట్టబద్ధ సంస్థ ఏర్పాటు చేయాలని కోరాం. దీనిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. – వినోద్ కుమార్, టీఆర్ఎస్
ప్రధానికి సమస్య తీవ్రత అర్థమైంది. సమాఖ్య వ్యవస్థలో ఏ ప్రధానీ ఒక్క రోజులో సమస్యను పరిష్కరించలేరు. – జయప్రకాశ్ నారాయణ్, లోక్సత్తా
బాబ్లీ ప్రాజెక్టుపై కేంద్రం ముందు అఖిలపక్షం ఒకే మాట వినిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అమర్చిన బాబ్లీ గేట్లను బద్దలు కొట్టాలని కోరింది. మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోవాలని మొరపెట్టుకుంది. దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని మన్మోహన్ దృష్టికి తెచ్చింది.
సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని, వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని విన్నవించింది. బాబ్లీపై ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు సోమవారం ప్రధాని మన్మోహన్ను కలిశారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ, 13 ఇతర ప్రాజెక్టులను నిలిపివేయకపోతే… ఉత్తర తెలంగాణలో లక్షలాది ఎకరాలు ఎడారిగా మారతాయని తెలిపారు.
మహారాష్ట్ర అక్రమాలను వివరిస్తూ 14 పేజీల వినతి పత్రాన్ని ప్రధానికి సమర్పించారు. “సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టుకు గేట్లు అమర్చింది. ఎలాంటిఅనుమతులు లేకుండానే గోదావరి 13 ఇతర ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
ఇలాంటి అక్రమాలు అడ్డుకోవాలన్నా, భవిష్యత్తులో నీటి యుద్ధాలు జరగకుండా ఉండాలన్నా ఒక బలమైన రాజ్యాంగబద్ధమైన నియంత్రణ సంస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాలి” అని వినతిపత్రంలో కోరారు. కృష్ణా, గోదావరి నదులకు అత్యంత దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ జల ప్రయోజనాలను కాపాడేందుకు వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు.
ముఖ్యమంత్రితోపాటు తొమ్మిది పార్టీల నేతలు మహారాష్ట్ర వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజ్యాంగానికి అతీతమైనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో తామేమీ చేయలేమంటూ కేంద్ర జలవనరుల మంత్రి పవన్ కుమార్ బన్సల్ వ్యాఖ్యానించడం సరి కాదని రోశయ్య ప్రధానికి ఫిర్యాదు చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తున్న విషయాన్ని నేతలు ప్రధాని దృష్టికి తెచ్చారు. అయితే… ప్రధానమంత్రి నుంచి ఈ విషయంలో నిర్దిష్టమైన హామీ ఏమీ లభించలేదు. ఈ విషయంలో సాంకేతికాంశాలపై కేంద్ర జల సంఘం, జల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు.
“సమాఖ్య వ్యవస్థలో చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమే. నన్ను ఆలోచించుకోనివ్వండి” అని కోరారు. ప్రధాని హామీ పట్ల ముఖ్యమంత్రితోపాటు మరికొందరు ప్రతిపక్ష నేతలు విశ్వాసం ప్రకటించారు. అయితే… సమస్య పరిష్కారానికి నిర్ణీత కాలపరిమితిని చెప్పకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబుతీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఆయన అన్నారు.
ప్రధాని నిర్దిష్టమైన హామీ ఇవ్వనప్పటికీ ఆయన స మస్యను సానుకూలంగా విన్నారని, పరిష్కారం కోసం వేచి చూడడం మంచిదని ఇతర పార్టీ నేతలు చెప్పారు. ప్రధాని నివాసంలో సుమారు 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ప్రధానితో భేటీ తర్వాత నేతలు విలేఖరులతో మాట్లాడారు. తా ము చెప్పి విషయాలు ప్రధాని సావధానంగా విన్నారని దాదా పు అందరు నేతలు చెప్పారు.

పశ్చిమ బెంగాల్లో జార్ఖండ్ రాష్ట్ర సరిహద్దుకు దగ్గర్లో ఉన్న సైంధియా రైల్వే స్టేషన్ వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 67 మందికి పైగా చనిపోగా, మరో 150 మంది దాకా గాయపడ్డారు. బీర్భమ్ జిల్లా సైంధియా రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న వనాంచల్ ఎక్స్ప్రెస్ను వేగంగా వచ్చిన ఉత్తరబంగ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ‘మానవ తప్పిదం’ ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న వర్గాలు ప్రాథమికంగా అభిప్రాయ పడుతున్నాయి. స్టేషన్ సమీపించినప్పటికీ ఉత్తరబంగ ఎక్స్ప్రెస్ డ్రైవర్ వేగం తగ్గించలేదని, అదే వేగంతో నాలుగో ప్లాట్ఫామ్నుంచి బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న వనాంచల్ ఎక్స్ప్రెస్ను వెనకవైపునుంచి వేగంగా ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్టేషన్ సమీపంలోని కీలకమైన సిగ్నల్ను ఉత్తర బంగ ఎక్స్ప్రెస్ డ్రైవర్ గమనించలేదని తెలుస్తోంది. రైలును ఆపాలంటూ తాము అరిచినప్పటికీ లాభం లేకపోయిందని, డ్రైవర్ చాలా వేగంగా వస్తుండడంతో హ్యాండ్ బ్రేక్ వేయడానికి కూడా సమయం లేకపోయిందని వారు చెప్పారు. మృతి చెందిన వారిలో రెండు రైళ్ల డ్రైవర్లు, వనాంచల్ ఎక్స్ప్రెస్ గార్డు కూడా ఉన్నారు.
ఉత్తరబంగ ఎక్స్ప్రెస్ ఎంత తీవ్రంగా ఢీకొట్టిందంటే రెండు అన్ రిజర్వ్డ్ బోగీలతో ససా వనాంచల్ ఎక్స్ప్రెస్కు చెందిన మూడు బోగీలు తునాతునకలై పోగా, ఉత్తరబంగ ఎక్స్ప్రెస్కు చెందిన రెండు బోగీలు పైకెగిరి పాదచారులకోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జిపైన పడ్డాయి. ఒక బోగీలో కొంతభాగమైతే విడిపోయి బ్రిడ్జిని ఢీకొట్టిన తర్వాత రైలు పట్టాలకు పక్కనే ఉన్న రోడ్డుపై పడిపోయింది. సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకునేందుకు సైన్యాన్ని, బిఎస్ఎఫ్ జవాన్లను రంగంలోకి దింపినట్లు చెప్పిన రైల్వే అడిషనల్ డిజిపిడిటిపి మిత్రా చెప్తూ, మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అన్నారు. గ్యాస్ కట్టర్లు ఉపయోగించి బోగీల్లో చిక్కుకుపోయిన 32 మృత దేహాలను వెలికి తీసారు. దగ్గర్లో ఉన్న గ్రామాల ప్రజలు ముందుగా ప్రయాణికులను కాపాడడానికి ప్రయత్నించారు. ప్రమాదం జరిగినప్పుడు రెండు రైళ్లలోని చాలామంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్నారు. సురి జిల్లా ఆస్పత్రి, సైంధియా ఆస్పత్రుల్లో చేర్చిన క్షతగాత్రుల్లో 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, బుర్ద్వాన్ మెడికల్ కాలేజి ఆస్పత్రినుంచి 150 బాటిళ్ల రక్తాన్ని తెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్థానికులు సైతం పెద్ద సంఖ్యలో రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు.
ఎక్స్గ్రేషియా ప్రకటించిన మమత
కాగా, ప్రమాద స్థలాన్ని సందర్శించిన రైల్వే మంత్రి మమతా బెనర్జీ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ప్రమాదం వెనుక కుట్ర ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసారు. ‘మా మనస్సుల్లో కొన్ని అనుమానాలున్నాయి. సమాచారం కోసం అనే్వషిస్తున్నాం, ముందు ప్రమాదం వివరాలు తెలియనివ్వండి’ అని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్లో రెండు నెలల్లో రెండు ఘోరప్రమాదాలు జరగడం తమకు ఎంతో బాధకలిగిస్తోందని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు తలా 5 లక్షలు, గాయపడిన వారికి 25 వేల రూపాయల ఎక్స్గ్రేషియాను ఆమె ప్రకటించారు. మమత వెంట స్థానిక ఎంపి శతాబ్ది రాయ్ కూడా ఉన్నారు. కాగా, తూర్పు రైల్వే జనరల్ మేనేజర్ విజయ్ నారాయణ్ త్రిపాఠీ, రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ ఆర్పి యాదవ్, ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలపై విచారణ జరుపుతున్నారు. కాగా, ప్రయాణికులకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలియజేయడానికి హౌరా, సీల్డా రైల్వే స్టేషన్లలో రెండు ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసారు. ప్రమాదం కారణంగా హౌరా వెళ్లాల్సిన కాంచన్జంగ ఎక్స్ప్రెస్, సీల్డా వెళ్లే డార్జిలింగ్ మెయిల్ సహా కొన్ని రైళ్లను దారి మళ్లించగా, మరి కొన్ని రైళ్లను రద్దు చేసారు.

బాబ్లీపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఇతర ఎమ్మెల్యేలను అరెస్టు చేసి, జైలుకు పంపించడంపై రాష్ట్రం భగ్గుమంది. టీడీపీ, రైతుసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు భారీ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సీఎం రోశయ్య దిష్టిబొమ్మలు దగ్థం చేశారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలుగుజాతి పరువును కాంగ్రెస్ మరోసారి మంటకలిపిం దని దుయ్యబట్టారు. వరంగల్లో కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యాన రాస్తారోకో నిర్వహించారు.

గుంటూరులో ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి ఆధ్వర్యా న రైల్రోకో నిర్వహించారు. సచివాలయం ముట్టడికి నగర పార్టీ సీనియర్ నేత, బల్దియా ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన కార్యకర్తలు ప్రయత్నించారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసం వద్ద ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీశైలం ఆధ్వర్యాన 100 మంది కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.


ఇదిలాఉండగా, సోమవారం రాష్ట్ర బందుకు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం సాయంత్రం బాబు సీనియర్లతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు నేతృత్వంలో సీనియర్లు భేటీ అయి వ్యూహరచన చేశారు. బాబును జైలుకు పంపిస్తే కార్యాచరణ ఏవిధంగా ఉండాలన్న అంశంపై చర్చించారు. తర్వాత యనమల బాబుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా నేతలతో యనమల మాట్లాడి, కార్యాచర ణపై సూచనలిచ్చారు. ఎంపీ మైసూరారెడ్డి, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, నాగం, చంద్రశేఖర్, చిక్కాల రామచంద్రరావు, విజయరామారావు, వర్ల రామయ్య, టిడి జనార్దన్రావు తదితరులు సమావేశమయ్యారు.
సచివాలయం వద్ద ఆందోళన
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు శనివారం సచివాలయాన్ని మట్టిడించారు.బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఓదార్పుయాత్రలు కాదు బాబ్లీయాత్ర చేపట్టాలి, సీపీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.బాబ్లీప్రాజెక్టు నిర్మాణపనులు ఆపలేని చేతకాని ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలని డిమాండ్ చేస్తూ మధాహ్నం మూడన్నర గంటలకు సచివాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.పోలీసులు వెంటనే రంగప్రవేశంచేసి వారి అరెస్టు చేసి సమీపంలోని పోలీస్టేషన్కు తరలించారు.ఈ సందర్భంగా పోలీసులు సచివాలయ ప్రాంతంలో గట్టి భధ్రతా చర్యలు చేపట్టారు. సచివాలయానికి వచ్చే మీడి యా ప్రతినిధుల గుర్తింపు కార్డును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే వారిని లోపలకు అనుమతించారు.

ఆందోళనలను ఉధృతం చేస్తాం : కడియం
గోదావరి నదిపై బాబ్లీతో సహా నిర్మిస్తున్న 12 అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే ఆపకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కడియం శ్రీహరి హెచ్చరించారు. నేతల అరెస్టును నిరసిస్తూ శనివారం రాష్ర్ట వ్యాప్తంగా శనివారం రాస్తారోకో లు ధర్నాలు జరిగాయి.
కరీంనగర్లో రెండవ రోజు వెల్లువెత్తిన నిరసనలు
చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు చేపట్టారు. పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించడంతో ట్రాఫిక్తీవ్ర అంతరాయం ఏర్పడింది. జిల్లా కేంద్రంతో పాటు అనేక చోట్ల మహారాష్ట్ర సిఎం అశోక్సింగ్ చవాన్ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబ్లీని చూపి స్తామని చెప్పి వాళ్ల సరిహద్దుకు చేరగానే అరెస్టు చేసినట్లు ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టు అయిన నేతలకు సరైన సౌకర్యాలు సైతం కల్పించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు కేవలం కాంగ్రెస్ నాయకుల అసమర్థత వలన, అవినీతి సామ్రాట్ వైఎస్. రాజశేఖరరెడ్డి చలవ, ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య ఉదాసీనతతోనే రూపుదిద్దుకున్నాయన్నాయన్నారు. ఈ అక్రమ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రైతుల చెందిన భూములు దాదాపు 18లక్షల ఎకరాలకు సాగు నీరు అందే పరిస్థితి లేదని, ఇది రాజస్థాన్లోని ఎడారిగా మారే పరిస్థితి ఇంకా ఎంతో దూరంలో లేదన్నారు. ఇది చారిత్రక తప్పిద అవుతుందన్నారు.
భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు


బాబు అరెస్టును నిరసిస్తూ శనివారం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. మహారాష్ర్ట ముఖ్యమం త్రి అశోక్ చౌహాన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీల దిష్టిబొమ్మలను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. కర్నూలులో జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి రాంభూపాల్చౌదరి, ధనారెడ్డిల ఆధ్వర్యంలో, కల్లూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో, ఆళ్లగడ్డలో ఇరిగెల సోదరులు, నందికొట్కూరులో బిచ్చన్న, ఆత్మకూరు లో బుడ్డా రాజశేఖర్రెడ్డిల ఆధ్వర్యంలో, నంద్యాలలో స్థానిక నాయకులు, ఎమ్మిగనూరులో బివి వర్గీయులు, డోన్లో కెయి వర్గీయుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆదోని, పత్తికొండ ప్రాంతాల్లో నూ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.
దేశం ధర్నా
మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబును మోసపూరితంగా అరెస్టు చేసిందని వెంటనే ఆయనను విడుదల చేసి చంద్రబాబును బాబ్లీ ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండు చేస్తూ హిందూపురం పార్లమెంటు సభ్యులు నిమ్మలక్రిష్టప్ప ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో తెలుగు దేశం నాయకులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక చంద్రశేఖర్ థియేటర్ నుండి బయలుదేరి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు.

బాబ్లీ ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు, ఇతర టిడిపి నేతలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడంపై ఏమిచేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలంటూ తెలుగుదేశం సీనియర్ శాసనసభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పేలా డిమాండ్ చేయాలని వారు రోశయ్యను కోరారు. కాగా, సంఘటన పూర్వాపరాలను వివరించేందుకు ముఖ్యమంత్రి రోశయ్య శనివారం రాత్రి గవర్నర్ను కలుసుకున్నారు.
బాబ్లీ సందర్శనకు వెళ్లిన వారిని అక్రమంగా అరెస్టు చేశారని, బాబ్లీ ప్రాజెక్టును చూపిస్తామని నమ్మించి మోసపూరితంగా అరెస్టు చేశారని తెలుగుదేశం సభ్యులు నాగం జనార్దన్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, గాలి ముద్దు కృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పి.చంద్రశేఖర్, తదితరులు ముఖ్యమంత్రికి వివరించారు. ముందుగా సచివాలయంలోని సమత బ్లాక్కు చేరుకున్న దాదాపు ఇరవై మంది నేతలు నేలపై బైఠాయించి నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి డౌన్డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మహారాష్ట్ర వైఖరిని ఎండగట్టాలని డిమాండ్ చేశారు. అక్కడి అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని అన్నారు. ఈ దశలో ముఖ్యమంత్రితో నేరుగా ఫోన్లో మాట్లాడిన నాగం జనార్దన్రెడ్డికి రోశయ్య నుండి ఆహ్వానం లభించడంతో వారంతా ఆయన ఛాంబర్కు చేరుకుని మహారాష్ట్ర ప్రభుత్వం వైఖరిని వివరించారు. ముఖ్యమంత్రి రోశయ్య ఈ అంశంపై తన నిరసన తెలియజేయాలని, చవాన్ క్షమాపణ చెప్పేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేస్తూ సారీ చెప్పినట్లు తరువాత తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
కాగా, దేశం నేతలు కలిసిన తరువాత ముఖ్యమంత్రి నేరుగా రాజ్భవన్ చేరుకుని గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ను కలుసుకున్నారు. బాబ్లీ యాత్రకు వెళ్తానని చంద్రబాబు చెప్పినప్పటి నుండి జరిగిన పరిణామాలను గవర్నర్కు వివరించారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ తనతో మాట్లాడుతూ చంద్రబాబు బాబ్లీ యాత్ర రద్దు చేసుకోకపోతే ఉద్రిక్తతలు నెలకొంటాయని, యాత్ర రద్దు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరిన విషయాన్ని, తరువాత బాబుతో తాను ఇదే విషయాన్ని ప్రస్తావించి యాత్ర విరమించుకోవాలని కోరిన విషయాన్ని రోశయ్య గవర్నర్కు వివరించారు. అంతేకాకుండా 23వ తేదీన ప్రధానమంత్రిని బాబ్లీ అంశంపై కలిసేందుకు అఖిలపక్షం వెళ్లనున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఇలా ఉండగా, బాబు విషయంలో ఏమి చేయాలన్న అంశంలో ప్రభుత్వంలో తర్జన భర్జన వీడడంలేదు. వద్దన్నా వినకుండా వెళ్లిన చంద్రబాబు, అటు వస్తే ఒప్పుకోమని ముందే స్పష్టం చేసిన మహారాష్ట్ర సర్కారు నిర్ణయాల వల్ల ఏవిధంగా ముందుకు సాగాలన్న కోణంలో తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి రోశయ్య సహచర మంత్రులు, అధికారులతో చర్చించినట్లు సమాచారం. కొంతమంది పోలీసు అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా బాబ్లీ వద్ద జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి సమీక్షించినట్లు తెలిసింది.
ఇలా ఉండగా, 23న అఖిలపక్షం ప్రధానిమంత్రిని కలిసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో బాబ్లీ వెళ్లిన బాబు విధానం సరికాదని కొంతమంది మంత్రులు అభిప్రాయపడుతున్నారు. అరెస్టయిన చంద్రబాబు బెయిల్ కూడా వద్దని మొండికేస్తుంటే ఇక ప్రభుత్వం కూడా ఏమి చేయగలదని నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఆయనను విడిపిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని, అయితే ఆయన కూడా మొండికేయకుండా సహకరించాల్సి ఉంటుందని అన్నారు. కాగా, చంద్రబాబు అరెస్టు అన్నది మహారాష్టక్రు సంబంధించిన శాంతిభద్రతల సమస్య అని దీనిపై రాష్ట్ర పోలీసులు చేసేందుకు ఏమీ ఉండదని అదనపు డిజి స్థాయి అధికారి ఒకరు స్పష్టం చేశారు. కేవలం బెయిల్ తీసుకుని రావాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

చెప్పేది ఒకటి..చేసేది మరొకటి…బాబ్లీ నిర్మాణంలో మొదటి నుండి మహారాష్ట్ర సర్కార్ది ఇదే వైఖరి. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలం నుండి బ్యారేజికి గేట్లు పెట్టేంత వరకు ఈ విధానాన్నే మహారాష్ట్ర ప్రభుత్వం అమలుచేసింది. ప్రాజెక్టు చూపిస్తామంటూ తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేయడంలో చూపించిన వంచనాశిల్పాన్నే ఆ రాష్ట్రం మొదటి నుండి అవలంబిం చింది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వాల వట్టి చేతలు తోడయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 2005లో ‘అక్కడా మన ప్రభుత్వం వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక పూర్తి చేసి తీరుతాం’ అని బాబ్లీ వద్ద జరిగిన సభలో మహారాష్ట్రకు చెందిన ఎంపీ ఒకరు ప్రకటించారు. ప్రకటించినట్లుగానే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి గేట్లు కూడా పెట్టేశారు. ఫలితం గలగల పరిగెత్తే గోదారికి బ్రేక్ పడింది. ఉత్తర తెలంగాణా జిల్లాలకు సాగునీరు ప్రశ్నార్థకమైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పి) ఉన్నా ఉపయోగపడని ప్రమాదం ఏర్పడింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునే పనిలో రాష్ట్ర పాలకవర్గాలు నిమగమయ్యాయి.
జలాశయంలో ప్రాజెక్టు …!
ఎస్ఆర్ఎస్పి జలాశయంలోనే బాబ్లీ ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఒక ప్రాజెక్టు జలాశయంలోనే మరో ప్రాజెక్టును నిర్మించడం సాగునీటి రంగంలోనే దాదాపుగా లేదని చెబుతున్నారు. ఈ స్థలాన్ని ఎంపిక చేయడమే 6.10.1975న రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందానికి విరుద్దం. ఈ ఒప్పందం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో 112 టిఎంసీల సామర్థ్యంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా మహారాష్ట్రలో సైతం విస్తరించే ఎస్ఆర్ఎస్పి జలాశయం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టపరిహారం సైతం చెల్లించింది. అంటే ఒక రకంగా ఆ ప్రాంతంపై మహారాష్ట్రకు ఎటువంటీ హక్కు లేనట్టే! అలా నష్టపరిహారం తీసుకుని, ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్గా ఉన్న ప్రాంతంలోనే బాబ్లీ నిర్మాణాన్ని చేపట్టి తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది. దీంతో సాధారణ ప్రవాహాన్ని దిగువకు వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు, ఎస్ఆర్ఎస్పిలో చేరిన నీటిని వినియోగించుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం దక్కింది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే నీరు దిగువకు రావడం సంగతి అలా ఉంచి ఎస్ఆర్ఎస్పిలో నీరు ఆ ప్రాజెక్టులోకి చేరనుంది. ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్లో నిర్మించడంతో పాటు, దాని ఎఫ్ఆర్ఎల్ లెవల్కన్నా తక్కువ స్థాయికి బాబ్లీని నిర్మించడమే దీనికి కారణం. ఎస్ఆర్ఎస్పిలో 30 టిఎంసీల నీరు చేరితే బాబ్లీ ప్రాజెక్టు కూడా నిండుతుంది. దీంతో పేరుకు 2.74 టిఎంసీల నీటి సామర్థ్యంతో బాబ్లీని నిర్మించినప్పటికీ ఎస్ఆర్ఎస్పి నుండి ఎన్ని టింఎసీల నీటినైనా ఆ రాష్ట్రం వినియోగించుకునే అవకాశం ఏర్పడింది. ఈ పరిస్థితే రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది,
ఎప్పుడు ప్రారంభం ?
ఇంత వివాదాస్పదమైన ప్రాజెక్టు నిర్మాణంవైపు 1995లోనే మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 10.3.1995న 1092 (35/93) నెంబర్ ఉత్తర్వులతో పాలనాపరమైన అనుమతిని మంజూరు చేసింది. 31.31 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది. 2001వ సంవత్సరం నుండి ప్రాజెక్టు నిర్మాణంపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. 2001 మే నెలలో ప్రాజెక్టు వద్ద భూమి స్థితిగతులకు సంబంధించి పరీక్షలు నిర్వహించింది. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నుండి అవసరమైన అనుమతులు సాధించింది. 26.8.2003న తుది లేఅవుట్కు అనుమతి పొందింది. దీని ఆధారంగా 2003లో టెండర్లు పిలిచింది. 2004 ఆగస్టు తొమ్మిదిన 39.29 కోట్ల రూపాయలతో సోమ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు ప్రాజెక్టు పనులు అప్పగించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2005 జనవరి ఆరున ప్రాజెక్టు పనులను ఆ నిర్మాణ సంస్థ ప్రారంభించి, 2009 సంవత్సరాంతానికి పూర్తి చేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, సిడబ్ల్యుసిలతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించింది.
మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది?
ప్రాజెక్టు పనులు ప్రారంభమైన తరువాత మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం దృష్టి సారించింది. పత్రికల్లో వార్తలు వచ్చిన తరువాత 12.05.2005న ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తొలి లేఖను మహారాష్ట్ర సర్కారుకు రాసింది. ఆ సంవత్సరం మే 25న కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి కలిశారు. 18.6.2005న అన్ని పార్టీలకు చెందిన ఎంపీల బృందం భారీ నీటిపారుదల శాఖమంత్రి నేతృత్వంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి బాబ్లీ నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేశారు.
5.10.2005న, 11.07.2005న జరిగిన సిడబ్ల్యుసి సమావేశాల్లో ఇరురాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరేంతవరకు నిర్మాణాన్ని ఆపాలని మహారాష్ట్రకు సూచించారు. 4.4.2006న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఇదేరకమైన సూచనను చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో 3.7.2006న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. 26.04.07న మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించవచ్చని, అయితే గేట్లు పెట్టకూడదని సుప్రీం ఆదేశించింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా సొంత బాధ్యతతోనే చేపట్టాలని, తుది తీర్పునకు లోబడి ఉండాలని మధ్యంతర ఉత్తర్వుల్లో అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ ఆదేశాలకు కోర్టులో తలూపిన మహారాష్ట్ర సర్కార్ గుట్ట చప్పుడు కాకుండా గేట్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 3.7.2009 కోర్టు ధిక్కార పిటిషన్ను దాఖలు చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆ రెండు పిటిషన్లను కలిపి విచారిస్తోంది. ప్రాజెక్టు వద్ద వాస్తవపరిస్థితిని నిర్ధారించేందుకు నిపుణుల బృందాన్ని పంపాలని 21.06.2010న సిడబ్ల్యుసిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై కేంద్ర జలవనరుల శాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టులో వాజ్యాలు నడుస్తుండగానే ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకుంది. ప్రస్తుత దశలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు మినహా మరో మార్గం లేదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

అంతర్ రాష్ట్ర సరిహద్దుల పై ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు పరస్పర అవగాహనకు వస్తేనే, వాటి మధ్య గనుల వివాదం పరిష్కారం అ వుతుందని, అంతవరకూ తామే చేసేదేమీ లేదని స ర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ఉభయ రా ష్ట్రాల గనుల వివాదంపై చేతులెత్తేసింది. ఉభయ రా ష్ట్రాలు సరిహద్దులపై పరస్పరం ఒక అంగీకారానికి వచ్చి, వాటిని స్పష్టంగా నిర్ధారించుకునేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును ఈ సంస్థ కోరింది. అంతే కా కుండా గనుల లీజుల సరిహద్దుల నిర్ధారణకు వీలు గా లీజు స్కెచ్లను తమకు ఇవ్వాల్సిందని కేంద్ర, రాష్ట్ర సంస్థలను ఆదేశించాలని కూడా అభ్యర్థించిం ది. ఈ రెండు పనులు పూర్తయితే, తాము గనుల స రిహద్దులను నెలరోజుల్లోనే నిర్ణయిస్తామ ని, లేకపోతే ఏమి చేయలేమని తెలిపింది. సర్వే ఆఫ్ ఇండియా 1975లో నిర్ధారించిన అంతర్ రాష్ట్ర సరిహద్దులకు ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలుపనంతవరకు, నిర్ధారిత సమయంలో మైనింగ్ లీజు సరిహ ద్దు వివాదాన్ని పరిష్కరించలేమని స్పష్టం చేసింది. సరిహద్దులు, మైనింగ్ లీజు ప్రాంతాల ఖరారుకు సర్వే ఆఫ్ ఇండియా పలు సూచనలు చేసింది. ఈ మేరకు ఈ సంస్థ నివేదిక సమర్పించడంతో సుప్రీంకోర్టు అటవీ బెంచ్ తన తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి (ఈ నెల 23కు) వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.హెచ్. కపాడియా, అఫ్తాబ్ ఆరా, కె.ఎస్.రాధాకృష్ణన్లతో కూ డిన బెంచ్ ఈ కేసు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, నివేదిక ప్రకారం సుప్రీంకో ర్టు ఆదేశాల మేరకు బళ్లారి అటవీ ప్రాంతంలోని ఆ రు ఇనుప ఖనిజ మై నింగ్ లీజుల సరిహద్దులను ని ర్ధారించి, నిర్ణయించేందుకు గత మార్చి నెలలోనే ఓ బృందం ఏర్పాటయింది.
సర్వే ఆఫ్ ఇండియా అదనపు సర్వేయర్ జనరల్ మేజర్. జనరల్ ఎ.కె.పాధా నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఈ నిపుణుల బృందం ఏర్పాటయింది. ఈ ఉమ్మడి కమిటీ సమర్పించిన నివేదికలో మంజూరైన లీజు స్కెచ్లకూ, లీజు ప్రాంతంలో సరిహద్దు రాళ్లకూ పొంతన లేదని తేలింది. ఈ స్కెచ్లలో తప్పుల తడకలున్నాయని కూడా ఈ కమిటీ అభిప్రాయపడింది.

ఉపఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో ప్రచారం నిర్వహించాలని తెలంగాణా మంత్రులకు ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ వీరప్పమొయిలీ సూచించినట్లు తెలిసింది. లేక్వ్యూగెస్ట్హాస్లో మొయిలీని తెలంగాణా మంత్రులందరూ కలిశారు. ప్రచార సరళిపై చర్చించారు. తెలంగాణా అంశాన్ని స్థానిక నేతలు చూసుకుంటారని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మంత్రులదేనని, దానిని ప్రచారాస్త్రంగా చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది.ఉపఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగైదు స్థానాల్లో అయినా పార్టీ అభ్యర్థులు గెలిచేలా ప్రచారం నిర్వహించాలని అన్నారు. ఈ సందర్భంగా కలిసిన వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె అరుణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా అంశంతో పాటు అభివృద్ధి అంశాన్ని ప్రచారాస్త్రంగా తీసుకెళ్తామని తెలిపారు.
భారత బ్యాడ్మింటన్ సెన్సేషన్ సైనా నెహ్వాల్ ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణిగా అవతరించింది. తాజాగా విడుదలన చేసిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాకింగ్స్లో ఇటీవలి కాలంలో సాధించిన అద్భుతమైన విజయాలతో సైనా రెండో స్థానానికి ఎగబాకింది. ఇండోనేసియన్ ఓపెన్ గెలవకముందు మూడో స్థానంలో ఉన్న సైనా ర్యాంకు, ఆ టోర్నమెంట్లో విజయం తర్వాత రెండో స్థానానికి చేరింది. ఈ ఘనతతో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిగా అవతరించడానికి కేవలం ఒక అడుగు దూరంలోనే సైనా ఉంది. చైనా దేశస్థురాలు యిహన్ వ్యాంగ్ ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా 64791.2637 పాయింట్లు సాధించి సైనా రెండో స్థానాన్ని కైవసం చేసుకొంది మూడో స్థానంలో చైనాకే చెందిన గ్జిన్ వ్యాంగ్ కొనసాగుతోంది.
‘నాకు చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్లో ఇంత త్వరగా ప్రపంచ నెంబర్ టూ క్రీడాకారిణి అవుతానని అనుకోలేదు. నేనాడిన చివరి మూడు టోర్నమెంట్లలో వరుస విజయాలు ఈ స్థానానికి చేరుకోవడానికి నన్ను ఎంతగానో సహాయపడ్డాయి. నాకిది గొప్ప అనుభూతినిస్తుంది. అయినా ర్యాంకింగ్స్పై ధ్యాస పెట్టే కన్నా దేశ కోసం మరిన్ని టోర్నమెంట్లను గెలవడమే ఇక ముందు కూడా నా ప్రాధాన్యతగా ఉంటుంది.’ అని సైనా తన ఆనందాన్ని పంచుకుంది.
ర్యాంకింగ్స్లను ఆపుకోవడం కష్టమైన పని అయినా, ఇంకా బాగా కష్టపడి మరిన్ని టైటిళ్లు గెలిచి, త్వరలోనే ప్రపంచ నెంబరు వన్ క్రీడాకారిణి అవడానికి కృషి చేస్తానని ప్రస్తుతం జలుబు, జ్వరం బాధపడుతున్న సైనా పేర్కొంది. తన కూతురు ఈ ఘనత సాధించడంతో సైనా తండ్రి హర్వీర్ సింగ్ అనందానికి అవధుల్లేకుండాపోయింది. సైనా సాధించిన ఘనతపై సంతోషాన్ని ఆయన వ్యక్తపరుస్తూ, దేశంకోసం ఇంకా మరెన్నో విజయాలు సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తంచేసారు. గత మార్చిలో ప్రతిష్ఠాత్మక అల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో సెమీ ఫైనల్స్చేరి ప్రపంచ ఐదో ర్యాంకు క్రీడాకారిణిగా అవతరించిన సైనా, ఆ తర్వాత ఆరో స్థానానికి పడిపోయింది.
ఇక సైనా భవిష్యత్తులో ఆడబోయే టోర్నమెంట్ల విషయాన్ని ఒకసారి చూసినట్లయితే వచ్చే నెల ప్యారిస్లో జరుగనున్న ప్రతిష్థాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సైనా దేశం తరపున పాల్గొననుంది. ఆ తర్వాత అక్టోబరులో స్వదేశంలోనే జరిగే కామన్వెల్త్ క్రీడలతో పాటు ఎషియన్ గేమ్స్లలో సైనా పాల్గొంటుంది.
15 వ స్థానంలో కొనసాగుతున్న చేతన్ ఆనంద్
తాజాగా విడుదల చేసిన బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో పురుషుల విభాగంలో హైదరాబాదీ ఆటగాడు చేతన్ ఆనంద్ 15 వ స్థానంలో కొనసాగుతున్నాడు.ఇతర భారత క్రీడాకారుల్లో అనంద్ పీ. కశ్యప్, అరవింద్ భట్లు వరుసగా 25, 27 ర్యాంకుల్ని సాధించారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత జంట జ్వాల గుత్త, వీ దిజులు స్థానంలో ఎటువంటి మార్పులేదు. ఈ ఇద్దరు ప్రస్తుతం ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు.

మన రూపాయి ఇక అంతర్జాతీయ స్థాయిలో కొత్త సొబగులు సంతరించుకోనుంది. రూపాయి చిహ్నాన్ని మార్చాలని ఇప్పటి వరకూ మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఐఐటి పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థి డి ఉదయకుమార్ రూపొందించిన కొత్త నమూనాను ఆమోదిం చింది. ఈ చిహ్నం ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల బృందం ఐదు చిహ్నాలను ఎంపిక చేసి మంత్రివర్గ ఆమోదానికి పంపగా అందులో ఉదరు కుమార్ రూపొందించిన చిహ్నానికి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త చిహ్నంలో దేవనాగరి లిపిలో ‘ర’ అనే అక్షరం, రోమన్ అక్షరం కేపిటల్ ‘ఆర్’ (మధ్య కొమ్ము లేకుండా) ఉంటాయి. ఈ చిహ్నం రూపకల్పన కోసం ఆర్థిక మంత్రిత్వశాఖ రూ.2.5 లక్షల ప్రైజ్మనీతో పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. తాను రూపొందించిన డిజైన్కు కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర లభించిందన్న విషయాన్ని తెలుసుకున్న ఉదరుకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన గౌహతి ఐఐటిలో డిజైన్ విభాగంలో ఫ్యాకల్టీ సభ్యునిగా శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.