జాతీయం

బెంగళూరునూ ముంచారు


చెలరేగిన స్టెయిన్‌, రాణించిన డుమినీ చార్జర్స్‌ గెలుపు, చాలెంజర్స్‌ ఇంటికి
మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ స్టెయిన్‌ 3/8
ఐపిఎల్‌-5లో ఇప్పటికే రాజస్థాన్‌ రాయల్స్‌ను ప్లేఆఫ్‌కు దూరం చేసిన డెక్కన్‌ చార్జర్స్‌ ఈసారి బెంగళూరును కూడా బయటకు పంపించింది. ఆదివారం ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చార్జర్స్‌ 9 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చార్జర్స్‌ 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. బ్యాటింగ్‌ వైఫల్యం బెంగళూరును వెంటాడింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైన బెంగళూరు ప్లేఆఫ్‌ రేసు నుంచి వైదొలిగింది. చార్జర్స్‌ విజయంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మెరుగైన రన్‌రేట్‌తో నాకౌట్‌కు అర్హత సాధించింది. మరోవైపు బెంగళూరు కూడా 17 పాయింట్లు సాధించినా రన్‌రేట్‌ కారణంగా రేసు నుంచి తప్పుకుంది.
మెరిసినా…
ఊరిస్తున్న లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు డాషింగ్‌ ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ అద్భుత శుభారంభం అందించాడు. స్టెయిన్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో చాలెంజర్స్‌కు మూడు పరుగులే వచ్చాయి. అయితే మన్‌ప్రీత్‌ సింగ్‌ గోనీ వేసిన రెండో ఓవర్‌లో గేల్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ ఓవర్‌లో గేల్‌ మూడు ఫోర్లు, మరో రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో స్టేడియం మొత్తం కేరింతలతో దద్దరిల్లింది. రెండో ఓవర్‌ ముగిసే సమయానికి బెంగళూరు స్కోరు 27 పరుగులు చేరింది. ఇక, గేల్‌ను అడ్డుకోవడమే కష్టమేనా అనిపించింది. అయితే స్టెయిన్‌ మాత్రం పట్టు వీడలేదు. తన మార్క్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించాడు. ఇదే క్రమంలో అద్భుత బంతితో ప్రమాదకర ఆటగాడు గేల్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అంతే.. స్టేడియం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గేల్‌ బ్యాటింగ్‌ విన్యాసాలు చూసేందుకు వచ్చిన అభిమానులు నిట్టూర్చారు. అప్పటివరకు కేరింతలతో హోరెత్తించిన క్రికెట్‌ ప్రేమికులు ఒక్కసారిగా డీలాపడిపోయారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ మరీ నెమ్మదిగా ఆడుతూ విసుగు తెప్పించారు. మెరుపులు మెరిపిస్తారని భావించిన తిలకరత్నే దిల్షాన్‌ (4), ఎబి.డివిలియర్స్‌ (4) కూడా వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. మయాంగ్‌ అగర్వాల్‌ (1) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. చార్జర్స్‌ బౌలర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెన్త్‌తో బౌలింగ్‌ చేయడంతో బెంగళూరుకు పరుగులు రావడమే గగనమై పోయింది. అయితే ఈ దశలో కోహ్లి, సౌరభ్‌ తివారీ కొద్ది సేపు ధాటిగా ఆడి ఆశలు చిగురింప చేశారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి 40 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 42 పరుగులు చేసి ఆశీష్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన కోహ్లి మరోసారి భారీ షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ను సమర్పించుకున్నాడు. తర్వాత బెంగళూరు మళ్లిస కోలుకోలేక పోయింది. స్టెయిన్‌ నాలుగో ఓవర్‌లో జహీర్‌ (0) క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఆ వెంటనే తివారీ 27 బంతుల్లో ఒక ఫోర్‌, సిక్స్‌తో 30 పరుగులు కూడా ఔటయ్యాడు. చివర్లో ఆశీష్‌ రెడ్డి మరో రెండు వికెట్లు పడగొట్టాడు. మిశ్రా, ప్రతాప్‌ సింగ్‌ కూడా మెరుగైన బౌలింగ్‌ కనబరచడంతో బెంగళూరు లక్ష్యాన్ని అందుకోలేక పోయింది. చార్జర్స్‌ బౌలర్లలో స్టెయిన్‌ 4 ఓవర్లో 8 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మిశ్రాకు రెండు, ఆశీష్‌కు మూడు వికెట్లు దక్కాయి. స్టెయిన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
ఆదుకున్న డుమినీ…
అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన డెక్కన్‌ చార్జర్స్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఫాంలో ఉన్న శిఖర్‌ ధావన్‌ ఐదు పరుగులు మాత్రమే చేసి జహీర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కొద్ది సేపటికే అక్షత్‌ రెడ్డి (7) కూడా పెవిలియన్‌ చేరాడు. ఆ వెంటనే కామెరూన్‌ వైట్‌ (1) కూడా వెనుదిరిగాడు. దీంతో చార్జర్స్‌ 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన డుమినీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తనపై వేసుకున్నాడు. అతనికి కెప్టెన్‌ సంగక్కర అండగా నిలిచాడు. ఇద్దరూ సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అయితే 22 బంతుల్లో ఒక ఫోర్‌తో 15 పరుగులు చేసిన సంగక్కరను మురళీధరన్‌ ఔట్‌ చేశాడు. అయితే పార్థివ్‌ సహకారంతో డుమినీ విజృంభించాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ పరుగుల వరద పారించాడు. చెలరేగి ఆడిన డుమినీ 53 బంతుల్లోనే 4ఫోర్లు, ఐదు సిక్సర్లతో 74 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రద స్కోరును అందించాడు. పార్థివ్‌ పటేల్‌ 16 పరుగులు తనవంతు పాత్ర పోషించాడు. దీంతో చార్జర్స్‌ స్కోరు 132కు చేరింది. బెంగళూరు బౌలర్లలో జహీర్‌ రెండు, వినయ్‌ కుమార్‌ మూడు వికెట్లు పడగొట్టారు.
ప్లే ఆఫ్‌ ఉత్కంఠకు తెర
చెన్నై వర్సెస్‌ ముంబై
ఢిల్లితో కోల్‌కతా ఢీ
ఐపిఎల్‌-5 ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల బెర్త్‌లు ఖరారయ్యాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చార్జర్స్‌ చేతిలో బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ ఓటమి పాలుకావడంతో మెరుగైన రన్‌రేట్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో లీగ్‌ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన ఢిల్లిd డేర్‌డెవిల్స్‌, రెండో స్థానం పొందిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతాయి. ఈ మ్యాచ్‌ పుణలో జరుగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు కూడా మరో చాన్స్‌ ఉంటుంది.
ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టుతో క్వాలిఫయర్‌-2లో ఓడిన జట్టు తలపడుతోంది. ఎలమినేటర్‌ మ్యాచ్‌ బుధవారం బెంగళూరులో జరుగుతుంది. ఇందులో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై-ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడుతాయి. ఇందులో గెలిచే జట్టు క్వాలిఫయర్‌-2లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌ శుక్రవారం చెన్నైలో జరుగుతుంది. ఇందులో విజయం సాధించే జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తోంది. ఫైనల్‌ మే 27న చెన్నైలోనే జరుగనుంది.

షారుఖ్‌పై వేటు?


ఎప్పుడూ సినిమాలతో, వివాదాలతో సావాసం చేసే బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. బుధవారం ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో నైట్‌ రైడర్స్‌ విజయం సాధించారు. దీంతో స్టాండ్స్‌నుంచి గ్రౌండ్‌లోకి వచ్చిన షారుఖ్‌ ఖాన్‌ ప్రజంటేషన్‌ తర్వాత ముంబై అధికారులను, బీసీసీఐ అధికారులనూ, అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం తమపైనా, బీసీసీఐ అధికారులపైనా, ఆఖరికి ఎంసీఏ ప్రెసిడెంట్‌ విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ను కూడా వదలకుండా దుర్భాషలాడాడని ఎంసీఏ సెక్రటరీ నితిన్‌ దలాల్‌ ఆరోపించారు. ఆ సమయంలో షారుఖ్‌ పిచ్చి పిచ్చిగా తాగి ఉన్నాడనికూడా అన్నారు.
ఈ వివాదంపై షారుఖ్‌ మాత్రం పూర్తి వైరుధ్యమైన సామాధానమిస్తున్నాడు. మ్యాచ్‌ అనంతరం తన పిల్లలను ఇంటికి తీసుకెళదామని వచ్చిన తనను అక్కడున్న క్రికెట్‌ అధికారులు తిట్టారని అన్నాడు. వారు చాలా కోపంతో తనపై విరుచుకుపడ్డారని చెప్పాడు. తన పిల్లలను ఎవరో కొట్టారని అందుకు తనకు చాలా కోపం వచ్చిందని షారుఖ్‌ చెప్పాడు. వారు 20-25 మంది అధికారులు తాను ఒకడినే నని అన్నాడు. ఆ సమయంలో తాను తాగి ఉన్నాననేది వారు కల్పించిన కట్టుకథని షారుఖ్‌ ఖాన్‌ అన్నాడు.
షారుఖ్‌ చెప్పేవన్నీ అసత్యమని ఎంసీఏ కార్యదర్శి నితిన్‌ దలాల్‌ అన్నారు. షారుఖ్‌ తమతో అసభ్యపదాలతో విరుచుపడ్డాడని, వాటిని కనీసం బయటకు చెప్పలేని పదజాలమని నితిన్‌ అన్నారు. అతడిపై మెరీన్‌ డ్రైవ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్‌ చేశామని దలాల్‌ తెలిపారు. మరోవైపు ఎంసీఏ కోశాధికారి రవి సావంత్‌ కూడా షారుఖ్‌పై విరుచుకుపడ్డాడు. షారుఖ్‌ ఏం తప్పుచేయకపోతే తామెందుకు పోలీసులకు కంప్లెయింట్‌ చేస్తామని ప్రశ్నించారు. షారుఖ్‌ను స్టేడియంలోకి అనుమతించకుండా లైఫ్‌ బ్యాన్‌ వేయాలని పై అధికారులను కోరతామని సావంత్‌ అన్నారు. షారుఖ్‌ తమను దుర్భాషలాడిన తీరు హేయమని అన్నారు. శుక్రవారం ఉదయం ఓ మీటింగ్‌ను ఏర్పాటు చేసి షారుఖ్‌ విషయం చర్చిస్తామని అన్నారు. దీనిపై ఏంసీఏ ప్రెసిడెంట్‌ విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కూడా అసహనంగా ఉన్నారని ఆయన శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని రవి సావంత్‌ అన్నారు.
తాను మ్యాచ్‌ కోసం వెళ్లలేదని, తన పిల్లలు మ్యాచ్‌ చూసిన అనంతరం ఇంటికి తీసువద్దామని స్టేడియానికి వెళ్లానని షారుఖ్‌ తెలిపాడు. వారు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ను చూసుకుని రెచ్చిపోయారన్నాడు. సెక్యూరిటీ పేరు చెప్పి చిన్న పిల్లలపై చేయిచేసుకోవడం తగదని షారుఖ్‌ తెలిపాడు. షారుఖ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట హాస్యాస్పదంగా ఉందని నితిన్‌ దలాల్‌ అన్నారు. ఇప్పుడు కేసు పోలీస్‌ స్టేషన్‌లో ఉంది. వారు ఎన్‌కై్వరీ నిర్వహించి నిజాలు తేలుస్తారన్నారు. మ్యాచ్‌, ప్రెజంటేషన్‌ ముగిసిన తర్వాత గ్రౌండ్‌లోకి ప్రవేశించడం రూల్స్‌ అతిక్రమించడమే అని, తమ భద్రతా సిబ్బంధి చేసిన పని సబబేనని సెక్రటరీ నితిన్‌ దలాల్‌ అన్నారు. ఏదేమైనా షారుఖ్‌ వరుస వివాదాలతే బ్యాడ్‌ ఇమేజ్‌ను తెచ్చుకుంటున్నాడు. శుక్రవారం జరిగే ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ సమావేశంలో షారుఖ్‌పై వేటు పడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

‘గేల్‌’ విధ్వంసం


ఢిల్లీపై బెంగళూరు గెలుపు
క్రిస్‌గేల్‌ విధ్వంసక సెంచరీతో కదం తొక్కడంతో గురువారం ఢిల్లిస డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 215 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లిస నిర్ణీత ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసి ఓటమి పాలైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరుకు ప్రారంభంలోనే షాక్‌ తగిలింది. దిల్షాన్‌ 10 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. అయితే క్రిస్‌గేల్‌ మరోసారి విశ్వరూపం ప్రదర్శించి జట్టుకు అండగా నిలిచాడు. ఢిల్లిస బౌలర్లను హడలెత్తించిన గేల్‌ 62 బంతుల్లోనే 13 భారీ సిక్సర్లు, మరో ఏడు ఫోర్లతో 128 పరుగులు సాధించాడు. అతని విధ్వంసంతో ఢిల్లిస బౌలర్లు లయతప్పారు. ఫోర్లు, సిక్సర్లతో గేల్‌ స్టేడియం నలుమూలలా పరుగుల వరద పారించాడు. మరోవైపు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 53 బంతుల్లోనే 9ఫోర్లు, ఒక సిక్స్‌తో 73 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. గేల్‌-కోహ్లి రెండో వికెట్‌కు అజేయంగా 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లిస కూడా చివరి వరకు పోరాడింది. చెలరేగి ఆడిన రాస్‌ టేలర్‌ 26 బంతుల్లో 7ఫోర్లు, రెండు సిక్స్‌లతో 55, వేణుగోపాలరావు 24 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్స్‌తో 36 పరుగులు అండగా నిలిచారు. రసెల్‌ కూడా 15 బంతుల్లోనే 3సిక్స్‌లు, ఫోర్‌తో 31 పరుగులు సాధించాడు. అయితే లక్ష్యం మరి పెద్దది కావడంతో 21 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
ఃగేల్‌ః ప్రస్థానం
బంతులు : 62
ఫోర్లు : 7
సిక్సలు : 13
స్ట్రయికరేేట్‌ : 206.45
పరుగులు : 128 (నాటౌట్‌)

ఇక్కడెందుకున్నారు..ప్రచారానికి పొండి!


ఢిల్లీలో కనిపించకండి – ఎంపీలకు సోనియా క్లాస్‌
బిత్తరపోయిన నేతలు
మారుమాటాడకుండా వెనక్కి
శీలంకూ పటేల్‌ చురక
మేడమ్‌తో ఆజాద్‌ భేటీ
‘ఉప’స్థితిపై వివరణ
కిరణ్‌ ‘గొంతు’కు కితాబు
‘ఆరే’స్తారని నివేదన
రాష్ట్రంలో ఏం జరుగుతోందో మీరేం చెప్పనక్కరలేదు… మొత్తం నాకు తెలుసు… అసలు మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? ఎందుకు ఉన్నారు? రాష్ట్రానికి వెళ్లండి… ఎన్నికల ప్రచారంలో పాల్గొనండి… విస్తృతంగా ప్రచారం చేసి అభ్యర్థులను గెలిపించుకుని తీసుకురండి… రాష్ట్ర ఎంపీలతో సోనియాగాంధీ తీవ్ర స్వరంతో అన్నమాటలివి. బిక్కచచ్చిపోయి, నీళ్లు నములుతూ చిరంజీవి, విహెచ్‌, రాయపాటిలు వెనుదిరిగారు. అలాగే, సెంట్రల్‌ హాల్లో అహ్మద్‌ పటేల్‌ను కలిసిన రాజ్యసభ సభ్యుడు జేడీ శీలంకు కూడా దాదాపు ఇదే తరహా క్లాస్‌ ఎదురైంది…
కాంగ్రెస్‌ పార్టీకి అగ్నిపరీక్షగా మారిన శాసనసభ ఉపఎన్నికలలో ఎలాగైనా పరువు నిలబెట్టుకొనే ప్రయత్నం చేయాలని భావిస్తున్న అధిష్టానం రాష్ట్రానికి చెందిన పార్టీ పార్లమెంట్‌ సభ్యులెవరూ ఢిల్లీలో కనిపించరాదని హుకుం జారీచేసింది.
బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నందున తప్పనిసరిగా సభకు హాజరుకావాలని పార్టీ పార్లమెంటరీ విభాగం ఒకవైపు విప్‌ జారీచేసినా ఉపఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారంటూ సాక్షాత్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిలదీస్తుండడంతో ఎంపీలలో అత్యధికులు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ బాటపట్టారు.
బుధవారంనాడు పార్లమెంట్‌ ప్రాంగణంలోని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకొన్న సీనియర్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, వి.హనుమంతరావు, లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావులు రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించే ప్రయత్నం చేసినప్పుడు ‘అసలు మీరు ఇక్కడెందుకున్నారంటూ’ ఆమె ఎదురు ప్రశ్నించడంతో నీళ్లునమలాల్సి వచ్చిందని విశ్వసనీయంగా తెలియవచ్చింది. ‘రాష్ట్రంలోని పరిస్థితులన్నీ నాకు తెలుసు, మీరు వెంటనే రాష్ట్రానికి వెళ్లి ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలలో విస్తృతంగా ప్రచారం చేయండి’ అంటూ సోనియా గాంధీ వ్యాఖ్యానించడంతో వారు మారుమాట లేకుండా అప్పటికప్పుడు విమానాశ్రయానికి బయలుదేరాల్సి వచ్చింది.
అలాగే, రాజ్యసభ సభ్యుడు జె.డి.శీలంకు కూడా పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలులో అధ్యక్షురాలి రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ నుండి ఇలాంటి ప్రశ్నలే ఎదురు కావడంతో పార్లమెంట్‌ అరవయ్యవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారంనాడు పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల గ్రూప్‌ ఫొటో కోసమే తాను ఈరోజు ఢిల్లీ రావాల్సి వచ్చిందని, గురువారం ఉదయమే తాను తిరిగి రాష్ట్రానికి వెళ్తున్నానని చెప్పుకొని బయటపడ్డారు. నిన్నటి వరకూ గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉపఎన్నికల ప్రచారసభల్లో పాల్గొన్నానని ఆయన వివరించడంతో సరే, వెంటనే రాష్ట్రానికి తిరిగివెళ్లమని ఆయన సలహా ఇచ్చారు.
గతవారంలో నరసన్నపేట, పాయకరావుపేట, రామచంద్రాపురం శాసనసభ నియోజక వర్గాలలో ‘ఇందిరా విజయరథం’తో ఎన్నికల ప్రచారం నిర్వహించి వచ్చిన వి.హనుమంతరావు రామచంద్రాపురం నియోజకవర్గంలో తన రోడ్‌షోలకు సంబంధించిన ఛాయాచిత్రాలను అధ్యక్షురాలు సోనియా గాంధీకి చూపించి తాను ఎన్నికల ప్రచారంలోనే ఉన్నానని, మిగిలిన నియోజకవర్గాలలో కూడా ప్రచారాన్ని నిర్వహించేందుకు తిరిగి వెళ్తున్నానని వివరించినట్లు తెలియవచ్చింది. రాజ్యసభ సభ్యుడైన మరో ముఖ్యనేత చిరంజీవి తన రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి స్థానాన్ని నిలబెట్టుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలతో పాటు ఇతర నియోజక వర్గాలలో కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.
ఇటీవల చెన్నైలోని తన వియ్యంకుని నివాసంలో ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో చిరంజీవి నాలుగైదు నిముషాలు మాత్రమే అయినా సోనియా గాంధీతో సమావేశం కావడంతో ఆదాయపు పన్ను శాఖ సోదాలపై తన ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా అధ్యక్షురాలి దృష్టికి తెచ్చి ఉంటారనే అభిప్రాయం పార్టీ వర్గాలలో వ్యక్తమౌతున్నది.
రాష్ట్రానికి చెందిన పార్లమెంట్‌ సభ్యులతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి అయిన కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌ కూడా బుధవారంనాడు సోనియా గాంధీని కలుసుకొని రాష్ట్రంలోని ఉపఎన్నికల గురించి వివరంగా చర్చించినట్లు తెలియవచ్చింది. పార్లమెంట్‌ ప్రాంగణంలోని అధ్యక్షురాలిని కలుసుకొన్న ఆయన ప్రధానంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితులను, జగన్‌ దూకుడును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డితో సహా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఈమద్య కాలంలో గళం పెంచుతున్న అంశాన్ని వివరించినట్లు తెలియవచ్చింది. ఉపఎన్నికలు జరుగుతున్న 18 శాసనసభ నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతున్నదని, అన్నీ సక్రమంగా, అనుకొన్నట్లుగా జరిగితే అయిదారు నియోజకవర్గాలలో జగన్‌ పార్టీ అభ్యర్థులను ఓడించడం సాధ్యమేనని ఆయన అంచనా వేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా, ఉపఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ఎఐసిసి ప్రత్యేక పరిశీలకునిగా నియమితులైన మరో కేంద్ర మంత్రి వాయలార్‌ రవి కూడా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. గురువారంనాడు రాష్ట్ర రాజధానిలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై తాజా పరిస్థితులను సమీక్షించనున్న ఆయన శుక్రవారంనాడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించి కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం చేస్తారని, ఆ మరునాడు గుంటూరు జిల్లాలో ఉపఎన్నికలు జరుగుతున్న పత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాలను సందర్శిస్తారని తెలియవచ్చింది.  పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత గులాంనబీ ఆజాద్‌ కూడా రాష్ట్రానికి వెళ్తారని, మరికొందరు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులకు కూడా రాష్ట్రంలో ఉపఎన్నికల బాధ్యతలను అప్పగించే ఆలోచన ఉందని ఎఐసిసి అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

యడ్డీ ఉక్కిరి బిక్కిరి


కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్‌ యడ్యూరప్ప, ఆయన బంధువుకు బెంగళూరు, షిమోగాలలో ఉన్న నివాసాలపై సిబిఐ బుధవారం దాడులు జరిపింది. దాంతో యడ్యూరప్ప తనకోసం, తన ఇద్దరు కుమారులు, అల్లుడి తరఫున ముందస్తు బెయిళ్లకు దరఖాస్తు చేశారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో యడ్యూరప్ప పాత్రపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ బుధవారం ఆయన, ఆయన కుటుంబ సభ్యుల నివాసాలు, రెండు మైనింగ్‌ కంపెనీలపై దాడులు జరిపింది. మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఒక రోజు తర్వాత సిబిఐ అధికారులు బెంగళూరు, షిమోగా జిల్లాలో యడ్యూరప్ప, ఆయన కుమారులు బివై రాఘవేంద్ర (లోక్‌సభ సభ్యుడు), బివై విజయేంద్ర, అల్లుడు సోహన్‌కుమార్‌ చెందిన ఎనిమిది నివాసాలపై సోదాలు నిర్వహించారు. మైనింగ్‌ లీజ్‌హోల్డర్‌ ఇంటిని సోదాచేయడంతోపాటు బళ్లారిలో జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సౌత్‌వెస్ట్‌ మైనింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ల కార్యాలయాలపై కూడా సిబిఐ దాడులు జరిపిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
గనులు, ఖనిజాల (డెవలప్‌మెంట్‌, రెగ్యులేషన్‌) చట్టం, అవినీతి నిరోధక చట్టంలోని అంశాల ప్రకారమే కాక, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఘాతుకంతో సహా ఐపిసి కింద యడ్యూరప్పపై అభియోగాలు నమోదైన తర్వాత కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ సిబిఐ ఈ దాడులు నిర్వహించింది. తన కుటుంబం నిర్వహిస్తున్న ధార్మిక సంస్థకు వారిచ్చిన విరాళాలకు బదులు రెండు కంపెనీలకు అయాచిత సహాయం చేసినట్టు యడ్యూరప్ప ఆరోపణను ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం ఆరుగంటల 15 నిముషాలకు ప్రారంభమైన ఈ దాడుల్ని హైదరాబాద్‌, బెంగళూర్‌లకు చెందిన సిబిఐ సంయుక్త బృందం నిర్వహిస్తోంది. ఇక్కడి (బెంగళూరు) డాలర్స్‌ కాలనీ, రేస్‌కోర్స్‌ రోడ్‌లోని యడ్యూరప్ప నివాసాలపై సిబిఐ సోదాలు జరిపింది.
సిబిఐ దర్యాప్తునకు ముందు సుప్రీంకోర్టు ఆదేశంపై ఏర్పడిన సాధికారిక కమిటీ తన నివేదిక సమర్పించింది. యడ్యూరప్ప, కార్పొరేట్‌ సంస్థలపై ఆ కమిటీ నివేదికలో అనేక ఆరోపణలు ఉండడంతో సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఇలా ఉండగా, తను ఏ తప్పూ చేయలేదని, ఏ అక్రమ కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని జెఎస్‌డబ్ల్యూ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. ‘న్యాయప్రక్రియపై మాకు పూర్తి విశ్వాసముంది. మాకు రహస్యాలేమీ లేవు. దర్యాప్తు ఏజెన్సీలకు పూర్తిగా సహకరిస్తాం. కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో జెఎస్‌డబ్ల్యూ ఉన్నత ప్రమాణాల్ని పాటిస్తుంది. వాస్తవం చెప్పాలంటే అక్రమ మైనింగ్‌లో మేమూ బాధితులమే’ అని ఆ ప్రకటన వెల్లడించింది.
చాలా బాధపడిన రోజుల్లో ఇదొకటి
తన రాజకీయ జీవితంలో బుధవారం అత్యంత బాధాకరమైన రోజని కర్నాటక మాజీముఖ్యమంత్రి బిఎస్‌ యడ్యూరప్ప పేర్కొన్నారు. తన నివాసాలపై సిబిఐ దాడులు జరపడం గురించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు.‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఎంతో బాధపడిన రోజుల్లో ఈరోజు (బుధవారం) ఒకటి. కొన్ని పత్రాలకోసం బెంగళూరు, షిమోగాలలో నా ఇళ్లపై సిబిఐ అధికారులు దాడులు జరిపారు’ అని 69 ఏళ్ల భారతీయ జనతాపార్టీ నాయకుడు విలేకరులకు చెప్పారు. యడ్యూరప్పపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు జరుపుతోంది. అనేక పత్రాల్ని తీసుకుని సిబిఐ బృందం వెళ్లిపోయిన తర్వాత యడ్యూరప్ప మాట్లాడుతూ -న్యాయవ్యవస్థపట్ల తనకు పూర్తి నమ్మకముందని, దర్యాప్తులో ఏ మచ్చా లేకుండా బయటపడతానన్న నమ్మకం తనకుందని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి చెప్పారు.
‘సిబిఐకి పూర్తిగా సహకరించాలనుకుంటున్నాను. నిజం బయటపడుతుంది. ఏ మచ్చా లేకుండా క్లీన్‌ చిట్‌ వస్తుందన్న నమ్మకం నాకుంది. సిబిఐ పట్ల నాకు నమ్మకముంది. అది ఏ డాక్యుమెంటైనా తీసుకోవచ్చు. నన్ను ఏమైనా అడగవచ్చు. దాచేందుకు నావద్ద ఏదీ లేదు. వారు కోరిన డాక్యుమెంట్లన్నీ ఇచ్చాను. అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చాను’ అన్నారు. తను నిర్దోషిగా బయటపడి, త్వరలోనే తిరిగి రాజకీయ జీవితంలోకి వస్తానన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యుల నివాసాలపై ఏకకాలంలో సిబిఐ జరిపిన దాడులను ప్రస్తావిస్తూ యడ్యూరప్ప -‘నాపట్ల, నా కుటుంబం పట్ల విశ్వాసం ఉంచాల్సిందిగా రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నాను. ఈ దర్యాప్తు నాకు మరో అగ్నిపరీక్ష వంటిది’ అన్నారు.

రూపాయి ఢమాల్‌


ఫోరెక్స్‌ మార్కెట్‌ ఇంట్రాడేలో డాలర్‌ మారకంతో పోల్చుకుంటే రూపాయి రికార్డుస్థాయిలో ఎన్నడూ కనివీని ఎరుగని రీతిలో 67 పైసలు క్షీణించి 54.56 స్థాయికి పడిపోయింది. మార్కెట్‌ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి పోవడంతోపాటు దిగుమతిదారుల నుంచి పెద్ద ఎత్తున డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో రూపాయి భారీగా నష్టపోయింది. పడిపోతున్న రూపాయిని ఆదుకునేందుకు ఆర్‌బీఐ చేసిన చర్యలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదని ట్రేడర్లు చెబుతున్నారు. గతంలో ఇంత పెద్ద ఎత్తున రూపాయి క్షీణించడం డిసెంబర్‌ 15న 54.32 స్థాయికి పడిపోయింది.
ట్రేడర్ల అభిప్రాయం ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లలో స్థానిక కరెన్సీల కంటే డాలర్‌ బలపడటంతోపాటు యూరోజోన్‌ రుణ సంక్షోభం మరింత ముదిరిపోవడంతోపాటు అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లన్నీ నష్టాలతో ప్రారంభం కావడంతో రూపాయి ఒత్తిడికి గురైందని విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులకు తోడు దేశీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణంతో పాటు ఈక్విటీ మార్కెట్లు రోజు రోజుకు నష్టాలను మూటగట్టుకోవడంతో రూపాయి రికార్డుస్థాయిలో పతనమవుతోందని ఢిల్లీకి చెందిన ఫోరెక్స్‌ ట్రేడర్‌ చెప్పారు. బుధవారం నాడు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ జనవరి తర్వాత మొట్టమొదటి సారి 16,000 పాయింట్ల దిగువకు చేరింది. విదేశీ ఫండ్‌లు తమ వద్ద ఉన్న షేర్లు విక్రయించడంతో రూపాయి మరింత పతనమైంది.
ఆందోళన చెందాల్సన పనిలేదు
ఆర్‌బీఐ జోక్యం చేసుకున్నా రూపాయి 54.56 స్థాయికి పడిపోయి ఆర్‌బీఐ జోక్యంతో రూ.54.50 వద్ద స్థిరపడింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ పలువురిలో సందేహాలు మొదలయ్యాయి. ఫోరెక్స ట్రేడర్లు మాత్రం విదేశీ పెట్టుబడులు దేశం నుంచి తరలివెళ్లడమే కారణమని చెబుతున్నారు. మదుపరులు గ్లోబల్‌ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పెట్టుబడులు డాలర్‌ రూపంలో మార్చుకుంటేనే సురక్షితమని భావిస్తున్నారని ట్రేడర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రిత్వశాఖ జోక్యం చేసుకుంటూ ఆందోళన చెందాల్సిన పనిలేదని… అంతర్జాతీయ పరిణామాల వల్ల రూపాయి క్షీణిస్తోందని యూరోజోన్‌లో సమస్యలు ఒక కొలిక్కి వచ్చాక రూపాయి కుదుటపడుతుందని … ఆర్‌బీఐ దీనిపై ఒక కన్నేసి ఉంచిందని ఆర్థికమంత్రిత్వశాఖ అధికారులు చెప్పారు.
డీలర్లు మాత్రం రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ఈ రోజుసార్లు జోక్యం చేసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని చెప్పారు. ఇదిలా ఉండగా ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ కె సీ చక్రబర్తి మాట్లాడుతూ ఫోరెక్స్‌ మార్కెట్లో ఒడుదుడుకులకు గురైనప్పుడు మాత్రమే ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుందని …రూపాయి పడిపోతున్నప్పుడు మాత్రం తాము జోక్యం చేసుకోలేమని ఆయన అన్నారు. ఒడుదుడుకులకు, రూపాయి పడిపోతున్నప్పుడు జోక్యం చేసుకోవడం… ఈ రెంటికి పెద్ద వ్యాత్యాసం ఉందని మీరే ఆలోచించుకోండని ఆయన సలహా ఇచ్చారు. పడిపోతున్న రూపాయి లోక్‌సభలో ప్రతిపక్షం ఆందోళన వ్యక్తం చేసి… రూపాయిపడిపోకుండా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందని ప్రశ్నించింది. మన ఆర్థిక వ్యవస్థ తిరిగి 1991 నాటికి స్థాయికి చేరుకుంటుందా అని బీజేపీ నాయకుడు మురళీ మనోహర్‌ జోషి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రాథమికంగా చూసుకుంటే రూపాయి పడిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి కరెంట్‌ ఖాతాలోటుతోపాటు ద్రవ్యలోటు, ఇవన్నీ కూడా రూపాయి పడిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సమీప భవిష్యత్తులో ముడి చమురు ధరలు తగ్గితే రూపాయి పుంజుకునేందుకు అవకాశం ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే రూపాయిని ఆదుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి అనుకూలమైన అంశం కనిపించడంలేదని అంటున్నారు. యూరోతో పోల్చుకుంటే డాలర్‌ మరింత బలపడింది. ఇదికూడా రూపాయి పతనానికి కారణంగా చెప్పవచ్చు త్వరలోనే రూపాయి 56 స్థాయికి పడిపోవచ్చునని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 56 దాటిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వారంటున్నారు.
ప్రస్తుతం మార్కెట్‌ ప్రకారం చూసుకుంటే డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి 54 వద్ద ముగియడం పరవాలేదని అనేవారు ఉన్నారు. రూపాయి బలహీనపడటం పట్ల కార్పొరేట్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఐటీ రంగానికి చెందిన వారు దీనితో లబ్ధి పొందుతారు. అంతర్జాతీయ పరిణామాల వల్ల యూరోజోన్‌ సమస్య వల్ల రూపాయి పతనమవుతోందని ఇన్ఫోసిస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ వి బాలకృష్ణన్‌ అన్నారు. దీనికి తోడు మనకు వాణిజ్యలోగు, ద్రవ్యోలోటు కూడా జత కావడం వల్ల రూపాయి మరింత ఒత్తిడికి గురవుతోందని పరమిత్‌ బ్రహ్మబట్‌ సీఈవో అల్‌పారి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చెప్పారు. ఆర్‌బీఐ జోక్యంతోనే రూపాయిని మరింత పడిపోకుండా కాపాడుకోవచ్చునని ఆయన అన్నారు. రాబోయే ఒకటి రెండు రోజుల్లో ఆర్‌బీఐ కొన్ని విధాన నిర్ణయాలు ప్రకటించే రూపాయిని అడ్డుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఆర్‌బీఐ అమెరికా డాలర్‌ రీఫరెన్స్‌రేటును 54.2925గాను యూరోను 68.8719గా ఫిక్స్‌ చేసింది.

2జీ స్పెక్ట్రం కేసులో.. ఎట్టకేలకు..రాజాకు బెయిలు


సంచలనం కలిగించిన 2జీ స్పెక్ట్రం కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మాజీ మంత్రి ఏ రాజాకు ఎట్టకేలకు బెయిలు లభించింది. 15 నెలలుగా జైలులో ఉన్న ఆయనకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం షరతులతో బెయిలు మంజూరు చేసింది. కేసు విచారణ ప్రగతి బాగుందని, ఇప్పుడు నిందితుడు ప్రభావితం చేసేదేమీ ఉండదని అభివూపాయపడింది. కోర్టు అనుమతి లేకుండా తమిళనాడుకు వెళ్ళరాదని, టెలికమ్యూనికేషన్ల శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం- డాట్) కార్యాలయాన్ని కూడా సందర్శించరాదని తన 14 పేజీల ఆర్డర్‌లో మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ రాజా (49)ను ఆదేశించింది. పాస్‌పోర్టును స్వాధీనపరచాలని సూచించింది. రూ.25లక్షల ష్యూరిటీ సమర్పించాలని కోరింది. 2జీ కేటాయింపుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాజా 2010 నవంబర్ 14న మంత్రి పదవికి రాజీనామా చేశారు. మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన 2008లో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. లక్షా76వేల కోట్ల నష్టం వాటిల్లిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. 2010 నవంబర్ 14న రాజా రాజీనామా చేయగా, 2011 ఫిబ్రవరి 2న సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. మొత్తం 14 మంది నిందితుల్లో చివరగా బెయిలు పొందింది రాజాయే. న్యాయవాది కూడా అయిన ఆయన కేసు పరిణామాలను పరిశీలిస్తూ ఇంతకాలం బెయిలుకు దరఖాస్తు చేయలేదు.
తొలిసారి బెయిలు కోరగా ఆయనకు కోర్టు నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ కేసులో ఇప్పటిదాకా విచారణ సజావుగా సాగిందని, అన్నీ డాక్యుమెం అయినందున ఇప్పుడు రాజా ఇతరత్రా ప్రభావితం చేయబోయేది ఏమీ ఉండదని న్యాయస్థానం అభివూపాయపడింది. సీబీఐ వ్యక్తం చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. నేరపూరిత విశ్వాస ఘాతుకం అభియోగం మీద ఆయనకు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 ప్రకారం యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశముందని సీబీఐ వాదించింది. కేసు విచారణకు సంబంధించి పలు ఇతర అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ దశలో అవన్నీ ప్రభావం చూపేవికావని కోర్టు అభివూపాయపడింది. అవసరమైన మేరకు షరతులు విధించవచ్చని పేర్కొంది. ‘‘విచారణ ప్రగతిని, నిందితుడి కస్టడీ కాలాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, నిందితుడిని మరింతకాలం నిర్బంధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనిపిస్తోంది. వాస్తవానికి ఇతర నిందితులంతా బెయిలుపై విడుదలయ్యారు. ఈ కారణాల రీత్యా బెయిలు దరఖాస్తును ఆమోదించాలనుకుంటున్నాను’’ అని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ సైనీ తెలిపారు.
భారీ కుంభకోణంగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన 2జీ కేసులో ప్రధాన నిందితుడు, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజాకు బెయిలు సందర్భంగా సీబీఐ ప్రత్యేక కోర్టు వద్ద ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయమూర్తి బెయిలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించగానే కోర్టులోనే ఉన్న రాజా భార్య ఎంఏ పరమేశ్వరి ఎంతో ఊరట చెందినట్లు కనిపించారు. తనకు ఎంతో సంతోషంగా ఉందని, అందరం కలుసుకుంటామని ఆ తర్వాత కోర్టు వెలుపల విలేకరులతో చెప్పారు. ఉత్సవాలేమీ ఉండవని ఆమె పేర్కొనగా, కొందరు ఎంపీలు, భారీ సంఖ్యలో వచ్చిన మద్దతుదారులు మిఠాయిలు పంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి కొద్దిసేపు కోర్టులో ఉండి ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్ళిపోయారు. అనంతరం రాత్రి ఏడు గంటల తర్వాత తీహార్ జైలు నుంచి విడుదలైన రాజాకు ఘనస్వాగతం లభించింది. డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత టీ ఆర్ బాలుతోపాటు రాత్రి 7.40 గంటలకు మోతీలాల్‌మార్గ్‌లోని నివాసానికి చేరుకున్నారు. భారీ సంఖ్యలో మద్దతుదారులు బాణాసంచా కాల్చారు. పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.
2జీ కేసులో రాజాకు బెయిలుపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రాజాకు బెయిలు లభించడంపై డీఎంకే అధినేత ఎం కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు.
డీఎంకేలోని అందరూ రాజాకు మద్దతునిస్తారని ప్రకటించారు. బెయిలు లభించినంత మాత్రాన కేసు ముగిసినట్లు కాదని బీజేపీ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ జాగ్రత్తగా ప్రతిస్పందించింది. కోర్టు కార్యకలాపాల్లో తాము జోక్యం చేసుకోబోమని, కోర్టు పరిశీలనలో ఉన్న కేసుపై వ్యాఖ్యానించబోమని ఆ పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ పేర్కొన్నారు. మిత్రపక్షమైన డీఎంకే మాదిరిగానే రాజాకు మద్దతుగా నిలుస్తారా అని ప్రశ్నించగా- కేసు నడుస్తున్నందున బలపరచడమో, వ్యతిరేకించడమో ఉండదు.. డీఎంకే మాత్రం మా మిత్రపక్షమే అని బదులిచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు తీవ్రతను తగ్గిస్తున్నట్లు, పలుచన చేస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఇప్పుడు రాజా పెద్దగా ప్రభావితం చేసేదేమీ ఉండబోదని 2జీ కేసు పిటిషనర్ అయిన జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి అభివూపాయపడ్డారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బెయిలు పొందాలనే అన్నానని, ఇప్పుడు తనకు రాజా ప్రాణాల గురించి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు.

చిరు వియ్యంకుని ఇంటి నుంచి..రూ. 35 కోట్లు సీజ్


- అధికారికంగా ప్రకటించిన
చెన్నై ఐటీ అధికారులు
- రూ. 4కోట్ల విలువైన
ప్రామిసరీ నోట్లూ స్వాధీనం
- మొత్తం స్వాధీన ఆస్తుల విలువ
రూ. 39.66 కోట్లు
- రిజర్వు బ్యాంకుకు నగదు సమర్పణ
- నాకేం సంబంధం లేదు: చిరంజీవి వివరణ
- ఆదాయంపన్నుశాఖ అవార్డు పొందినవాడిని
- ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో వార్తలొచ్చాయి
- జర్నలిజం విలువలను నిలబెట్టండని విజ్ఞప్తి
హైదరాబాద్, మే 14 (టీ న్యూస్): కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వియ్యంకుని ఇంటి నుంచి 35కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు చెన్నై ఆదాయంపన్ను శాఖ అధికారులు ప్రకటించారు. సీజ్ చేసినవన్నీ 500, 1000 రూపాయల నోట్లే అని తెలిపారు. ఒక్కో అట్టపెట్టెలో ఒక్కో కోటి రూపాయలు నీట్‌గా ప్యాక్ చేసి ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం నగదు రూ. 35.66 కోట్లను సోమవారం రిజర్వు బ్యాంకుకు సమర్పించినట్లు తెలిపారు. తనిఖీల సందర్భంగా నగదుతోపాటు నాలుగు కోట్ల రూపాయల విలువచేసే ప్రామిసరీ నోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. చెన్నైలోని పోయస్‌గ్డాన్ ప్రాంతంలో ఉన్న చిరంజీవి పెద్దకూతురు సుస్మిత అత్తవారింట్లో ఆదాయంపన్నుశాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి వెళ్లిన చిరంజీవి శుక్రవారం రాత్రి పెద్ద కూతురు ఇంట్లోనే ఉన్నారు. శనివారం ఉదయం అక్కడి నుంచి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరిన వెంటనే ఆదాయంపన్నుశాఖ అధికారులు సుస్మిత నివాసంలో సోదాలు చేశారు.
తనిఖీల్లో 35.66కోట్ల రూపాయల నగదుతోపాటు పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. చిరంజీవి వియ్యంకుడు శివవూపసాద్ కొందరు భాగస్వాములతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదాయంపన్నుశాఖ అధికారులు దాడులు జరిపినపుడు ఇంట్లో చిరంజీవి పెద్దకూతురు సుస్మితతోపాటు ఆమె భర్త విష్ణువూపసాద్ ఉన్నారు. తన పెద్దకూతురు ఇంట్లో జరిగిన సంఘటనతో తనకెలాంటి సంబంధం లేదని చిరంజీవి ప్రకటించారు. ఉప ఎన్నికల్లో పంచిపె చిరంజీవి ఆ డబ్బును తన పెద్దకూతురు ఇంట్లో దాచిపెట్టారంటూ ప్రచారం జరిగింది. దీనిపై చిరంజీవి స్పందిస్తూ తన పెద్దకూతురు ఇంట్లో జరిగిన ఆదాయంపన్నుశాఖ తనిఖీలతోగానీ, అధికారులు స్వాధీనం చేసుకున్న డబ్బుతోగానీ తనకెలాంటి సంబంధం లేదని తెలిపారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయటానికే కొందరు ఈ విధమైన దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారని ఒక ప్రకటనలో ఆరోపించారు. ఆదాయంపన్ను చెల్లించటంలో తానెప్పుడూ వెనక్కి పోలేదని పేర్కొన్నారు. ఆంధ్రవూపదేశ్ ఆదాయంపన్నుశాఖ అధికారులు తనను సమ్మాన్ అవార్డుతో గౌరవించారన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఆ సంఘటనను తనకు ముడిపెడుతూ వార్తలొచ్చాయని నిరసన వ్యక్తం చేశారు. ఆ వార్తలను ఖండిస్తున్నానన్నారు. ఐటీ దాడులతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జర్నలిజం విలువలను, సంప్రదాయాలను నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు.

నన్ను శంకించకండి


చిదంబరం వేడుకోలు
‘ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌’పై మళ్లీ దద్దరిల్లిన రాజ్యసభ
ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ వ్యవహారం మరోసారి పార్లమెంట్‌ను కుదిపేసింది. ఈ వ్యవహారంలో తనకుగానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి ప్రమేయం లేదని, నా సమగ్రతను శంకించవద్దని హోం మంత్రి పి చిదంబరం వేడుకున్నారు. 2006 సంవత్సరంలో చిదంబరం కుమారుడు భాగస్వామిగా ఉన్న ఆస్‌బ్రిడ్జ్‌ హోల్డింగ్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌లో వాటాలు కలిగిన అడ్వాంటేజ్‌ స్ట్రాటజిక్‌ కన్సల్టింగ్‌ ఇమెయిల్‌, వెబ్‌ చిరునామాలు ఒకటిగా ఉన్నాయని ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ ఆరోపించడంతో రాజ్యసభలో దీనిపై గందరగోళం నెలకొంది. దీనిపై చిదంబరం స్పందిస్తూ తనకుగానీ, తన కుటుంబానికి గానీ ఏ టెలికం సంస్థలో వాటాలు కూడా లేవని చెప్పారు. ఆ రెండు సంస్థలకు ఒకే వెబ్‌ చిరునామా ఉన్న విషయం తనకు తెలియదని, ఒకవేళ ఉన్నా తనకు సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. ‘అడ్వాంటేజ్‌, ఆస్‌బ్రిడ్జ్‌ యజమానులకు సంబంధం లేదని ఎవరూ అనడం లేదు. ఇద్దరు చెన్నరులో ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు. చట్టబద్దమైన వ్యాపారం చేసేందుకు యువకులకు హక్కు ఉంది’ అని పేర్కొన్నారు. ఇరు సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు కన్సల్టెన్సీ సేవలకు సంబంధించినవని చెప్పారు. చిదంబరం వాదనను ప్రతిపక్షాలు తిరస్కరించాయి. హోంమంత్రి వాదన హేతుబద్దంగా లేదని చెప్పాయి. దీంతో తిరిగి మాట్లాడిన చిదంబరం… అడ్వాంటేజ్‌ కన్సల్టింగ్‌కు సంబంధించిన ఖాతాలను పరిశీలించాలని ఎవరైనా భావిస్తే, ఆర్థిక మంత్రికి తాను సిఫార్సు చేస్తానన్నారు.
అప్పటికీ సంతృప్తి చెందని ప్రతిపక్ష సభ్యులు భోజన విరామానంతరం కూడా సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు సార్లు సభ వాయిదా పడింది. ఈ సందర్భంలో భావోద్వేగానికి లోనయిన చిదంబరం తన నిజాయితీని శంకించవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. ‘నా గుండెల్లో బాకు దించినా సరే..గానీ నా నిజాయతీని శంకించకండి’అన్నారు. 22 ఏళ్లుగా తన స్నేహితుడిగా ఉన్న వ్యక్తి ఈ అంశాన్ని లేవనెత్తడం సంతోషంగా ఉందని జైట్లీని ఉద్దేశించి అన్నారు. ఈ సమయంలో జైట్లీ జోక్యం చేసుకుంటూ.. ఒకరి గుండెల్లో బాకుతో పొడవాలనేది తమ ఉద్దేశం కాదని, ప్రభుత్వం నిజాయితీ, నిబద్ధత అమలుచేయాలన్నదేనని చెప్పారు.
అనంతరం చిదంబరం మాట్లాడుతూ… మరో యువకుడితో కలిసి తన కుమారుడు ఆస్‌బ్రిడ్జ్‌ సంస్థను ప్రారంభించాడని తెలిపారు. అందులో తన కుమారుడు 1.8 లక్షల పెట్టుబడి పెట్టాడన్నారు. అయితే తరువాత తన వాటాలన్నీ బదలాయించాడని, ప్రస్తుతం ఆ సంస్థ మొదటి భాగస్వామి రాజేష్‌, అతని భార్య కలిసి నిర్వహి స్తున్నారని వివరించారు. ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పం దం జరిగిన 2006 అడ్వాంటేజ్‌, ఆస్‌బ్రిడ్స్‌ సంస్థలకు ఎటువంటి సంబంధం లేదని, 2011, మార్చిలోనే ఆస్‌బ్రిడ్జ్‌ సంస్థ అడ్వాంటేజ్‌ కన్సల్టింగ్‌లో రూ.5 లక్షల పెట్టుబడి పెట్టిందని తెలిపారు. తనకు గానీ, తన కుటుంబానికి గానీ సంబంధం లేని ఇద్దరు ప్రమోటర్ల ఆధీనంలో ఉన్న అడ్వాంటేజ్‌ కన్సల్టెన్సీని ఆస్‌బ్రిడ్జ్‌ ఏనాడూ స్వాధీనం చేసుకోలేదన్నారు. అయినా సంతృప్తి చెందని ప్రతిపక్షం చిదంబరం దోషేనని విమర్శించింది. ఆస్‌బ్రిడ్జ్‌, అడ్వాంటేజ్‌ సంస్థలకు ఒకే ఇమెయిల్‌ ఐడి, వెబ్‌సైట్‌ చిరునామాలను ప్రస్తావించిన జైట్లీ, తమ ఆరోపణలకు ఇవి విస్పష్ట సాక్ష్యాలని ఉద్ఘాటించారు. 2జి కేసులోనూ ఇదే విధమైన కుట్ర జరిగిందని విమర్శించారు.

హజ్ సబ్సిడీ వద్దు – పదేళ్లలో దశలవారీగా ఉపసంహరించాలి


సుప్రీంకోర్టు సంచలన తీర్పు
సబ్సిడీ సొమ్మును సామాజిక, విద్యా సంస్థలపై వెచ్చించాలని సూచన
సౌహార్ద బృందం సభ్యుల సంఖ్య రెండుకు తగ్గింపు
ఇక హజ్ కార్యకలాపాల పర్యవేక్షణ కోర్టు పరిధిలోకి
తీర్పుపై ముస్లిం ఎంపీల హర్షం
సబ్సిడీ సొమ్ము మైనారిటీ బాలికల విద్యకు వెచ్చించాలి : అసదుద్దీన్ ఒవైసీ
సౌకర్యాల కల్పనకు కార్పొరేషన్ నెలకొల్పాలి : సైఫుద్దీన్ సోజ్
సబ్సిడీ ఎత్తివేతపై ఎప్పట్నుంచో యోచిస్తున్నాం :
కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్
ముస్లిం సోదరుల పవిత్ర హజ్ యాత్ర సబ్సిడీపై సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. హజ్ యాత్రికులకు రాయితీ కల్పిస్తున్న విధానాన్ని అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పదేళ్లలోగా దశలవారీగా ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. అలాగే.. హజ్ యాత్రకు ప్రధాని తరపున వెళ్లే సౌహార్ద బృందంలో సభ్యుల సంఖ్యను 30 నుంచి 2కు పరిమితం చేయాలని సూచించింది. అంతేకాకుండా భారత హజ్ కమిటీ (హజ్ కమిటీ ఆఫ్ ఇండియా) కార్యకలాపాలను, యాత్రకు సభ్యులను ఎంపిక చేసే విధానాన్ని కోర్టు స్వయంగా పర్యవేక్షిస్తుందని తెలిపింది. జస్టిస్ అల్తమస్ కబీర్, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
ఈ ఆదేశాలు ఈ ఏడాది హజ్ యాత్ర నుంచే వర్తిస్తాయని తన తీర్పులో ధర్మాసనం స్పష్టం చేసింది. సబ్సిడీ సొమ్మును మైనారిటీల అభివృద్ధికి ఉద్దేశించిన సామాజిక కార్యక్షికమాలు, విద్యా సంస్థల అభివృద్ధికి వెచ్చించాలని సూచించింది. హజ్ సబ్సిడీని రద్దు చేయడాన్ని ముస్లింల పవిత్ర మత గ్రంథం ఖురాన్ కూడా సమర్థిస్తోందని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అనేక మత కార్యక్షికమాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రజా ధనాన్ని, వనరులను ఉపయోగిస్తున్నారనే విషయం మాకు తెలుసు. అయినప్పటికీ హజ్ సబ్సిడీ విధానాన్ని తొలగించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పేర్కొంది. 2011లో హజ్ యాత్రికుల విమాన టికెట్లకు సంబంధించి ప్రభుత్వం రూ.65 కోట్లు సబ్సిడీ రూపంలో భరించిందని, కానీ ఆ విషయం యాత్రికులకు తెలియదని అభివూపాయపడింది.
11,000 మంది హజ్ యాత్రీకులలో వీఐపీ కోటా కింద ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న 00 మందికి ప్రైవేటు ఆపరేటర్లు రవాణా సేవలు అందించేందుకు అనుమతించాలని విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశిస్తూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో అప్పీలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. అప్పీలు పరిధిని విస్తరించిన కోర్టు హజ్ యాత్ర సబ్సిడీ విధానం చట్టబద్ధతపైనా విచారణ జరిపి తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ విధానాన్ని సమర్థించుకుంది. అయితే సబ్సిడీ విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 14న కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది.
హజ్ యాత్ర విషయంలో కేంద్రం రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఘాటుగా స్పందించింది. దీంతో హజ్ సబ్సిడీ విధానం, ఎంపిక ప్రక్రియలో పలు మార్పులు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో ఐదేళ్లకు ఒకసారి సబ్సిడీపై హజ్‌యావూతకు దరఖాస్తు చేసుకునే విధానాన్ని సవరించి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే సబ్సిడీ వినియోగించుకునే పద్ధతిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. హజ్ యాత్రకు ఇప్పటివరకూ వెళ్లని వారికి ప్రాధాన్యమిచ్చే ఉద్దేశంతో కొత్త మార్గదర్శకాలను రూపొందించామని, 70 ఏళ్లు పైబడిన వారికి హజ్ యాత్ర విషయంలో ప్రాధాన్యమివ్వాలన్నది ప్రభుత్వ సంకల్పమని వివరించింది. అలాగే మూడుసార్లు హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకున్నా అవకాశం లభించనివారికీ ప్రాధాన్యం ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయమని కూడా వెల్లడించింది. అయినా సంతృప్తి చెందని కోర్టు హజ్ సబ్సిడీ విధానం వద్దంటూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుపై పలువురు ముస్లిం ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు.
తీర్పుపై ఎవరేమన్నారంటే..
ఆ సొమ్ము మైనారిటీ బాలికల విద్యకు వెచ్చించాలి : అసదుద్దీన్ ఒవైసీ
హజ్ సబ్సిడీ విధానాన్ని తొలినుంచీ అనేక సందర్భాల్లో వ్యతిరేకించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోర్టు తీర్పును స్వాగతించారు. పదేళ్ల సమయం ఎందుకు? తక్షణమే ఆ విధానాన్ని రద్దు చేయాలని న్యూఢిల్లీలో మీడియాతో అన్నారు. ‘హజ్ సబ్సిడీ కింద చెల్లించే రూ. 600 కోట్లు యాత్రికులకు అందడంలేదు. ఆ సొమ్మంతా నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాకే పోతోంది. మైనారిటీ బాలికల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్నందున ఆ డబ్బును వారి విద్యకు కేటాయించాలి. ఆర్థిక స్థోమత కలిగి ఉండి హజ్ యాత్రకు వెళ్లగలిగేవారే సబ్సిడీ కింద హజ్ యాత్రకు వెళ్తున్నారు. స్థోమతలేనివారు వెళ్ల అని ఒవైసీ అభివూపాయపడ్డారు. సబ్సిడీ విధానం ముస్లిం మత విధానాలకు విరుద్ధమని అన్నారు.
కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి : సైఫుద్దీన్ సోజ్
హజ్ సబ్సిడీ విధానం రద్దు పట్ల హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ సైఫుద్దీన్ సోజ్.. హజ్ యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మలేషియా తరహాలో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించారు. హజ్ యాత్రికుల ప్రయాణంపై సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. యాత్రికుల ప్రయాణానికి సంబంధించి గ్లోబల్ టెండర్లు పిలిస్తే పోటీ పెరిగి విమాన టికెట్ల ధరలు తగ్గుముఖం పడతాయని, హజ్ యాత్ర మరింత చౌకగా అందుబాటులోకి వస్తుందని సోజ్ పేర్కొన్నారు. తనతో పాటు మరో 20 మంది ముస్లిం నేతలు సబ్సిడీ విధానాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సబ్సిడీ ఎత్తివేత దిశగా ప్రభుత్వం : సల్మాన్ ఖుర్షీద్
హజ్ యాత్ర సబ్సిడీ ఎత్తివేత దిశగా నాలుగేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. సబ్సిడీ ఎత్తివేతపై ప్రభుత్వంలో అనేకసార్లు చర్చ జరిగిందన్నారు. యాత్రికులకు హజ్ యాత్ర ఆర్థిక భారంగా మారకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విమాన టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తామని ఖుర్షీద్ హామీ ఇచ్చారు.

free website analytics