<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>Ankusam - 24 Hours e-News</title>
	<atom:link href="http://ankusam.com/news/national-news/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://ankusam.com</link>
	<description>Telugu &#38; English News, Information - ANKUSAM News Paper Online offers News Headlines, State News, National News, International News, News Updates and more  from www.ankusam.com 24 hours enews  and information website.</description>
	<lastBuildDate>Wed, 08 Sep 2010 03:35:09 +0000</lastBuildDate>
	<generator>http://wordpress.org/?v=abc</generator>
	<language>en</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
			<item>
		<title>సమ్మె సక్సెస్‌ &#8211; రాష్ట్రంలోనూ విజయవంతం</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%b8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86-%e0%b0%b8%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%b8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86-%e0%b0%b8%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82/#comments</comments>
		<pubDate>Wed, 08 Sep 2010 03:32:10 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>
		<category><![CDATA[జాతీయం]]></category>
		<category><![CDATA[రాష్ట్రీయం]]></category>
		<category><![CDATA[హైదరాబాద్]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=49688</guid>
		<description><![CDATA[
యుపిఎ-2 సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు,ఉద్యోగులు కన్నెర్ర చేసారు. ధరల పెరుగుదలను అరికట్టాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రీకరించాలని, కార్మిక చట్టాలను సక్రమంగా అమలు పర్చాలని, [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/09/13.07.jpg"><img class="alignnone size-full wp-image-49689" title="13.07" src="http://ankusam.com/wp-content/uploads/2010/09/13.07.jpg" alt="13.07" width="400" height="300" /></a><br />
యుపిఎ-2 సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు,ఉద్యోగులు కన్నెర్ర చేసారు. ధరల పెరుగుదలను అరికట్టాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రీకరించాలని, కార్మిక చట్టాలను సక్రమంగా అమలు పర్చాలని, అసంఘటిత కార్మికులందరికీ సామాజిక భద్రతా ప్రయోజనాలను అమలు చేయాలని&#8230; తదితర డిమాండ్లతో కేంద్ర కార్మిక సంఘాలిచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మంగళవారం జరిగిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. చారిత్రాత్మకమైన ఈ సమ్మెలో పదికోట్ల మంది శ్రామికులు పాల్గొన్నారు. ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం మీద సమ్మె ప్రభావం పడింది. సిఐటియు, ఎఐటియుసి, హెచ్‌ఎంఎస్‌, ఎఐయుటియుసి, టియుసిసి, ఎఐసిసిటియు, యుటియుసి కార్మిక సంఘాలతో పాటు కాంగ్రెస్‌ అనుబంధ సంఘమైన ఐఎన్‌టియుసి ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెతో బెంగాల్‌, కేరళ, త్రిపురతోపాటు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. శ్రామికులు విధులను బహిష్కరించటంతో పారిశ్రామిక యూనిట్లు మూతపడ్డాయి. బ్యాంకింగ్‌, బీమా కార్యకలాపాలు ఆగిపోయాయి.<br />
రవాణా నిలిచిపోయింది. బొగ్గు, టెలికమ్యూనికేషన్లు, రక్షణ, రోడ్డు రవాణా, ఓడరేవులు, పెట్రోలియం, విమాన యానం, నిర్మాణ రంగాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో భారీగా పాల్గొన్నారు. అసంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాలుపంచుకున్నారు. అనేక చోట్ల ధర్నాలు, ర్యాలీలు జరిగాయి. కార్మిక సంఘాలు ఐక్యంగా సమ్మెకు పిలుపునివ్వడం పోరాటానికి మంచి స్ఫూర్తినిచ్చింది. సమ్మె ప్రభుత్వ రంగంతో పాటు ప్రయివేటు రంగాన్నీ తీవ్రంగా ప్రభావితం చేసింది.సమస్యలను పరిష్కరించకపోతే ఫీబ్రవరిలో ఛలో పార్లమెంట్‌ నిర్వహిస్తామని ఉద్యోగ,కార్మిక సంఘాలు హెచ్చరించాయి. సమ్మె విజయవంతం చేసిన శ్రామికులకు కార్మిక సంఘాలు అభినందనలు తెలియజేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె విజయవంతమైంది. అన్ని జిల్లా, పట్టణ, మండల కేంద్రాల్లోనూ భారీ ప్రదర్శనలు జరిగాయి. పారిశ్రామికవాడలు వెలవెలబోయాయి. అన్ని రంగాల్లోనూ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మంగళవారం వివిధ కార్మిక సంఘాలతో హైదరాబాద్‌లో జరిగిన భారీ ప్రదర్శనలో యుపిఎ-2 ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలని వక్తలు డిమాండ్‌ చేశారు. లేదంటే రానున్న రోజుల్లో మరిన్ని సమరశీల పోరాటాలకు కార్మిక సంఘాలు రూపకల్పన చేస్తాయని హెచ్చరించారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%b8%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%86-%e0%b0%b8%e0%b0%95%e0%b1%8d%e0%b0%b8%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b7%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>భారత్‌ బ్యాంకులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be/#comments</comments>
		<pubDate>Wed, 08 Sep 2010 03:30:55 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[AP భవన్]]></category>
		<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>
		<category><![CDATA[జాతీయం]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=49685</guid>
		<description><![CDATA[
విధి విధానాలను మార్చుకుని, వ్యాపార పరిమాణాన్ని పెంచుకోవడం ద్వారా భారత బ్యాంకులు అంతర్జాతీయస్థాయికి ఎదగాల్సి ఉందని, దాంతోపాటే సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/09/pranab12.jpg"><img class="alignnone size-full wp-image-49686" title="pranab12" src="http://ankusam.com/wp-content/uploads/2010/09/pranab12.jpg" alt="pranab12" width="230" height="243" /></a><br />
విధి విధానాలను మార్చుకుని, వ్యాపార పరిమాణాన్ని పెంచుకోవడం ద్వారా భారత బ్యాంకులు అంతర్జాతీయస్థాయికి ఎదగాల్సి ఉందని, దాంతోపాటే సమ్మిళిత ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ కోరారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 105వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రణబ్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.దేశపురోగతిలో ఆర్థిక సేవలు కీలక పాత్ర పోషిస్తాయని, అంతర్జాతీయ బ్యాంకింగ్‌ పరిధి ఇటీవల కాలంలో బాగా పెరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని భారత్‌ బ్యాంకులు తమదైన ముద్రను గ్లోబల్‌ బ్యాంకింగ్‌ స్థాయికి తీసుకువెళ్ళాలని పిలుపునిచ్చారు.  ప్రస్తుతం స్టేట్‌బ్యాంక్‌ మాత్రమే ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో 282వ స్థానాన్ని సంపాదించుకోగలిగిందని, పెరుగుతున్న స్థూల జాతీయోత్పత్తితో భారత్‌ రికవరీ బాటలో నడుస్తోందని, అధిక రుణ వృద్ధిని సాధించడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఇతర వాణిజ్య బ్యాంకులు కూడా బాగా పనిచేస్తున్నాయని కితాబుని చ్చారు. గత మూడు సంవత్సరాల తరువాత ఈ ఏడాది తొలి త్రైమాసి కంలో జిడిపి 8.8 శాతం చేరుకున్నందున బ్యాంకులు రెట్టించిన ఉత్సాహంతో కార్యకలాపాలు సాగించాలని, ప్రతి రెండువేల మంది జనాభాకు బ్యాంకింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యాన్ని 2012 లోగానే పూర్తి చేయాలని కోరారు.  ఈ విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎంతో పురోగమిస్తున్నదని 2011 నాటికే లక్ష్యాన్ని చేరుకోగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు. 105 వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 105 శాఖలు, 105 ఏటిఎంలను మంగళవారం ప్రారంభించింది. దాంతో పాటు ఖాతాదారుల కోసం ప్రీ పెయిడ్‌ గిఫ్ట్‌ కార్డు, ప్లాటినం డెబిట్‌ కార్డులను ప్రవేశపెట్టింది.బ్యాంక్‌ సిఎండి అలోక్‌ కె మిశ్రా మాట్లాడుతూ 7000 గ్రామాలకు సంబంధించి 1.25 కోట్ల నోఫ్రిల్‌ ఖాతాలను ప్రారంభించాలని ప్రణాళిక రూపొందిస్తున్నామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాలలో 22 శాతం, డిపాజిట్లలో 20-21 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లింది  &#8211; రాహుల్‌</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%95%e0%b0%ae%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2%e0%b0%95/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%95%e0%b0%ae%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2%e0%b0%95/#comments</comments>
		<pubDate>Tue, 07 Sep 2010 04:21:40 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>
		<category><![CDATA[అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[జాతీయం]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=49626</guid>
		<description><![CDATA[
కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిందనీ, బెంగాల్‌లో దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉంటున్న వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో సాగనంపాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌ [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/09/rah.jpg"><img class="alignnone size-full wp-image-49627" title="rah" src="http://ankusam.com/wp-content/uploads/2010/09/rah.jpg" alt="rah" width="406" height="350" /></a><br />
కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిందనీ, బెంగాల్‌లో దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉంటున్న వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో సాగనంపాలని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలను వల్లించే కమ్యూనిస్టులు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతూ బెంగాల్‌కి చేసింది ఏమీ లేదని ఆయన సోమవారం ఇక్కడ ఒక సమావేశంలో విమర్శించారు. సోవియట్‌ యూనియన్‌ ఏ విధంగా అయితే, కుప్ప కూలిందో, బెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం కూడా కుప్పకూలడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం కేటాయిస్తున్న నిధులను వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని ఆయన ఆరోపించారు.&#8217;కేంద్రం పంపే నిధులు లబ్ధి దారులకు చేరడం లేదు. ఆ నిధులను వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వం మాయం చేస్తోంది&#8217; అని ఆయన అన్నారు.బెంగాల్‌ పారిశ్రామికంగా వెనుకబడిందన్న వాస్తవాన్ని సిపీఎం నాయకులే ఇటీవల గుర్తించారనీ, అందుకే, దేశంలోని పెద్ద పారిశ్రామికవేత్తలకూ, బహుళజాతి సంస్థల అధిపతులకు ఎర్ర తివాచీ స్వాగతం పలుకుతున్నారని ఆయన అన్నారు. మూడున్నర దశాబ్దాలుగా మార్క్సిస్టు ఫ్రంట్‌ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి చేసిందేమీ లేదన్న విషయం దీనిని బట్టే స్పష్టమవుతోందని ఆయన అన్నారు.  రాష్ట్రంలో పేద ప్రజలకు రేషన్‌ కార్డులు లేవనీ, బెంగాల్‌ని ప్రభుత్వం కాక, సీపీఎం కార్యకర్తలే నడుపుతున్నారనీ, పేద ప్రజల కోసం కాక, తమ పార్టీ వారి కోసం ప్రభుత్వాన్ని వారు నడుపుకుంటున్నారని ఆయన విమర్శించినప్పుడు సభికులు పెద్ద పెట్టున హర్షధ్వానాలు తెలిపారు. యువకులు కాంగ్రెస్‌లో చేరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. చైనాలోని కమ్యూనిస్టు నాయకులు కూడా సిపీఎంని ఖాతరు చేయడం లేదని ఆయన అన్నారు. &#8216;ఆ మధ్య నేను చైనా వెళ్ళినప్పుడు అక్కడి నాయకులు &#8216;మీ దేశంలో సీపీఎం వారు కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకుని ఇంకా వేలాడుతున్నారేమని అడిగారు&#8217; అని ఆయన అన్నారు.  బెంగాల్‌లో కాంగ్రెస్‌కి తిరిగి పూర్వ వైభవం రావడం ఖాయమనీ, కార్యకర్తలూ, నాయకులూ సమన్వయంతో పని చేస్తే ఇది ఎంతమాత్రం అసాధ్యం కాదని ఆయన అన్నారు. &#8216;ఉత్తరప్రదేశ్‌, తమిళనాడుల్లో యువజన కాంగ్రెస్‌ని పునరుద్ధరించడం అసాధ్యమని చాలా మంది అన్నారు. కానీ, నేను వెళ్ళి అక్కడ పార్టీ శాఖలను ఏర్పరచడమే కాకుండా, కార్యకర్తలూ, నాయకుల మధ్య సమన్వయం ఉండేట్టు చేశాను. అలాగే, బెంగాల్‌లో కూడా కాంగ్రెస్‌కి పూర్వ వైభవం ఖాయం&#8217; అని ఆయన అన్నారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్డీ నాయకులూ, కార్యకర్తలూ కలిసికట్టుగా ఏకోన్ముఖంగా కృషి చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%95%e0%b0%ae%e0%b1%8d%e0%b0%af%e0%b1%82%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%81-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%be%e0%b0%b2%e0%b0%95/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>అమెరికాలో విశాఖ విద్యార్థి మృతి</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%85%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%96-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%85%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%96-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/#comments</comments>
		<pubDate>Mon, 06 Sep 2010 00:14:28 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[AP భవన్]]></category>
		<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Headlines]]></category>
		<category><![CDATA[అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[జాతీయం]]></category>
		<category><![CDATA[విశాఖపట్నం]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=49550</guid>
		<description><![CDATA[
అమెరికాలోని మిస్సిసిపి నదిలో జరిగిన ఓ పడవ ప్రమాదంలో విశాఖపట్నానికి గౌతమ్‌ జోసెఫ్‌ స్మిలెస్‌ (24) అనే విద్యార్థి మృతి చెందారు. ఈ విషయాన్ని ఉత్తర అమెరికా [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/09/06.09.jpg"><img class="alignnone size-full wp-image-49551" title="06.09" src="http://ankusam.com/wp-content/uploads/2010/09/06.09.jpg" alt="06.09" width="300" height="431" /></a><br />
అమెరికాలోని మిస్సిసిపి నదిలో జరిగిన ఓ పడవ ప్రమాదంలో విశాఖపట్నానికి గౌతమ్‌ జోసెఫ్‌ స్మిలెస్‌ (24) అనే విద్యార్థి మృతి చెందారు. ఈ విషయాన్ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆదివారం తెలిపింది. లూసియానా స్టేట్‌ వర్శిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న గౌతమ్‌ శనివారం మిత్రులతో కలిసి జలవిహారానికి వెళ్లినప్పుడు ఈ విషాదం చోటుచేసుకుంది. &#8216;గౌతమ్‌ ఎనిమిది మంది మిత్రులతో కలిసి జలవిహారానికి వెళ్లాడు. వారు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ప్రాణరక్షణ జాకెట్‌ వేసుకోకపోవడంతో గౌతమ్‌ నదిలో మునిగిపోయాడు. గజ ఈతగాళ్లు అతడ్ని ఒడ్డుకు తెచ్చారు. అయితే గౌతమ్‌ అప్పడికే ప్రాణాలు వదిలాడు&#8217; అని తానా తెలిపింది. మృతదేహాన్ని విశాఖ తరలించేందుకు సహకరించాల్సిందిగా గౌతమ్‌ తల్లిదండ్రులు తానాను కోరారు. కేంద్ర మానవ వనరుల శాఖ సహయ మంత్రి డి పురంధేశ్వరి ఈ ప్రమాదంపై తానా ప్రతినిధి తోటకూర ప్రసాద్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ విషయంలో అక్కడి విదేశాంగశాఖతో కానీ, ఇతర అధికారులతో కానీ సంప్రదింపులు జరిపేందుకు సహకరిస్తానని చెప్పారు.<br />
గౌతమ్‌ మృతదేహాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ నెల ఎనిమిదో తేదీకల్లా విశాఖ చేరుకోవచ్చని తానా తెలిపింది. 2009 జనవరిలో ఉన్నత విద్యాభ్యాసం కోసం గౌతమ్‌ అమెరికా వెళ్లారు. లూసియానా స్టేట్‌ వర్సిటీలో మాస్టర్స్‌ ఇంజనీరింగ్‌లో చేరిన ఆయన ప్రస్తుతం చివరి సెమిస్టర్‌లో ఉన్నారు. గౌతమ్‌ తండ్రి శామ్యూల్‌ స్మిలెస్‌ భారత్‌ హెవీ ప్లేట్స్‌ అండ్‌ వీస్సెల్స్‌ లిమిటెడ్‌ (బిహెచ్‌పివి)లో పనిచేస్తున్నారు. తల్లి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. గౌతమ్‌కు ఒక చెల్లెలు కూడా ఉన్నారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%85%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b6%e0%b0%be%e0%b0%96-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a6%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>అధికారం ఉన్నా, లేకపోయినా దేశాభివృద్ధికే అంకితం &#8211; సోనియాగాంధీ ప్రతిన</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%85%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b2%e0%b1%87%e0%b0%95%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%85%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b2%e0%b1%87%e0%b0%95%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be/#comments</comments>
		<pubDate>Sat, 04 Sep 2010 01:27:42 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[AP భవన్]]></category>
		<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Goa]]></category>
		<category><![CDATA[Headlines]]></category>
		<category><![CDATA[Karnataka]]></category>
		<category><![CDATA[Maharastra]]></category>
		<category><![CDATA[Metro Cities]]></category>
		<category><![CDATA[Tamlinadu]]></category>
		<category><![CDATA[అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[జాతీయం]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=49457</guid>
		<description><![CDATA[
అధికారంలో ఉన్నా లేకపోయినా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల, ముఖ్యంగా బడుగు వర్గాల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని వరుసగా నాల్గవ పర్యాయం కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/09/04.093.jpg"><img class="alignnone size-full wp-image-49458" title="04.09" src="http://ankusam.com/wp-content/uploads/2010/09/04.093.jpg" alt="04.09" width="307" height="231" /></a><br />
అధికారంలో ఉన్నా లేకపోయినా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల, ముఖ్యంగా బడుగు వర్గాల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని వరుసగా నాల్గవ పర్యాయం కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎన్నికైన సోనియా గాంధీ ప్రతినబూనారు. పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆమె శుక్రవారంనాడిక్కడ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌లతో పాటు పెద్దసంఖ్యలో సీనియర్‌ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె కాంగ్రెస్‌ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ నుండి అధ్యక్ష పదవికి ఎన్నికైనట్లు సర్టిఫికెట్‌ను అందుకున్నారు.  &#8216;కార్యకర్తలు నన్ను మరోసారి పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకొన్నారు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా దేశానికి సేవ చేయడం అతిపెద్ద బాధ్యత అని నేనెప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకొంటూ ఉంటాను, మనం అధికారంలో ఉన్నా, లేకపోయినా మనమెల్లప్పుడూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తూనే ఉండాలి&#8217; అని శ్రీమతి సోనియా గాంధీ ఉద్బోధించారు. తనపై మరోసారి విశ్వాసముంచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని మరింత సమున్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో శ్రమిస్తానని సోనియా హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు ఎల్లప్పూడూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి  చేయాలని కోరారు. అంతకుముందు, అధ్యక్ష ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించిన పార్టీ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌ సోనియా గాంధీ నాల్గవ పర్యాయం అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ఆమెకు సర్టిఫికెట్‌ అందజేశారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఎఐసిసి కోశాధికారి, సీనియర్‌ నాయకుడు మోతీలాల్‌ వోరాలు సోనియాకు పుష్పగుచ్ఛాలందించి అభినందనలు తెలిపారు.<br />
కార్యకర్తల కోలాహలం: సోనియా ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా స్థానిక అక్బర్‌ రోడ్డులోని ఎఐసిసి కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఉత్సవ వాతావరణం నెలకొన్నది. పార్టీ అధ్యక్షురాలి నివాసం, దానికి ఆనుకొనే ఉన్న ఎఐసిసి కార్యాలయాల ఎదుట అక్బర్‌ రోడ్డు కార్యకర్తలతో నిండిపోయింది. శ్రీమతి సోనియా ఎన్నికైనట్లు ప్రకటించగానే కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ బాణాసంచా కాల్చారు. ఆనందంతో రోడ్డుపైనే నృత్యం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు పంచుకొని అత్యంత కోలాహలంగా గడిపారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%85%e0%b0%a7%e0%b0%bf%e0%b0%95%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%89%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%be-%e0%b0%b2%e0%b1%87%e0%b0%95%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8%e0%b0%be/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>వైమానిక దళ గౌరవ కెప్టెన్‌ సచిన్‌</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%b5%e0%b1%88%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95-%e0%b0%a6%e0%b0%b3-%e0%b0%97%e0%b1%8c%e0%b0%b0%e0%b0%b5-%e0%b0%95%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%9f%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%b5%e0%b1%88%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95-%e0%b0%a6%e0%b0%b3-%e0%b0%97%e0%b1%8c%e0%b0%b0%e0%b0%b5-%e0%b0%95%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%9f%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d/#comments</comments>
		<pubDate>Sat, 04 Sep 2010 01:18:15 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[AP భవన్]]></category>
		<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[Goa]]></category>
		<category><![CDATA[Headlines]]></category>
		<category><![CDATA[Karnataka]]></category>
		<category><![CDATA[Maharastra]]></category>
		<category><![CDATA[Metro Cities]]></category>
		<category><![CDATA[Tamlinadu]]></category>
		<category><![CDATA[అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[క్రీడా వార్తలు]]></category>
		<category><![CDATA[జాతీయం]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=49444</guid>
		<description><![CDATA[
భారత వాయుసేన గౌరవ ర్యాంకు అయిన గ్రూప్‌ కెప్టెన్‌గా క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌ క్రీడాకారునిగా దేశానికి సచిన్‌ అందించిన సేవలకు గుర్తింపుగా [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/09/04.09.01.jpg"><img class="alignnone size-full wp-image-49445" title="04.09.01" src="http://ankusam.com/wp-content/uploads/2010/09/04.09.01.jpg" alt="04.09.01" width="300" height="190" /></a><br />
భారత వాయుసేన గౌరవ ర్యాంకు అయిన గ్రూప్‌ కెప్టెన్‌గా క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. క్రికెట్‌ క్రీడాకారునిగా దేశానికి సచిన్‌ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ ర్యాంకును కేటాయిస్తున్నట్లు వాయుసేన వర్గాలు తెలిపాయి. కనీస మాత్రపు గగన చోదక అనుభవం లేకుండా వాయుసేన గౌరవ ర్యాంకును పొందిన మొట్టమొదటి క్రీడాకారుడు సచిన్‌ కావడం విశేషం. 1983లో ప్రపంచ కప్‌ను భారత్‌కు గెలిచి పెట్టిన నాటి కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ను 2008లో ప్రాదేశిక సైన్యం లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాతో వాయుసేన సత్కరించింది. న్కూఢిల్లీలోని వాయుసేన ఆడిటోరియంలో జిగేల్మంటూ జరిగిన కార్యక్రమంలో 37సంవత్సరాల టెండూల్కర్‌ను సేనలోకి తీసుకుంటున్నట్లు వాయుసేన ఛీఫ్‌ ఎయిర్‌మార్షల్‌ పివి నాయక్‌ ఆహూతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వాయుసేన గౌరవం దక్కడం తనకు అమితానందాన్నిచ్చిందని సచిన్‌ అన్నాడు. వాయుసేనలో భాగంగా నిలువ గలిగినందుకు గర్వంగా ఉందన్నాడు. ఈ సందర్భంగా భారత రత్న అవార్డు పొందాలన్న ఆకాంక్షను సచిన్‌ వ్యక్తం చేసాడు.<br />
భారత సైనిక దళంలో గౌరవ ర్యాంక్‌ను దక్కించుకున్న తొలి క్రీడాకారునిగా కపిల్‌ దేవ్‌ ఘనత సాధించాడు. 2008లో ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినంట్‌ కల్నల్‌ ర్యాంక్‌ పొందాడు. ఇప్పటివరకు 21 మంది ప్రముఖ వ్యక్తులు భారత వైమానిక దళంలో గౌరవ ర్యాంక్‌లు పొందారు. అటువంటి వారిలో తొలి వ్యక్తి రాజా ఆఫ్‌ జవహర్‌ రాజా యశ్వంత్‌రావు. ఆయనకు 1944లో ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌ ర్యాంక్‌ లభించింది. పారిశ్రామికవేత్త జెఆర్‌డి టాటా 1974లో ఎయిర్‌వైస్‌ మార్షల్‌ అయ్యారు. 1990లో చివరిసారిగా పారిశ్రామికవేత్త విజయపత్‌ సింఘానికా ఎయిర్‌ కమాడోర్‌ అయ్యారు. పౌర విమానయాన శాఖలో ఎటువంటి నేపథ్యంలేని వ్యక్తి ఈ హౌదా పొందిన ఘనత సచిన్‌కే దక్కింది.<br />
తన 21 సంవత్సరాల అంతర్జాతీయ కెరీర్‌లో ఏ ఒక్క బుకీ భారత క్రికెటర్‌ వద్దకు రాలేదని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేర్కొన్నాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ గురించి సచిన్‌ మాట్లాడటం అతడి కెరీర్‌లో ఇదే తొలిసారి. బ్రిటిష్‌ మీడియాలో స్పాట్‌ఫిక్సింగ్‌కు సంబంధించి వచ్చిన వార్తలు క్రికెట్‌ ఆటకు చెడ్డపేరు తీసుకువచ్చాయని అన్నాడు. స్పాట్‌ఫిక్సింగ్‌పై ఐసిసి సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులుగా నిర్ధారణ అయినవారిపై చర్య తీసుకోవాలని సూచించాడు. అయితే ఈ విషయం గురించి వ్యాఖ్యానించేందుకు తానేమీ నిపుణుడను కాదని అన్నాడు. ఈ వార్తలు తనను నిరుత్సాహపరిచాయని అన్నాడు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%b5%e0%b1%88%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95-%e0%b0%a6%e0%b0%b3-%e0%b0%97%e0%b1%8c%e0%b0%b0%e0%b0%b5-%e0%b0%95%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%9f%e0%b1%86%e0%b0%a8%e0%b1%8d/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>ఆ ముగ్గురి నిష్ర్కమణ</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%86-%e0%b0%ae%e0%b1%81%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b0%ae%e0%b0%a3/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%86-%e0%b0%ae%e0%b1%81%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b0%ae%e0%b0%a3/#comments</comments>
		<pubDate>Fri, 03 Sep 2010 03:24:04 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[క్రీడా వార్తలు]]></category>
		<category><![CDATA[జాతీయం]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=49427</guid>
		<description><![CDATA[
స్పాట్‌ ఫిక్సింగ్‌ కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాిస్థాన్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌, మహమ్మద్‌ అమిర్‌, మహమ్మద్‌ ఆసిఫ్‌లపై ఇంగ్లండ్‌ జట్టుతో జరుగనున్న వన్డే, [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/09/03.094.jpg"><img class="size-full wp-image-49428 alignleft" title="03.09" src="http://ankusam.com/wp-content/uploads/2010/09/03.094.jpg" alt="03.09" width="300" height="203" /></a><br />
స్పాట్‌ ఫిక్సింగ్‌ కు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాిస్థాన్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌, మహమ్మద్‌ అమిర్‌, మహమ్మద్‌ ఆసిఫ్‌లపై ఇంగ్లండ్‌ జట్టుతో జరుగనున్న వన్డే, ట్వంటీ-20 టోర్నీలు ఆడకుండా వేటు పడింది. అయితే ఈ క్రీడాకారులు తమపై వచ్చిన స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా విపరీతమైన మానసిక ఒత్తిడిలో ఉండి తమంతట తామే వన్డే, ట్వంటీ-20 టోర్నీల నుండి వైదొలిగారని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రటించింది. ఈ ప్రకటనతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాళ్ల పీసీబీ గట్టిగా సమర్ధించింది. అంతేగాకుండా ఈ ఆటగాళ్లందరూ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల నుండి బయటకు వచ్చే వరకు బోర్డు వారి వెంటే ఉంటుందని కూడా స్పష్టం చేసింది.<br />
అంతర్జాతీయ క్రికెట్‌ సమాఖ్య (ఐసీసీ)తో పాటు, పీసీబీ, ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు అధికారుల మధ్య సుధీర్ఘ చర్చల అనంతరం ఈ పరిణామాలు సంభవించాయి. ఆరోపణలెదుర్కొంటున్న ఆటగాళ్లు వన్డే, ట్వంటీ-20 టోర్నీ నుండి తప్పించినట్లు తొలుత పాక్‌ క్రికెట్‌ జట్టు మేనేజర్‌ యావర్‌ సరుూద్‌ ప్రకటించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్‌ హై కమీషనర్‌ వాజిద్‌ ఎస్‌ హసన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్లు తమంతటతామే ఇంగ్లండ్‌తో జరుగనున్న టోర్నీల నుండి వైదొలిగనుట్లు ప్రకటించడం గమనార్హం. అంతేగాకుండా ఈ క్రికెటర్లపై వచ్చిన ఆరోపణలు నిరూపితమయ్యేంతవరకు వారిని నిర్దోషులుగానే పరిగణిస్తామని కూడా ఆయన అన్నారు. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై విచారణ ఇంకా జరుగుతుందని హసన్‌ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.<br />
స్కాట్లాండ్‌ యార్డ్‌ నివేదికను పాక్‌తో పంచుకుంటాం: బ్రిటన్‌ హైకమీషనర్‌<br />
ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ క్రికెటర్లపై వచ్చిన స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలను దర్యాప్తు చేస్తున్న స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసుల నివేదికను పాక్‌ దేశంతో పంచుకుంటామని పాిస్థాన్‌లోని బ్రిటన్‌ హై కమీషనర్‌ పీటర్‌ టిబ్బర్‌ గురువారంనాడు అన్నారు. పాకిస్థాన్‌ అంతరంగిక వ్వవహారాల మంత్రి రెహ్మాన్‌ మలిక్‌తో జరిగిన సమావేశం సందర్భంగా టిబ్బర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.<br />
ఆసిఫ్‌ పై సాక్ష్యాల్ని ఐసీసీ కి అందజేసిన వీణా<br />
లాహోర్‌: మాజీ ప్రియుడు పాక్‌ క్రికెటర్‌ మహమ్మద్‌ ఆసిఫ్‌కు బుకీలతో సంబంధాలున్నాయని తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాల్ని పాక్‌ మోడల్‌ వీణా మాలిక్‌ ఐసీసీకి సమర్పించింది. స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి చెందిన అధికారి హసన్‌ రజాకు అందజేశానని ఆమె ఒక టీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేగాకుండా తాను చేసిన ఆరోపణలన్నింటికీ కట్టుబడి ఉన్నానని కూడా వీణా తెలిపింది. మొత్తం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డే మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో కూరుకుపోయి ఉందని మరోసారి వీణా మరోసారి పునరుద్ఘాటించింది. హసన్‌ రజా వీణాను బుధవారం సాయంత్రం ఆమె నివాసంలో కలిసారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%86-%e0%b0%ae%e0%b1%81%e0%b0%97%e0%b1%8d%e0%b0%97%e0%b1%81%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%a8%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b0%ae%e0%b0%a3/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>మూడో స్థానానికి పడిపోయిన సైనా</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%8b-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%8b-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8/#comments</comments>
		<pubDate>Fri, 03 Sep 2010 03:23:04 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[క్రీడా వార్తలు]]></category>
		<category><![CDATA[జాతీయం]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=49424</guid>
		<description><![CDATA[
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓటమిపాలవడంతో తాజా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ర్యాంకు రెండో ర్యాంకు నుండి [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/09/03.09.012.jpg"><img class="alignnone size-full wp-image-49425" title="03.09.01" src="http://ankusam.com/wp-content/uploads/2010/09/03.09.012.jpg" alt="03.09.01" width="170" height="177" /></a><br />
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓటమిపాలవడంతో తాజా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ర్యాంకు రెండో ర్యాంకు నుండి మూడో స్థానానికి పడిపోయింది. గురువారంనాడు ఈ జాబితాను విడుదల చేశారు. ప్రస్తుతం సైనా 64791.2637 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. చైనాకు చెందిన గ్జిన్‌ వాంగ్‌ రెండో స్థానంలో ఉండగా, అదే దేశానికి చెందిన యిహాన్‌ వ్యాంగ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ, సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌తో పాటు, ఇండొనేషియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీల్లో వరుస విజయాలతో సైనా ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణిగా అవతరించి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%8b-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a5%e0%b0%be%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%a1%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%af%e0%b0%bf%e0%b0%a8/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో సియాగ్రామ్‌ ఫ్యూయల్‌ ఒప్పందం</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e2%80%8c%e0%b0%aa%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d%e2%80%8c-%e0%b0%ab%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e2%80%8c%e0%b0%aa%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d%e2%80%8c-%e0%b0%ab%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95/#comments</comments>
		<pubDate>Fri, 03 Sep 2010 03:22:05 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[క్రీడా వార్తలు]]></category>
		<category><![CDATA[జాతీయం]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=49421</guid>
		<description><![CDATA[
ప్రఖ్యాత ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో వైన్స్‌, స్పిరిట్స్‌ అగ్రగామి సంస్థ అయిన పెర్నాడ్‌ రికార్డ్‌కు చెందిన సియాగ్రామ్స్‌ ఫ్యూయల్‌ బ్రాండ్‌ జట్టు కట్టింది. [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/09/03.09.02.jpg"><img class="size-full wp-image-49422 alignleft" title="03.09.02" src="http://ankusam.com/wp-content/uploads/2010/09/03.09.02.jpg" alt="03.09.02" width="180" height="174" /></a><br />
ప్రఖ్యాత ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో వైన్స్‌, స్పిరిట్స్‌ అగ్రగామి సంస్థ అయిన పెర్నాడ్‌ రికార్డ్‌కు చెందిన సియాగ్రామ్స్‌ ఫ్యూయల్‌ బ్రాండ్‌ జట్టు కట్టింది. భారతీయ ఫుట్‌బాల్‌ అభిమానులకు ఉత్తేజాన్ని ఇచ్చేలా వీటి మధ్య అనుబంధం కుదిరింది. పెర్నాడ్‌ రికార్డ్‌ ఇండియా వైస్‌ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) విక్రమ్‌ బసు ఈ ఒప్పంద విశేషాలను వెల్లడించారు. భారత్‌లో క్రీడలకు సంబంధించి ఫ్యూయల్‌ బ్రాండ్‌ ఈ విధమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇదే తొలిసారని ఆయన తెలిపారు. లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ నిపుణులైన ఆటగాళ్ళను కలిగిఉందని కితాబునిచ్చారు.<br />
లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ కమర్షియల్‌ డైరెక్టర్‌ ఇయాన్‌ ఆరె మాట్లాడుతూ బార్‌క్లేస్‌ ప్రీమియర్‌ లీగ్‌, మరీ ముఖ్యంగా లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ భారత్‌లో ప్రాచుర్యం పొందుతున్నదనేందుకు ఈ ఒప్పందమే నిదర్శనమని అన్నారు. భారతీయ ఫుట్‌బా ల్‌ అభిమానులను అలరించేందుకు తాము కట్టుబడి ఉన్నామనేందుకు ఈ ఒప్పందమే ప్రతీక అని పేర్కొ న్నారు. ఇంగ్లాండ్‌కు చెందిన అత్యంత విజయవం తమైన జట్టుగా లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ 40 ప్రముఖ అవార్డులను పొందింది. ఎప్పటికప్పుడు పటిష్ఠమవుతూ వచ్చిన తమ క్లబ్‌ నూతన, వినూత్న భాగస్వామ్యాల కోసం చూస్తోందన్నారు. లివర్‌పూల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌లో ఎంతో మంది ప్రఖ్యాత ఆటగాళ్ళు ఉన్నారని, క్లబ్‌కు ఎంతో ఉన్నత స్థాయి చరిత్ర ఉందని పేర్కొన్నారు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e2%80%8c%e0%b0%aa%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d%e2%80%8c-%e0%b0%ab%e0%b1%81%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c%e0%b0%ac%e0%b0%be%e0%b0%b2%e0%b1%8d%e2%80%8c-%e0%b0%95/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
		<item>
		<title>డోపింగ్‌లో దొరికిన భారత అథ్లెట్లు</title>
		<link>http://ankusam.com/flash-news/%e0%b0%a1%e0%b1%8b%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a6%e0%b1%8a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4/</link>
		<comments>http://ankusam.com/flash-news/%e0%b0%a1%e0%b1%8b%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a6%e0%b1%8a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4/#comments</comments>
		<pubDate>Fri, 03 Sep 2010 03:21:10 +0000</pubDate>
		<dc:creator>Ankusam</dc:creator>
				<category><![CDATA[Flash News]]></category>
		<category><![CDATA[అంతర్జాతీయం]]></category>
		<category><![CDATA[క్రీడా వార్తలు]]></category>
		<category><![CDATA[జాతీయం]]></category>

		<guid isPermaLink="false">http://ankusam.com/?p=49418</guid>
		<description><![CDATA[
డోపింగ్‌ సెగ భారత్‌కు తాకింది. దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ టోర్నీలో దేశానికి పతకాలు సాధించిపెడతారని అనుకున్న అథ్లెట్లు డోపింగ్‌ పరీక్షల్లో దొరికిపోయారు. వీరిలో షాట్‌పుట్‌ ఆటగాడు [...]]]></description>
			<content:encoded><![CDATA[<p><a href="http://ankusam.com/wp-content/uploads/2010/09/03.09.03.jpg"><img class="alignnone size-full wp-image-49419" title="03.09.03" src="http://ankusam.com/wp-content/uploads/2010/09/03.09.03.jpg" alt="03.09.03" width="150" height="175" /></a><br />
డోపింగ్‌ సెగ భారత్‌కు తాకింది. దేశంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ టోర్నీలో దేశానికి పతకాలు సాధించిపెడతారని అనుకున్న అథ్లెట్లు డోపింగ్‌ పరీక్షల్లో దొరికిపోయారు. వీరిలో షాట్‌పుట్‌ ఆటగాడు సౌరవ్‌ విజ్‌, ఆకాశ్‌ అంతిల్‌ ఉన్నారు. ఈ ఇద్దరు గత నెల జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షల్లో విఫలమయ్యారని అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎఫ్‌ఐ) గురువారంనాడు ప్రకటించింది. అంతేగాకుండా విచారణ పూర్తయ్యేంత వరకు ఈ ఇద్దరు అథ్లేట్లను సస్పెండ్‌ చేస్తున్నట్లు ఏఎఫ్‌ఐ కార్యదర్శి రవీందర్‌ చౌదరీ ఆ ప్రకటనలో తెలిపారు.<br />
గత నెల అగస్టు 5 నుండి 8 వ తేదీ వరకు పటియాలాలో జరిగిన అంతరాష్ట్ర సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నాడా నిర్వహించిన పరీక్షల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు శాంపిల్లు పాజిటివ్‌గా వచ్చాయని ఆయన అన్నారు. డిల్లీకి చెందిన సౌరవ్‌ ఇప్పటికే కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొననున్న అథ్లెటిక్స్‌ జట్టులో చోటు సంపాదించాడు. అయితే డోపింగ్‌ పరీక్షల్లో దొరికిపొవడంతో అతడు తనకు లభించిన అమూల్యమైన అవకాశాన్ని కోల్పోయాడు. పాటియాలోలో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో 19.91 మీటర్ల దూరం వరకు షాట్‌పుట్‌ను వేసి రెండో స్థానంలో సౌరవ్‌ నిలిచాడు.</p>
]]></content:encoded>
			<wfw:commentRss>http://ankusam.com/flash-news/%e0%b0%a1%e0%b1%8b%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a6%e0%b1%8a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4/feed/</wfw:commentRss>
		<slash:comments>0</slash:comments>
		</item>
	</channel>
</rss>
